కేవలం 39,999 రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ డిటెల్ స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. డిటెల్ కంపెనీ విడుదల చేసిన ఈ స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు ఈజీ ప్లస్. ఈజీ ప్లస్ అని పిలువబడే కొత్త స్కూటర్ రైడ్-షేరింగ్ మరియు డెలివరీ వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది. డిటెల్ ఈజీ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం 39,999 రూపాయలు మాత్రమే.

కేవలం 39,999 రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

డిటెల్ కంపెనీ యొక్క ఈ ఈజీ ప్లస్ స్కూటర్‌ ఫ్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. దీనిని రూ. 1,999 టోకెన్ మొత్తానికి బ్రాండ్ వెబ్‌సైట్‌లో ప్రీ-బుక్ చేసుకోవచ్చు. రైడ్ ఆసియా ఎక్స్‌పోలో ఈ-స్కూటర్ వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 20AH లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది.

కేవలం 39,999 రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 4 నుంచి 5 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఇది ఒకే ఛార్జీతో దాదాపు 60 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇందులో 250 వాట్స్ హబ్-మౌంటెడ్ బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది ఈ స్కూటర్ ని గంటకు 25 కిలోమీటర్ల వేగంతో రైడ్ చేయడానికి అనుమతిస్తుంది.

MOST READ:హైదరాబాద్‌ నగరంలో 40 మందికి పైగా వాహనదారులు అరెస్ట్.. కారణం ఇదే

కేవలం 39,999 రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

ఈ స్కూటర్ చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది. ఈజీ ప్లస్ స్కూటర్ చాలా తక్కువ బాడీ ప్యానెల్లను కలిగి ఉంది. ఇది రైడర్ మరియు పిలియన్ కోసం సింగిల్-పీస్ సీటును కలిగి ఉంది. ఇ-స్కూటర్‌లో రౌండ్ ఆకారంలో ఉండే హెడ్‌ల్యాంప్ మరియు అడ్డంగా ఉంచిన టైల్ లాంప్ మరియు రెండూ ఎల్‌ఇడి యూనిట్లు ఉంటాయి.

కేవలం 39,999 రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఇది స్కూటర్ పరిధిని విస్తరించడంలో సహాయపడటానికి పెడల్ మెకానిజంతో వస్తుంది.

MOST READ:ఔరా.. ఇదేమి సిత్రం.. ట్రక్ డ్రైవర్‌కి హెల్మెట్ లేదని ఫైన్.. ఎక్కడో తెలుసా

కేవలం 39,999 రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

డిటెల్ స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మెటాలిక్ రెడ్, పెర్ల్ వైట్, గన్‌మెటల్, మెటాలిక్ బ్లాక్ మరియు మెటాలిక్ ఎల్లో వంటి వివిధ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ 170 కేజీల బరువును మోసే సామర్థ్యంతో వస్తుంది. ఈ స్కూటర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కూడా ఉంది.

కేవలం 39,999 రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

భారతదేశమంతా ప్రీపెయిడ్ రోడ్‌సైడ్ అసిస్ట్ ప్యాకేజీతో అన్ని బైక్‌లు విక్రయించబడతాయి. ఇందులో ఏమైనా సలహాలు మరియు సహాయం కోసం కస్టమర్ కి టోల్ ఫ్రీ నంబర్‌ కూడా వినియోగంలో ఉంటుంది. ఈ వాహనం కొనుగోలుచేసి తర్వాత కంపెనీ సర్వీస్ కూడా అందించనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 1 ఇయర్ స్టాండర్డ్ వారంటీని కూడా పొందుతుంది.

MOST READ:ఒక ఏడాదిలో టోల్ బూత్‌లన్నీ మాయం; జిపిఎస్ ఆధారంగా టోల్ వసూలు!

కేవలం 39,999 రూపాయలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

డిటెల్ ఈజీ ప్లస్ ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది స్కూటర్‌ను ఆపరేట్ చేయడానికి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ అతి తక్కువ ధర కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది. ఇది నగర ట్రాఫిక్ లో కూడా చాలా సులువుగా రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Detel Easy Plus Electric Launched In India At Rs 39,999. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X