Just In
- 1 hr ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 1 hr ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 2 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 3 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Movies Anasuya Bharadwaj: "నేను జబర్దస్త్ మానేయడానికి కారణం అదే.. పవన్ కల్యాణ్ చెప్తే ఆ పని చేస్తా"
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఉద్యోగులకు మర్చిపోలేని కానుక ఇచ్చిన పయనీర్ ఆసియా గ్రూప్!
తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్న పయనీర్ ఆసియా గ్రూప్ హీరో ఎలక్ట్రిక్ నుంచి పదికి పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసింది. తమ ఉద్యోగులు రోజు ఫ్యాక్టరీకి వచ్చి, వెళ్లడానికి వీలుగా ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉపయోగించనున్నారు.
ఫైర్క్రాకర్ ఉత్పత్తికి పేరుగాంచిన శివకాసి నగరంలో ఉన్న పయనీర్ ఆసియా గ్రూప్, తమ ఉద్యోగుల ఉపయోగం కోసం మొత్తం 12 ఎలక్ట్రిక్ స్కూటర్లను హీరో ఎలక్ట్రిక్ నుండి కొనుగోలు చేసింది. ఇవన్నీ హీరో ఎలక్ట్రిక్ బ్రాండ్ అందిస్తున్న లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.
హీరో ఎలక్ట్రిక్ ఇటీవల పట్టణ ఉపయోగం కోసం ఆప్టిమా హెచ్ఎక్స్ అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసినదే. ఇదే స్కూటర్లను ప్రస్తుతం పయనీర్ ఆసియా గ్రూప్ కొనుగోలు చేసింది.
MOST READ:భారత్లో కంపాస్ ఫేస్లిఫ్ట్ ఎస్యూవీ ఆవిష్కరించిన జీప్ : పూర్తి వివరాలు
పయనీర్ ఆసియా గ్రూప్కు మొదటి 12 ఇ-బైక్లను పంపిణీ చేశామని, తదుపరి ఆదేశాల కోసం ఈ బృందంతో చర్చలు జరుపుతున్నామని హీరో ఎలక్ట్రిక్ పేర్కొంది. పయనీర్ ఆసియా గ్రూప్ ఫ్యాక్టరీ కార్మికులతో సహా 400 మందికి పైగా ఉద్యోగులతో దేశంలోనే అతిపెద్ద మ్యాచ్ ప్రొడ్యూసర్గా ఉంది.
ఈ గ్రూపుతో భాగస్వామ్యం కావడం మరియు ఉద్యోగుల ప్రయాణం కోసం పర్యావరణ సాన్నిహిత్యమైన వాహనాలను అందించడం తమకెంతో సంతోషంగా ఉందని హీరో ఎలక్ట్రిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోహిందర్ గిల్ అన్నారు.
MOST READ:గుడ్ న్యూస్.. మళ్ళీ భారత్లో అడుగుపెట్టనున్న టాటా సఫారి : వివరాలు
సిటీ స్పీడ్ వేరియంట్ ఆప్షన్ను పెంచే లక్ష్యంతో హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా హెచ్ఎక్స్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కు కస్టమర్లు మరియు వివిధ సంస్థల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.
హీరో ఎలక్ట్రిక్ ఇటీవలే ఒక ప్రైవేట్ డెలివరీ మరియు రెంటల్ సర్వీస్ కంపెనీకి వెయ్యి యూనిట్ల ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. తాజాగా, పయనీర్ ఆసియా గ్రూప్ 12 కొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసింది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.
MOST READ:అద్భుతంగా ఉన్న ఫోక్స్వ్యాగన్ టైగన్ టీజర్.. ఓ లుక్కేయండి
హీరో ఎలక్ట్రిక్ అందిస్తున్న ఆప్టిమా హెచ్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ పర్యావరణ సాన్నిహిత్యమైనది, సమర్థవంతమైనది మరియు విస్తృత శ్రేణి ఫీచర్లను కలిగి ఉంటుంది. మార్కెట్లో హీరో ఆప్టిమా హెచ్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర ప్రారంభ ధర రూ.71,950 నుండి మొదలువుతుంది.
ఈ స్కూటర్లో 550 వాట్ల సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 51.2 వోల్ట్ / 30 యాంపియర్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో పనిచేస్తుంది. ఒకే ఛార్జీపై ఇది సుమారు 82 కి.మీ రేంజ్ను ఆఫర్ చేస్తుంది.
MOST READ:ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా హెచ్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టం వేగం గంటకు 42 కి.మీ. ఇది తక్కువ రన్నింగ్ కాస్ట్ మరియు అధిక పనితీరుతో డబ్బుకు తగిన ఉత్తమ విలువను అందిస్తుందని కంపెనీ తెలిపింది.