Just In
- 14 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 15 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 16 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 17 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న Hero Electric మరియు Charzer
భారతదేశపు అగ్రగామి ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ (Hero Electric), బెంగళూరుకు చెందిన EV ఛార్జింగ్ స్టార్ట్-అప్ అయిన చార్జర్ (Charzer) తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, చార్జర్ మొదటి సంవత్సరంలో హీరో ఎలక్ట్రిక్ సహకారంతో భారతదేశంలోని టాప్ 30 నగరాల్లో 10,000 ఛార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తుంది. ఇరు కంపెనీలు కలిసి వచ్చే మూడేళ్లలో మొత్తం 1,00,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.
అంతేకాకుండా, ఈ స్టార్ట్-అప్ కంపెనీ వినియోగదారులకు ఛార్జింగ్ సౌకర్యాన్ని సులభతరం చేయడానికి హీరో ఎలక్ట్రిక్ డీలర్షిప్లలో కిరానా చార్జర్ (Kirana Charzer) కూడా అమలు చేయనుంది. అలాగే, యూజర్లకు సమీపంలో ఉండే ఛార్జింగ్ స్టేషన్ లు మరియు బుకింగ్ స్లాట్ లను గుర్తించడానికి EV యజమానుల కోసం Charzer ఓ మొబైల్ అప్లికేషన్ ను మరియు ప్రత్యేకమైన వెబ్సైట్ ను కూడా అందిస్తుంది.
ఎలక్ట్రిక్ వెహికల్ రైడర్ లు సబ్స్క్రిప్షన్ ఆధారిత మోడల్లో ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని చార్జర్ అందించనుంది. Charzer అనేది పబ్లిక్ స్థలాలు, అపార్ట్మెంట్ లు మరియు కార్యాలయాల వద్ద ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ సొల్యూషన్ లను అందించే EV స్టార్ట్-అప్ కంపెనీ. ఇది బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సంస్థ అందించే ఈవీ ఛార్జర్ లు అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూలంగా ఉంటాయి.
చార్జర్ ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్ ఆధారంగా, ధృవీకరించబడిన నిపుణుల ద్వారా ఈ చార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తుంది మరియు సర్వీస్ అందిస్తుంది. ఈ కంపెనీ ప్రస్తుతం బెంగళూరు, పూణె, ఢిల్లీ, హైదరాబాద్, మంగళూరు మరియు విశాఖపట్నంతో సహా 20 నగరాల్లో తన ఉనికిని కలిగి ఉంది. ఈ సహకారం ద్వారా, Charzer తన B2B (బిజినెస్ టూ బిజినెస్) వ్యాపారంలో హీరో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ భాగస్వామిగా ఉంటుంది.
ఈ సహకారం గురించి హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) అభివృద్ధికి బలమైన మరియు సుసంపన్నమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ కీలకమని తమ కంపెనీ విశ్వసిస్తోందని అన్నారు. ఈ అసోసియేషన్ దేశంలో EV ల వృద్ధికి సహాయపడుతుందని మరియు Charzer ద్వారా అమర్చబడిన ఈవీ ఛార్జర్లతో ఛార్జింగ్ స్లాట్ బుకింగ్ మరియు పేమెంట్ని ఏకీకృతం చేయడం ద్వారా కస్టమర్లకు ఇబ్బందులు లేని ఛార్జింగ్ అనుభవాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు.
భారతదేశంలో EV ల వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథం మరియు నిబద్ధతతో, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచడానికి ఈ రెండు బ్రాండ్లు కృషి చేస్తున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా, ప్రజల దృష్టిని ఈవీల వైపు ఆకర్షించడం, క్లీనర్ మరియు గ్రీన్ మొబిలిటీ సొల్యూషన్ను ప్రోత్సహించడమే తమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు హీరో ఎలక్ట్రిక్ తెలిపింది.
దేశవ్యాప్తంగా కొత్తగా మరో 1,000 సేల్స్ టచ్ పాయింట్లు: హీరో ఎలక్ట్రిక్
ఇదిలా ఉంటే, హీరో ఎలక్ట్రిక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 - 2022) ముగిసే నాటికి దేశవ్యాప్తంగా కొత్తగా మరో 1,000 సేల్స్ టచ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 కొత్త సేల్స్ టచ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. కేవలం తన సేల్స్ టచ్పాయింట్లను పెంచడమే కాకుండా, ఎలక్ట్రిక్ టూవీలర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.
గత ఏడాదితో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు విక్రయాలకు అనుగుణంగా తమ ఎలక్ట్రిక్ టూవీలర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. హీరో ఎలక్ట్రిక్ భారతదేశం అంతటా 500 నగరాల్లో సానుకూల విక్రయాలను కలిగి ఉంది మరియు ఈ నగరాల్లో 700 కంటే ఎక్కువ సేల్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్ లను నిర్వహిస్తోంది.
భారతదేశంలో హీరో ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 4,00,000 లకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. హీరో ఎలక్ట్రిక్ ప్రస్తుతం భారత మార్కెట్లో కంఫర్ట్ స్పీడ్ మరియు సిటీ స్పీడ్ విభాగంలో స్కూటర్లను విక్రయిస్తోంది.
కంఫర్ట్ స్పీడ్ విభాగంలో అట్రియా (Atria), ఫ్లాష్ (Flash) మరియు ఆప్టిమా (Optima) ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, వీటి గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపడానికి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు.
అలాగే, సిటీ స్పీడ్ విభాగంలో ఆప్టిమా హెచ్ఎక్స్ (Optima HX), ఎన్వైఎక్స్ హెచ్ఎక్స్ (NYX HX) మరియు ఫోటాన్ హెచ్ఎక్స్ (Photon HX) మోడళ్లను విక్రయిస్తోంది. ఈ స్కూటర్ల గరిష్ట వేగం (టాప్ స్పీడ్) గంటకు 42 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ సిటీ స్పీడ్ రేంజ్ స్కూటర్లను నడపడానికి రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.