మీకు తెలుసా.. హీరో మోటోకార్ప్ ఫ్రీ సర్వీస్ & వారంటీ ఇప్పుడు జులై 31 వరకు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ యొక్క తీవ్రత రోజురోజుకి చాలా ఎక్కువవుతోంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే ఎంతోమంది ప్రజలు మరణించారు. అంతే కాకుండా లెక్కకుమించిన జనం ఈ వైరస్ బారినపడి కొట్టుమిట్టాడుతున్నారు. ఈ మహమ్మరి ప్రభావం వల్ల దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించబడింది.

ఈ లాక్ డౌన్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులుపడుతున్నారు. ఈ కరోనా వైరస్ ప్రభావం కేవలం ప్రజలమీద మాత్రమే కాకుండా ఆటో పరిశ్రమపై కూడా పడింది.ఈ కారణంగా వాహనాల అమ్మకాలు భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా చాలా కంపెనీలు తమ వినియోగదారులకు అందుబాటులో ఉండటానికి ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో వారంటీ మరియు ఫ్రీ సర్వీస్ వంటి వాటి సమయాన్ని పొడిగించాయి.

ఈ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో, హీరో మోటోకార్ప్ కంపెనీ తన వినియోగదారుల సౌకర్యార్థం వాహనాలపై ఫ్రీ సర్వీస్ మరియు వారంటీని రెండు నెలల వరకు పొడిగించింది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఫ్రీ సర్వీస్ మరియు వారంటీ టైమ్ ముగిసే వాహనాలకు వచ్చే 60 రోజులకు పొడిగించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం ఫ్రీ సర్వీస్ మరియు వారంటీ టైమ్ జులై 3 వరకు పొడిగించినట్లు నివేదికలు తెలిపాయి. అంటే ఇప్పుడు ఫ్రీ సర్వీస్ మరియు వారంటీ టైమ్ ఏప్రిల్ 1 నుండి మే 31 వరకు అందుబాటులో ఉంటుంది. కావున వాహన వినియోగదారులు ఈ సమయంలో ఈ సర్వీస్ వినియోగించుకోవచ్చు.

హీరో మోటోకార్ప్ ఫ్రీ సర్వీస్ మరియు వారంటీ టైమ్ వ్యవధిని పెంచినట్లు ప్రకటించకముందే హోండా మోటార్సైకిల్ కంపెనీ కూడా తమ ఫ్రీ సర్వీస్ మరియు వారంటీ టైమ్ పొడినించినట్లు తెలిసింది. హీరో మోటోకార్ప్ గురుగ్రామ్, ధారుహేరా మరియు హరిద్వార్ లోని తయారీ కర్మాగారాలలో 2021 మే 17 నుండి ఉత్పత్తిని ప్రారంభించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా కంపెనీ ఏప్రిల్ 22 నుండి మే 16 వరకు అన్ని ప్లాంట్లను మూసివేసింది.

భారతదేశంలో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఈ మహమ్మారిని నివారించడానికి ప్రభుతం శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో ప్రభుత్వానికి అండగా చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇందులో దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధి పొందిన హీరో మోటోకార్ప్ కూడా ఉంది.

కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ (సిఎస్ఆర్) ప్లాట్ఫాం "హీరో వీకేర్" కింద, హీరో మోటోకార్ప్ తన కోవిడ్ -19 ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని కంఖల్ రామకృష్ణ మిషన్ సేవాశ్రామ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఇందులో భాగంగా కంపెనీ ప్రస్తుతం హర్యానాలోని ధారుహేరా మరియు చుట్టుపక్కల ఏడు ఆసుపత్రులలో, ఉత్తరాఖండ్లోని నాలుగు ఆస్పత్రులు, గురుగ్రామ్, హర్యానాలోని నాలుగు ఆసుపత్రులు, జైపూర్లోని మూడు ఆసుపత్రులు, ఒకటి. రాజస్థాన్లోని అల్వార్, గుజరాత్లోని హలోల్లో కూడా తగిన సౌకర్యాలను కల్పిస్తోంది.

వీటితోపాటు హీరో మోటోకార్ప్ ఢిల్లీ మరియు హర్యానాలోని కొన్ని ఆసుపత్రులలో అత్యవసర వైద్య ఉపయోగం కోసం ఆక్సిజన్ సిలిండర్లను కూడా అందిస్తోంది. అంతే కాకుండా కంపెనీ ఆరోగ్య కార్యకర్తల ఉపయోగం కోసం వివిధ రాష్ట్రాల్లోని పిపిఇ కిట్లను విరాళంగా ఇస్తోంది. దేశంలో కరోనా బాధితులకు హీరో మోటోకార్ప్ కంపెనీ ఉదారంగా తన సేవలను అందిస్తోంది.


Click it and Unblock the Notifications








