Just In
- 17 hrs ago ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- 18 hrs ago నానో కంటే చిన్న కారు ఉందని మీకు తెలుసా.. టాటా మోటార్స్కు ఆ కారు చాలా ప్రత్యేకం
- 18 hrs ago అందం బైక్ రైడ్ చేస్తే ఇలాగే ఉంటుందా? మతిపోగొడుతున్న వీడియో
- 19 hrs ago BYD SEAL ఎలక్ట్రిక్ సెడాన్ డిజైన్, ఫీచర్లు, బ్యాటరీ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ వీడియో
Don't Miss
- Movies Guppedantha Manasu April 23rd: మను కన్నతండ్రి అతడేనట.. షాక్లో వసు, దత్తత జరిగేనా!
- News పవన్ కల్యాణ్ అఫిడవిట్లో ఏముంది?
- Sports చరిత్ర సృష్టించిన జైస్వాల్.. కోహ్లి సరసన!
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
మళ్ళీ పెరిగిన హీరో బైక్స్ & స్కూటర్స్ ధరలు; వివరాలు
భారత మార్కెట్లో అతి పెద్ద బైక్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన హీరో మోటోకార్ప్ ఇటీవల తన బ్రాండ్ యొక్క బైకులు మరియు స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ధరల పెరుగుదల 2021 జులై 01 నుంచి అమల్లోకి రానుంది. కంపెనీ యొక్క ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల వాహనాల తయారీ ఖర్చు కూడా పెరిగిందని కంపెనీ తెలిపింది.
ఈ పరిస్థితిలో సంస్థ వాహనాల ధరలను పెంచడం ద్వారా కంపెనీ యొక్క అధిక ధరల భారాన్ని తగ్గించబడాలచింది. ధరల పెరుగుదల తర్వాత కూడా వినియోగదారులపై అధిక భారం పడకుండా కంపెనీ జాగ్రత్త తీసుకోవడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలిపింది.
కంపెనీ నివేదికల ప్రకారం 2021 జూలై 1 నుంచి తన ద్విచక్ర వాహనాల ధరలు రూ. 3,000 వరకు పెరుగుతుంది. ఈ ధరల పెరుగుదల కూడా మోడల్ మరియు వేరియంట్ ఆధారంగా ఉంటుంది. ఈ సంవత్సరం కంపెనీ తమ వాహనాల ధరలను పెంచడం వరుసగా ఇది మూడవసారి. కంపెనీ ఈ ఏడాది జనవరి మరియు ఏప్రిల్ నెలల్లో ధరలను పెంచిన విషయం అందరకి తెలిసిందే.
హీరో మోటోకార్ప్ యొక్క అమ్మకాల విషయానికి వస్తే, కంపెనీ గత నెలలో అంటే 2021 మే నెలలో మొత్తం 1,83,044 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. అదేవిధంగా 2020 మే నెలలోని అమ్మకాలు మొత్తం 1,12,682 యూనిట్లు. ఏప్రిల్ 2021 తో పోల్చితే మే 2021 లో కంపెనీ తక్కువ అమ్మకాలు జరిపినట్లు తెలిసింది.
కంపెనీ నివేదికల ప్రకారం, 2021 ఏప్రిల్ నెలలో 372,285 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించగా, 2021 మే నెలలో 1,78,076 మోటార్ సైకిళ్ళు, 4,338 స్కూటర్లను విక్రయించినట్లు తెలిసింది. అదే సమయంలో 2021 ఏప్రిల్లో 3,39,329 యూనిట్ల మోటార్సైకిళ్లు, 32,956 యూనిట్ల స్కూటర్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా ముడి పదార్థాలైన స్టీల్, ప్లాస్టిక్ ఖర్చులు అమాంతం పెరుగుతున్నాయి. అంతే కాకుండా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటం వల్ల కంపెనీకి సంబంధించిన మొత్తం కార్యకలాపాలు నిలిపివేయడం జరిగింది. ఈ కారణంగానే కంపెనీ తన బ్రాండ్ వాహనాలపై ధరలను పెంచవలసి వచ్చింది.
కరోనా సెకండ్ వేవ్ కారణంగానే కంపెనీ యొక్క అమ్మకాలు మరియు ఉత్పత్తి చాలా వరకు తగ్గింది. అయితే కంపెనీ ఇప్పుడు తమ వాహన ధరలను పెంచుడం వల్ల అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఏమైనా ఉందా అనే విషయం త్వరలో తెలుస్తుంది.