Just In
- 2 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 3 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 4 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 5 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
2021 కవాసకి నింజా 300 బుక్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేసి వోచర్ పొందండి
జపనీస్ టూవీలర్ కంపెనీ అయిన కవాసకి ఇటీవల భారత మార్కెట్లో తన 2021 నింజా 300 బిఎస్ 6 వెర్షన్ విడుదల చేసింది. అయితే ఈ కొత్త కవాసకి నింజా 300 బిఎస్ 6 బుకింగ్స్ ఇప్పుడు అమెజాన్ ఇండియా వెబ్సైట్ ఆన్లైన్లో కూడా చేయవచ్చు. అమెజాన్ ఇండియా యొక్క వెబ్సైట్ లేదా అప్లికేషన్లో రూ. 3,000 చెల్లించి వినియోగదారులు ప్రీ-బుకింగ్ వోచర్లను కొనుగోలు చేయవచ్చు.
ఈ కవాసకి బైక్ కోసం దగ్గరగా ఉన్న డీలర్షిప్లో వోచర్లను రీడీమ్ చేయవచ్చు. బైక్ ధర చెల్లించేటప్పుడు ఈ వోచర్ మొత్తాన్ని తగ్గించబడుతుంది. అయితే డీలర్షిప్ వద్ద, కస్టమర్ వోచర్ యొక్క ఒరిజినల్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది. వోచర్ యొక్క ఫోటోకాపీ లేదా డిజిటల్ ఫోటో దీనికి చెల్లదు.
మీరు వోచర్ ద్వారా బైక్ కొనుగోలు చేస్తే వెంటనే డెలివరీకి హామీ ఇవ్వలేమని కంపెనీ అధికారికంగా పేర్కొంది. వోచర్ను రీడీమ్ చేసిన తర్వాత, దాన్ని మళ్లీ ఉపయోగించలేరు. ఈ వోచర్ సంస్థ యొక్క అధికారిక డీలర్షిప్లో మాత్రమే రీడీమ్ చేయబడుతుంది. బుక్ చేసే సమయానికి అనుగుణంగా బైక్ యొక్క కలర్ మరియు తయారీ మారవచ్చని కంపెనీ పేర్కొంది.
MOST READ:హైదరాబాద్ నగరంలో 40 మందికి పైగా వాహనదారులు అరెస్ట్.. కారణం ఇదే
కవాసకి నింజా 300 బిఎస్ 6 ధర భారతీయ మార్కెట్లో రూ. 3.18 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్త బిఎస్ 6 కవాసకి నింజా తన బిఎస్ 4 మోడల్ కంటే రూ. 20,000 అధిక ధరను కలిగి ఉంటుంది. కవాసకి ఇండియా 2019 డిసెంబర్లో బిఎస్ 4 మోడల్ అమ్మకాలను నిలిపివేసింది.
కొత్త కవాసకి బిఎస్ 6 నింజా 300 యొక్క డిజైన్ విషయంలో పెద్ద మార్పులు చేయబడలేదు. ఈ బైక్ యొక్క డిజైన్ దాదాపు దాని పాత మోడల్ మాదిరిగానే ఉంచబడింది. అయితే, కవాసకి కొత్త నింజా 300 ను కొత్త పెయింట్ స్కీమ్ తో ప్రవేశపెట్టారు. కొత్త కవాసకి ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ పెయింట్ స్కీమ్ తో లభిస్తుంది.
MOST READ:ఒకరిపై ఒకరు కూర్చుని ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ చేసిన యువతులు [వీడియో]
కవాసకి నింజా 300 బిఎస్ 6 బైక్ లో 296 సిసి యొక్క అప్గ్రేడ్ ప్యారలల్ ట్విన్ బిఎస్ 6 ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజన్ 39 బిహెచ్పి పవర్ 27 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ మునుపటి ఎక్కువ పనితీరుని కలిగి ఉంటుంది. ఈ బైక్లో 6 స్పీడ్ గేర్బాక్స్తో స్లిప్పర్ క్లచ్ కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ బైక్ యొక్క మొత్తం బరువు ఇప్పుడు 179 కేజీలు. ఇది చాలా దృడంగా ఉంటుంది. నింజా 300 బైక్ లో 17-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఇందులో ఇంతపెద్ద ఫ్యూయెల్ ట్యాంక్ ఇవ్వడానికి ప్రదహన కారణం, లాంగ్ రైడ్ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది.
MOST READ:ఒక చార్జితో 300 కి.మీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు
కొత్త కవాసకి నింజా 300 బిఎస్ 6 బైక్ లో ఎంఆర్ఎఫ్ టైర్లు, స్టాండర్డ్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, ఈ ముందు భాగంలో 290 మిమీ సింగిల్ డిస్క్ మరియు వెనుక భాగంలో 220 మిమీ డిస్క్ బ్రేక్ లభిస్తుంది.
కవాసకి భారతదేశంలో అత్యంత సరసమైన 175 సిసి బైక్ను విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. గత ఏడాది అక్టోబర్లో ఈ 175 సిసి బైక్ను కంపెనీ వెల్లడించింది. ఈ బైక్ స్థానిక మార్కెట్లో తయారు చేయబడుతుంది. ఇది భారతదేశంలో కవాసకి కంపెనీ యొక్క అత్యంత సరసమైన బైక్ కానుంది.
MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్