Just In
- 9 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 11 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 13 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 14 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అడవిలో ప్రయాణించడానికి అనుకూలమైన బైక్ తయారుచేసిన NIT-K.. మీరు చూసారా..!!
భారతదేశంలో రోజురోజుకి టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో అనేక కొత్త వాహనాలు ఆధునిక ఫీచర్స్ తో ఆవిష్కరించబడుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో భాగంగానే 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - కర్ణాటక' (NIT-K) అడవిలో ప్రయాణించడానికి అనుకూలమైన ఒక బైక్ రూపొందించింది. ఈ బైక్ అడవిలో తిరగటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - కర్ణాటక (NIT-K), సూరత్కల్, అడవిలో ప్రయాణించడానికి పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ బైక్ను అభివృద్ధి చేసింది. ఈ బైక్లోని బ్యాటరీని సోలార్ పవర్ ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్తో డిటాచబుల్ హెడ్లైట్లు కూడా అమర్చబడి ఉంటాయి. కావున వీటిని రాత్రిపూట టార్చ్గా ఉపయోగించవచ్చు.
ఈ ఎలక్ట్రిక్ బైక్లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ మోటార్ సాధారణంగా పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుందని ఇన్స్టిట్యూట్ సెంటర్ ఫర్ సిస్టమ్స్ డిజైన్ మరియు ఇ-మొబిలిటీ ప్రాజెక్ట్స్ హెడ్ పృథ్వీరాజ్ తెలిపారు. అడవిలో ప్రయాణించేటప్పుడు ఎటువంటి సౌండ్ రాదు, అంతే కాకూండా ఈ వాహనం వల్ల వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అని వారు తెలిపారు.
ఈ బైక్ లో మీరు అడవిలో తిరిగేటప్పుడు, వేటగాళ్లు తప్పించుకునే అవకాశం లేకుండా వారిని పట్టుకోవడంలో ఇది సహాయపడుతుందని ఆయన అన్నారు. దీని ముందున్న ఒక బాక్స్ లో వాకీ టాకీ, బుక్ సహా అనేక వస్తువులు భద్రపరచుకోవచ్చని కూడా ఆయన అన్నారు.
ఈ ఎలక్ట్రిక్ బైక్లో మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకోవడానికి కావలసిన సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా వెనుక ఉన్న ఒక బాక్స్ లో అడిషినల్ యాక్ససరీస్ ఉంచుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. వేట నిరోధక శిబిరాలు లేదా లోతైన అటవీ ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ ఉపయోగకరంగా ఉంటుంది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - కర్ణాటకలోని వాటర్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ఓషన్ ఇంజినీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ, పార్క్ నిర్వహణకు ఫారెస్ట్ క్లర్క్ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కుద్రేముఖ్ నేషనల్ పార్క్లో ఉపయోగించేందుకు బైక్ను అభివృద్ధి చేసి, ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
ఈ ఎలక్ట్రిక్ బైక్ ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, దాదాపు 75 కి.మీ పరిధిని అందిస్తుంది. ఈ ఇ-బైక్ను అభివృద్ధి చేయడానికి దాదాపు మూడు నెలల సమయం పట్టింది. రెండో లాక్డౌన్ తర్వాత ఈ ప్రాజెక్ట్ కొంత వాయిదా పడిందన్నారు. కొత్తగా అభివృద్ధి చేయబడిన ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ పేరు 'ఎలక్ట్రో 4.0'.
ఈ ఎలక్ట్రిక్ బైక్లో BLDC ఎలక్ట్రిక్ మోటార్ను అమర్చారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 2.0 kW, 72 వోల్ట్, 33 AH లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ని సోలార్ పవర్తో ఛార్జ్ చేయవచ్చు. సోలార్ ఛార్జింగ్ సెటప్లో రెండు 400 వాట్ సోలార్ ప్యానెల్ మరియు బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 1.5 kW UPS యూనిట్ అందుబాటులో ఉన్నాయి.
నవంబర్ 17న కుద్రేముఖ్ వైల్డ్ లైఫ్ డివిజన్ నిర్వహించే షోలా ఫారెస్ట్ వర్క్షాప్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ను ఆవిష్కరించనున్నారు. ఇది చూడటానికి చాలా సింపుల్ గా మరియు చాలా ఆకర్షనీయంగా ఉంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా EV ఛార్జింగ్ స్టేషన్లు నిర్మిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి రెసిడెన్షియల్ సొసైటీలు, అపార్ట్మెంట్లు, పార్కులు మరియు షాపింగ్ మాల్స్లో కూడా ఛార్జింగ్ స్టేషన్లను నిర్మిస్తున్నారు.
పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల వినియోగం వల్ల దేశంలో కాలుష్యం యొక్క తీవ్రత చాలా ఎక్కువవుతోంది. అయితే ఈ కాలుష్యం యొక్క తీవ్రత ఢిల్లీలో మరింత ఎక్కువగా ఉంది. దీపావళి తర్వాత ఢిల్లీలో పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్య నివారణకు చాలా చర్యలు తీసుకుంటోంది.
ఢిల్లీ నగరంలోని 250 ప్రధాన రహదారులపై ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ నిషేధం. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకే ఈ తాత్కాలిక నిషేధం విధించబడింది మరియు అతిక్రమించే వాహనాలకు భారీ జరిమానా విధించబడుతుందని నివేదించబడింది. పర్యావరణ కాలుష్యాన్ని ఏ విధంగానూ కలిగించని ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ నిషేధం నుంచి మినహాయింపు ఉంది.
అయితే ఇవన్నీ గమనిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొస్తాయి. కావున రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలే అందుబాటులో ఉంటాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.