Just In
- 31 min ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 2 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 6 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 8 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
Don't Miss
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఈ స్కూటర్లకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు; ధర కూడా తక్కువే
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ విభాగంలో పెరుగుతున్న డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు కొత్త తయారీదారులు కూడా పుట్టుకొస్తున్నారు. తాజాగా, అహ్మదాబాద్కి చెందిన 'ఒడిస్ ఎలక్ట్రిక్ వెహికల్స్' అనే స్టార్టప్ కంపెనీ రెండు కొత్త స్కూటర్లను మార్కెట్లో విడుదల చేసింది.
లో-స్పీడ్ స్కూటర్ ఇ2గో అనే మోడల్ను ఒడిస్ ఎలక్ట్రిక్ కంపెనీ విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో లీడ్-యాసిడ్ మరియు లిథియం-అయాన్ బ్యాటరీలతో పనిచేసే వేరియంట్లు ఉన్నాయి.
మార్కెట్లో ఈ2గో స్టాండర్డ్ ధర రూ.52,999గా ఉంటే, ఈ2గో లైట్ ధర రూ.63,999గా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ అహ్మదాబాద్) ఉంది. ఈ రెండు మోడళ్లు మోడల్స్ అజూర్ బ్లూ, స్కార్లెట్ రెడ్, టీల్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్, మ్యాట్ బ్లాక్ అనే ఐదు రంగులో లభిస్తాయి.
MOST READ:టెస్లా ప్రియులకు శుభవార్త.. టెస్లా ఇప్పుడు భారత్కి వచ్చేస్తుందోచ్
కొత్త ఒడిస్ ఇ2గో ఎలక్ట్రిక్ స్కూటర్లో వాటర్ప్రూఫ్ 250వాట్ బిఎల్డిసి (బ్రష్లెస్ డిసి) మోటార్ ఉంటుంది. ఇది వేరియంట్ను బట్టి 28 ఆంపియర్ లీడ్-యాసిడ్ బ్యాటరీ లేదా 1.26 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్తో లభిస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జ్పై 60 కిలోమీటర్ల రేంజ్ను ఆఫర్ చేస్తుంది మరియు దీని బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేయడానికి కేవలం 3.5 గంటల నుండి 4 గంటల సమయం మాత్రమే పడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు.
MOST READ:డోనాల్డ్ ట్రంప్ వాడిన కారు వేలంలో పాల్గొంటున్న ఇండియన్, ఎవరో తెలుసా ?
ఒడిస్ అందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను రైడ్ చేయడానికి రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ అవసరం లేదు. ఒడిస్ ఇ2గో ఎలక్ట్రిక్ స్కూటర్లో ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో డ్యూయల్ స్ప్రింగ్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్లు ఉంటాయి. అలాగే ముందు మరియు వెనుక భాగంలో ట్యూబ్ లెస్ టైర్లు అమర్చబడి ఉంటాయి.
బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఇంకా ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, యాంటీ-తెఫ్ట్ మోటార్ లాకింగ్, కీలెస్ ఎంట్రీ, యుఎస్బి ఛార్జింగ్, రివర్స్ గేర్ ఫంక్షన్, మూడు రైడింగ్ మోడ్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:పేస్ మాస్క్ విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ
ఒడిస్ ఇ2గో ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ మూడు సంవత్సరాల వారంటీతో లభిస్తుంది. ఈ బ్యాటరీలు ఒడిస్ అధీకృత డీలర్షిప్ కేంద్రాలలో అందుబాటులో ఉంటాయి.
ఒడిస్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల యాజమాన్యాన్ని సులభతరం చేసేందుకు కంపెనీ తమ వినియోగదారుల కోసం స్పెషల్ ఫైనాన్స్ స్కీమ్స్ను కూడా అందించనుంది. కంపెనీ ఇందుకోసం ఐడిఎఫ్సి బ్యాంక్ మరియు ఇతర ప్రాంతీయ భాగస్వాముల నుండి ఆర్థిక భాగస్వాములను కలిగి ఉంది.
MOST READ:నిండు ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్.. ఎలా అనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
ప్రస్తుతం ఒడిస్ ఎలక్ట్రిక్ కంపెనీది దేశవ్యాప్తంగా తొమ్మిది డీలర్షిప్లు కేంద్రాలు ఉన్నాయి. మార్చ్ 2021 నాటికి, వీటికి అదనంగా మరో 10 కొత్త అవుట్లెట్లను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 25కి పైగా నగరాల్లో తమ ఉనికిని కలిగి ఉండాలని ఒడిస్ యోచిస్తోంది.
ఈ సందర్భంగా ఓడిస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సీఈఓ నేమిన్ వోరా మాట్లాడుతూ.. ఇ2గో ఎలక్ట్రిక్ స్కూటర్లను పట్టణ మహిళలు మరియు యువతను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టామని, వీటి సాయంతో కస్టమర్లు సరసమైన ధరకే ఎలక్ట్రిక్ వాహనాలను పొంది, రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ అవసరం లేని సౌకర్యవంతమైన రైడ్ను ఆస్వాధించవచ్చని అన్నారు.