Just In
- 14 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 16 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 16 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 18 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- News TTD: శ్రీవారి దర్శనం , సేవలు, వసతి గదుల కోటా విడుదల...!!
- Movies Guppedantha Manasu April 18th: కాలేజీ నుంచి వెళ్లిపోయిన మహేంద్ర.. మను దత్తత.. టెన్షన్లో దేవయాని!
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
అతి త్వరలోనే ఓలా నుండి మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల!
ప్రస్తుతం భారతదేశంలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో, మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు నిత్యం కొత్తగా అనేక ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి.
తాజాగా, టాక్సీ సేవల రంగం ద్వారా ప్రాచుర్యం పొందిన ఓలా క్యాబ్స్, ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ పేరుతో భారత మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ ఉత్పత్తులను తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే, తమిళనాడులోని హోసూర్లో ఓ ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న ఓలా, అతి త్వరలోనే తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను భారత్లో విడుదల చేయనుంది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్కి సంబంధించిన మొట్టమొదటి స్పై చిత్రాలు కూడా ఇటీవలే ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఓలా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ను భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఓలా ఈ స్కూటర్ను కేవలం భారత మార్కెట్ కోసం మాత్రమే కాకుండా పలు అంతర్జాతీయ మార్కెట్ల కోసం కూడా తయారు చేస్తోంది.
MOST READ:ఇదేం సిత్రం.. ట్రక్కులో కట్టేసి తీసుకెళ్తున్న జావా 42 బైక్కి ఓవర్స్పీడింగ్ ఛలాన్!?
నెథర్లాండ్స్కి చెందిన ఎటెర్గో అనే సంస్థను ఓలా గడచిన మే 2020లో కొనుగోలు చేసింది. ఎటెర్గో గతంలో అంతర్జాతీయ మార్కెట్ల కోసం తయారు చేసిన 'యాప్స్కూటర్' ఆధారంగానే ఓలా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను భారత్ కోసం తయారు చేస్తోంది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో ముందు వైపు సింగిల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఈ స్కూటర్లో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీల సాయంతో ఇది గంటకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు తీస్తుందని సమాచారం.
MOST READ:సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
ఈ స్కూటర్లో లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగించారు. ఇవి పూర్తి ఛార్జీపై 240 కిలోమీటర్ల వరకూ రేంజ్ను అందిస్తాయని అంచనా. ఈ స్కూటర్ కేవలం 3.9 సెకన్లలోనే గంకు 0-45 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుందని సమాచారం.
ఎటెర్గో యాప్స్కూటర్ను ఓలా భారత మార్కెట్కు అనుగుణంగా మోడిఫై చేసినట్లుగా తెలుస్తోంది. మార్కెట్ అంచనా ప్రకారం, ఓలా నుండి రాబోయే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారు రూ.1 లక్ష వరకూ ఉండొచ్చని అంచనా.
MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మాస్ ప్రొడక్షన్ కోసం కంపెనీ తమిళనాడులోని హోసూర్ వద్ద సుమారు 500 ఎకరాల స్థలంలో ప్రపంచంలో కెల్లా అతిపెద్ద స్కూటర్ల తయారీ కర్మాగారాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొంది.
ఈ ప్లాంట్ను ప్రతి ఏటా 2 మిలియన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యతో నిర్మిస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్తో పాటుగా యుఎస్ఏ, యూరప్, యుకె, ఆసియా పసిఫిక్ దేశాలు, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ సహా ప్రపంచంలోని వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.
MOST READ:ఎలక్ట్రిక్ స్కూటర్పై ర్యాలీ చేపట్టిన కలకత్తా సీఎం.. ఎందుకో తెలుసా!