Just In
- 2 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 3 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 3 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- 5 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
Don't Miss
- News YS Jagan Stone Attack: జగన్ పై దాడి కేసు విచారణ-ఈసీ జోక్యం కోరిన టీడీపీ..!
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- Movies వాడుంటే రాత్రికి పండగే.. అలా పడుకుంటా! పచ్చిగా బిగ్ బాస్ బ్యూటీ ఓపెన్
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఢిల్లీలో ఫ్లాగ్షిప్ స్టోర్ ప్రారంభించిన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ; పూర్తి వివరాలు
భారతీయ మార్కెట్లో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెరుగుతోంది. ఈ కారణంగానే చాలా కంపెనీలు తమ బ్రాండ్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే హైదరాబాద్ నగరానికి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ప్యూర్ ఈవి కూడా ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది.
ప్యూర్ ఈవి మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టిన తరువాత దాని పరిధిని మరింత పెంచుకోవడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఒక ఫ్లాగ్షిప్ స్టోర్ను ప్రారంభించింది.
ప్యూర్ ఈవి కంపెనీ ప్రస్తుతం నాలుగు మోడళ్లను తయారు చేస్తోంది. వీటిలో రెండు హై-స్పీడ్ మరియు రెండు లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ప్యూర్ ఈవి గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల స్కూటర్లను తయారు చేస్తోంది. ఇవి ఒకే ఛార్జీపై 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.
కంపెనీ కేవలం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మాత్రమే కాకూండా, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీలను కూడా ఉత్పత్తి చేస్తుంది. వీటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికను కూడా కంపెనీ సిద్ధం చేసింది, దీని కింద కంపెనీ ప్రతి సంవత్సరం 2 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేస్తుంది. ప్రస్తుతం కంపెనీ తన ప్లాంట్ లో ప్రతి సంవత్సరం దాదాపు 20,000 స్కూటర్లను తయారు చేస్తోంది.
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు మరియు బ్యాటరీల కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి 2022 నాటికి కంపెనీ కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి కూడా కంపెనీ సన్నద్ధమవుతోంది. ఇది కాకుండా, బ్యాటరీల అమ్మకం కోసం కంపెనీ దేశవ్యాప్తంగా రిటైల్ షాప్ లను కూడా ప్రారంభించనుంది.
ప్యూర్ ఈవి భారతదేశంలో బ్యాటరీ తయారీ కర్మాగారం మరియు పరిశోధనా కేంద్రాన్ని కూడా నిర్వహిస్తోంది, ఇక్కడ పరిశోధకుల బృందం లిథియం-అయాన్ బ్యాటరీలను సమర్థవంతంగా చేయడానికి బ్యాటరీ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్లపై పనిచేస్తోంది. ప్యూర్ ఈవి యొక్క ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు పోర్టబుల్ ఛార్జర్ మరియు పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీలతో వస్తాయి.
కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క అన్ని మోడల్స్ కి ఏరోడైనమిక్ బాడీ, మల్టీ-రిఫ్లెక్టర్ హెడ్ల్యాంప్స్, 4-ఇంచ్ ఎల్సిడి స్క్రీన్, రౌండ్ మిర్రర్స్ మరియు 10 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. ఇవన్నీ కూడా వైట్, రెడ్, బ్లూ, బ్లాక్, గ్రే కలర్ మరియు సిల్వర్ అనే 6 కలర్ ఆప్సన్స్ లో లభిస్తాయి.
ప్యూర్ ఈవి ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ తమ స్కూటర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ టెక్నాలజీ సహాయంతో, ఏదైనా లోపాన్ని లేదా లిథియం-అయాన్ బ్యాటరీ యొక్క ఏదైనా ఇతర భాగం కనుగొనవచ్చు. ఈ విధంగా గుర్తించిన తరువాత, స్కూటర్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.
ప్యూర్ ఈవి సంస్థ మార్కెట్లో విడుదల చేసిన నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లలో, ఇప్లూటో 7 జి, ఇప్లూటో, ఇట్రాన్స్ మరియు ఇట్రాన్ ప్లస్ ఉన్నాయి. కంపెనీ ఇటీవల అందించిన సమాచారం ప్రకారం తన ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం ద్వారా త్వరలో స్కూటర్ల సరఫరాను మరింత ఎక్కువ చేసే అవకాశం ఉందని తెలిపింది.