Just In
- 10 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 12 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 13 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 15 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- Movies Brahmamudi April 25th episode: కావ్య విషయంలో రుద్రాణికి షాకిచ్చిన కనకం.. రెచ్చగొడుతున్న రాహుల్
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
2021 ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాల హవా
దేశీయ మార్కెట్లో ప్రముఖ బైక్ తయారీదారుగా ప్రఖ్యాతిగాంచిన కంపెనీలలో రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి. రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల 2021 ఏప్రిల్ నెలలో జరిగిన అమ్మకాల నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం గత నెలలో కంపెనీ 53,298 యూనిట్ బైక్లను విక్రయించినట్లు అధికారికంగా తెలిపింది.
కంపెనీ యొక్క నివేదికల ప్రకారం ఇందులో 48,789 యూనిట్లు దేశీయ మార్కెట్లో విక్రయించినట్లు తెలిసింది. మిగిలిన 4,509 యూనిట్లు దేశీయ మార్కెట్ నుంచి ఎగుమతి చేసినట్లు తెలిపింది. కంపెనీ గత ఏడాది ఇదే నెలలో కరోనా లాక్ డౌన్ సమయంలో కంపెనీ కేవలం 91 బైక్లను మాత్రమే విక్రయించింది.
కరోనా లాక్ డౌన్ మరియు కర్ఫ్యూ కారణంగా మార్చిలో పోలిస్తే ఏప్రిల్ చివరి 15 రోజుల్లో అమ్మకాలు దాదాపు 19 శాతం తగ్గాయని తెలిసింది. 2021 మార్చిలో కంపెనీ 66,058 యూనిట్ బైక్లను విక్రయించింది. గత నెలలో కంపెనీ తన 350 సిసి మీటియార్ బైక్ యుఎస్ మార్కెట్లో లాంచ్ చేయడం ద్వారా కంపెనీ కొత్త మైలురాయిని సాధించింది.
రాయల్ ఎన్ఫీల్డ్ మార్కెట్లో తన ఉనికిని మరింత విస్తరించుకోవడానికి కొత్త మరియు అప్డేటెడ్ మోడల్స్ విడుదల చేయడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తుంది. ఈ జాబితాలో కొత్త క్లాసిక్ 350, హంటర్ 350 మరియు కొత్త 650 సిసి బైక్ ఉన్నాయి.
త్వరలో మార్కెట్లో అడుగుపెట్టనున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఎల్ఈడీ హెడ్లైట్, ఎల్ఈడీ టైల్లైట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టిప్పర్ నావిగేషన్ వంటి వాటితో రానుంది. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి అతిపెద్ద మార్కెట్ మన భారతదేశం. ఒక్క ఇండియా మాత్రమే కాకుండా యూరప్, అమెరికా మరియు ఆగ్నేయాసియాలోని అనేక దేశాలలో కంపెనీ తన బైక్లను విక్రయిస్తుంది.
దీన్ని బట్టి చూస్తే కంపెనీకి దేశ విదేశాల్లో ఎంత ఆదరణ ఉందో అర్థమవుతుంది. ఇటీవల కంపెనీ అందించిన సమాచారం ప్రకారం 2021 ఏప్రిల్ తన బుల్లెట్ 350, క్లాసిక్ 350 మరియు మీటియార్ 350 యొక్క అన్ని వేరియంట్ల ధరలను పెంచుతూ ప్రకటించింది.
రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క అత్యంత సరసమైన బైక్ అయిన బుల్లెట్ 350 ధర ఇప్పుడు మునుపటికంటే 10,000 రూపాయలు ఎక్కువగా ఉంది. ఈ బైక్ యొక్క బేస్ మోడల్ ధరను రూ. 4,490 పెంచారు. ధరల పెరుగుదల తరువాత ఇప్పుడు బుల్లెట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర 1,54,327 రూపాయలకు లభిస్తుంది.
కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ అయిన క్లాసిక్ 350 విషయానికి వస్తే, ఈ బైక్ ధర ఇప్పుడు మునుపటికంటే రూ. 5,992 వరకు ఖరీదైనది. ఇప్పుడు క్లాసిక్ 350 యొక్క బేస్ మోడల్ కొత్త ఎక్స్-షోరూమ్ ధర 1,72,465 రూపాయలకు లభిస్తుంది.
ఇదే సమయంలో, గత సంవత్సరం కంపెనీ లాంచ్ చేసిన మీటియార్ 350 ధర రూ. 6,023 వరకు పెంచారు. ధరల పెరుగుదల తర్వాత మీటియార్ 350 యొక్క బేస్ మోడల్ ధర ఇప్పుడు ఎక్స్-షోరూమ్ ప్రకారం 1,84,319 రూపాయలకు లభిస్తుంది.
దీన్ని బట్టి చూస్తే కంపెనీ ధరల పెరుగుదల ఇప్పుడు ఏకంగా మూడవసారి. ఇంతకుముందు కంపెనీ జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా మోడళ్ల ధరలను పెంచింది. ప్రస్తుతం ఆటో మొబైల్ పరిశ్రమలో బైక్ తయారీలో ఉపయోగించే ముడి పరికరాల ధరల పెరుగుదల కారణంగా ధరను పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది.