Just In
- 11 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 13 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 15 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 18 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పెరిగిన టీవీఎస్ జూపిటర్, జెస్ట్, స్కూటీ పెప్, ఎన్టార్క్ 125 స్కూటర్ల ధరలు
ఈ ఏడాది ఆరంభంలో కరోనా కారణంగా ముడిసరుకుల ధరలు పెరిగాయని చెప్పి వాహనాల ధరలు పెంచిన ఆటోమొబైల్ కంపెనీలు, ఇప్పుడు మరోసారి అదే కారణం చెప్పి ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయి.
హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో మరియు రాయల్ ఎన్ఫీల్డ్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్ 2021) నుండి ధరలు పెరుగుతాయని ప్రకటించగా, తాజాగా టీవీఎస్ మోటార్ కంపెనీ కూడా ఇదే కోవలో తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
టీవీఎస్ మోటార్ కంపెనీ తమ స్కూటర్ లైనప్లో ఆఫర్ చేస్తున్న జూపిటర్, స్కూటీ పెప్ ప్లస్, జెస్ట్ మరియు ఎన్టార్క్ 125 స్కూటర్ల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. కస్టమర్ ఎంచుకునే మోడల్, వేరియంట్ను బట్టి ఈ స్కూటర్ల ధరలు రూ.540 నుండి రూ.2,535 మధ్యలో పెరిగాయి.
MOST READ:మీ పాత వాహనాలను ఇలా చేసి, రెనో కార్లపై భారీ తగ్గింపును పొందండి
టీవీఎస్ నుండి లభిస్తున్న చౌకైన స్కూటర్ స్కూటీ పెప్ ప్లస్ ధరను గరిష్టంగా రూ.2,535 మేర పెంచారు. తాజా ధరల పెంపు తర్వాత టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ స్కూటర్ ప్రారంభ ధర రూ.56,009 లుగా ఉండగా, స్కూటీ పెప్ ప్లస్ మ్యాట్ ఎడిషన్ ధర రూ.58,759 గా ఉంటుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).
టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 గ్లోస్, జెస్ట్ మ్యాట్ ఎడిషన్ ధరలను రూ.1,635 మేర పెంచారు. తాజా ధరల పెంపు తర్వాత జెస్ట్ 110 గ్లోస్ రూ.62,980 మరియు జెస్ట్ 110 మ్యాట్ ధర రూ.64,980 గా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).
MOST READ:విమానాలపై పక్షులు ఎందుకు దాడి చేస్తాయి.. వాటిని ఎలా నివారిస్తారు..మీకు తెలుసా?
టీవీఎస్ నుండి లభిస్తున్న పాపులర్ స్కూటర్ జూపిటర్లో వివిధ వేరియంట్ల ధరలను రూ.940 నుండి రూ.1,390 మధ్యలో పెంచారు. తాజా ధరల పెంపు తర్వాత కొత్త టీవీఎస్ జూపిటర్ ప్రారంభ ధర రూ.64,437 గా ఉండగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ జూపిటర్ క్లాసిక్ ధర రూ.73,707 గా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).
టీవీఎస్ అందిస్తున్న స్పోర్టీ స్కూటర్ ఎన్టార్క్ 125 విషయానికి వస్తే ఈ స్కూటర్ ధరను రూ.540 నుంచి రూ.1,540 మధ్యలో పెంచారు. తాజా ధరల పెంపు తర్వాత టీవీఎస్ ఎన్టార్క్ 125 ప్రారంభ ధర రూ.71,095 (ఎక్స్-షోరూమ్) కాగా, ఎన్టోర్క్ 125 టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.81,075 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
MOST READ:భారత్లో మళ్ళీ మొదలైన కరోనా లాక్డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?
ఇదిలా ఉంటే హోలీ సందర్భంగా టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బిఎస్6 మోడల్లో కంపెనీ ఓ కొత్త డ్యూయల్ టోన్ కలర్ వేరియంట్ను విడుదల చేసింది. మార్కెట్లో ఈ వేరియంట్ ధరను రూ.65,865 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
గడచిన మార్చి నెలలో టీవీఎస్ మోటార్ కంపెనీ మొత్తం 3,07,437 యూనిట్ల వాహనాలను విక్రయించిందని. మార్చి 2020లో కంపెనీ 1,33,988 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 130 శాతం వృద్ధి చెందాయి. మోటార్సైకిల్ విభాగంలో 136 శాతం, స్కూటర్ విభాగంలో 206 శాతం పెరుగుదల నమోదైంది.
ఇదిలా ఉంటే, టీవీఎస్ అందిస్తున్న అపాచీ ఆర్ఆర్ 310 మోడల్ను కంపెనీ త్వరలో కొత్త అవతార్లో విడుదల చేయవచ్చని సమాచారం. టీవీఎస్ నుండి రానున్న ఈ కొత్త 300 సిసి బైక్ ఇప్పుడు సరికొత్త ఫీచర్లు మరియు మెరుగైన పనితీరుతో రానుంది. ఇందుకు సంబంధించి కంపెనీ ఇటీవల ఓ టీజర్ను కూడా విడుదల చేసింది.