Just In
- 7 hrs ago రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- 10 hrs ago మార్కెట్లో వీటికి తిరుగే లేదు.. కొత్త బైక్ కొనాలనుకుంటే ఈ లిస్ట్ అస్సలు మిస్ అవ్వకండి
- 12 hrs ago వారెవ్వా.. యూట్యూబర్స్ వాడే కార్లు ఇలా ఉన్నాయా!.. ఓ లుక్కేసుకోండి
- 12 hrs ago రూ. 10 లక్షల లోపు ధరలో విడుదల కాబోతున్న ప్రముఖ బ్రాండ్ల కార్లు ఇవే..
Don't Miss
- News ప్రధాని మోడీకి బల్గేరియా అధ్యక్షుడు రుమెన్ స్పెషల్ థ్యాంక్స్: ఎందుకంటే?
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Movies బెజవాడలో ఈవీఎంల ట్యాంపరింగ్.. క్రికెటర్ శ్రీశాంత్కు సంబంధమేమిటంటే?
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
వారంటీ & సర్వీస్ టైమ్ పొడిగించిన టీవీఎస్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని వాహనతయారీ సంస్థలన్నీ దాదాపుగా వాహన వినియోగదారుల సౌకర్యార్థం వారంటీ మరియు సర్వీస్ వంటి వాటిని మరింత పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ కంపెనీ కూడా వారంటీ మరియు సర్వీస్ వ్యవధిని పొడిగించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
రోజురోజుకి కరోనా చాలా ఎక్కువగా విస్తరించడం వల్ల, కరోనా సంక్రమణను నివారించడానికి అనేక రాష్ట్రాలు కరోనా లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ కారణంగా వాహనదారులు వాహనాలకు అవసరమైన సర్వీసులను సకాలంలో పొందటానికి కొంత ఇబ్బంది కలుగుతుంది. దీన్ని నివారించడానికి కంపెనీ వ్యవధిని పెంచుతూ ఉత్తర్వులను జారీచేసింది.
కంపెనీ అందించిన నివేదికల ప్రకారం 2021 జూన్ 30 వరకు లాక్ డౌన్ వ్యవధి కారణంగా ఉచిత సేవ మరియు వారెంటీలను పొడిగించాలని టీవీఎస్ మోటార్ డీలర్షిప్ భాగస్వాములను ఆదేశించింది. ఇది కాకుండా రెగ్యులర్ సర్వీస్ చొరవతో కంపెనీ వినియోగదారులకు మద్దతు ఇస్తోంది.
MOST READ:మీకు తెలుసా.. హీరో మోటోకార్ప్ ఫ్రీ సర్వీస్ & వారంటీ ఇప్పుడు జులై 31 వరకు
కరోనావైరస్ సంక్రమణ కారణంగా, అన్ని డీలర్షిప్లలో కూడా సురక్షితమైన సర్వీస్ అందించబడుతుందని కంపెనీ తెలియజేసింది. అన్ని టీవీఎస్ మోటార్ డీలర్షిప్లలో అధికారులు నిర్దేశించిన కరోనావైరస్ ప్రోటోకాల్లు అనుసరించబడతాయి. కావున వాహనదారులు ఈ సర్వీసులను నిరాఘాటంగా పొందవచ్చు.
కరోనా మహమ్మారి సమయంలో కస్టమర్లకు తగిన సౌకర్యాన్ని అందించడానికి టీవీఎస్ మోటార్ అన్నివిధాలా కృషి చేస్తుంది. తన నెట్వర్క్ భాగస్వాముల యొక్క బాధ్యతాయుతమైన భాగస్వామిగా, అసోసియేట్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని వినియోగదారుల తక్షణ అవసరాలను తీర్చడానికి కంపెనీ ఈ సమయంలో కూడా సిద్ధంగా ఉంది.
MOST READ:80 మంది అరెస్ట్ 40 వాహనాలు సీజ్.. ఇదంతా ఒక క్రిమినల్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఫలితం
దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ని అరికట్టడానికి ప్రభుత్వాలు చేస్తున్న చర్యలకు మద్దతుగా ఆటో మొబైల్ కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి. ఇందులో టీవీఎస్ మోటార్ కంపెనీ కూడా ఇందులో ఉంది. టీవీఎస్ కంపెనీ ఇటీవల రూ. 40 కోట్ల నిధులను విరాళంగా ఇవ్వడానికి ఆమోదం కూడా తెలిపింది.
భారతదేశంలో పెరుగుతున్న రోగులకు సరైన వసతులు లేదు. కావున ఆక్సిజన్ సిలిండర్లు, పిపిఇ కిట్లు, మందులు మరియు వైద్య పరికరాలు వంటి ప్రాణాలను రక్షించడానికి ఈ డబ్బు ఉపయోగించబడుతుంది. ఇందులో భాగంగా కంపెనీ తమిళనాడు, కర్ణాటక మరియు హిమాచల్ ప్రదేశ్ లలో హాస్పిటల్స్ మరియు ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు రోజుకు 20,000 కి పైగా భోజన ప్యాకెట్లను అందించింది.
MOST READ:స్పాట్ టెస్ట్లో కనిపించిన మారుతి వ్యాగన్ఆర్; పూర్తి వివరాలు