Just In
- 7 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 10 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 13 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 16 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వారంటీ & సర్వీస్ టైమ్ పొడిగించిన టీవీఎస్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని వాహనతయారీ సంస్థలన్నీ దాదాపుగా వాహన వినియోగదారుల సౌకర్యార్థం వారంటీ మరియు సర్వీస్ వంటి వాటిని మరింత పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ కంపెనీ కూడా వారంటీ మరియు సర్వీస్ వ్యవధిని పొడిగించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
రోజురోజుకి కరోనా చాలా ఎక్కువగా విస్తరించడం వల్ల, కరోనా సంక్రమణను నివారించడానికి అనేక రాష్ట్రాలు కరోనా లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ కారణంగా వాహనదారులు వాహనాలకు అవసరమైన సర్వీసులను సకాలంలో పొందటానికి కొంత ఇబ్బంది కలుగుతుంది. దీన్ని నివారించడానికి కంపెనీ వ్యవధిని పెంచుతూ ఉత్తర్వులను జారీచేసింది.
కంపెనీ అందించిన నివేదికల ప్రకారం 2021 జూన్ 30 వరకు లాక్ డౌన్ వ్యవధి కారణంగా ఉచిత సేవ మరియు వారెంటీలను పొడిగించాలని టీవీఎస్ మోటార్ డీలర్షిప్ భాగస్వాములను ఆదేశించింది. ఇది కాకుండా రెగ్యులర్ సర్వీస్ చొరవతో కంపెనీ వినియోగదారులకు మద్దతు ఇస్తోంది.
MOST READ:మీకు తెలుసా.. హీరో మోటోకార్ప్ ఫ్రీ సర్వీస్ & వారంటీ ఇప్పుడు జులై 31 వరకు
కరోనావైరస్ సంక్రమణ కారణంగా, అన్ని డీలర్షిప్లలో కూడా సురక్షితమైన సర్వీస్ అందించబడుతుందని కంపెనీ తెలియజేసింది. అన్ని టీవీఎస్ మోటార్ డీలర్షిప్లలో అధికారులు నిర్దేశించిన కరోనావైరస్ ప్రోటోకాల్లు అనుసరించబడతాయి. కావున వాహనదారులు ఈ సర్వీసులను నిరాఘాటంగా పొందవచ్చు.
కరోనా మహమ్మారి సమయంలో కస్టమర్లకు తగిన సౌకర్యాన్ని అందించడానికి టీవీఎస్ మోటార్ అన్నివిధాలా కృషి చేస్తుంది. తన నెట్వర్క్ భాగస్వాముల యొక్క బాధ్యతాయుతమైన భాగస్వామిగా, అసోసియేట్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని వినియోగదారుల తక్షణ అవసరాలను తీర్చడానికి కంపెనీ ఈ సమయంలో కూడా సిద్ధంగా ఉంది.
MOST READ:80 మంది అరెస్ట్ 40 వాహనాలు సీజ్.. ఇదంతా ఒక క్రిమినల్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఫలితం
దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ని అరికట్టడానికి ప్రభుత్వాలు చేస్తున్న చర్యలకు మద్దతుగా ఆటో మొబైల్ కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి. ఇందులో టీవీఎస్ మోటార్ కంపెనీ కూడా ఇందులో ఉంది. టీవీఎస్ కంపెనీ ఇటీవల రూ. 40 కోట్ల నిధులను విరాళంగా ఇవ్వడానికి ఆమోదం కూడా తెలిపింది.
భారతదేశంలో పెరుగుతున్న రోగులకు సరైన వసతులు లేదు. కావున ఆక్సిజన్ సిలిండర్లు, పిపిఇ కిట్లు, మందులు మరియు వైద్య పరికరాలు వంటి ప్రాణాలను రక్షించడానికి ఈ డబ్బు ఉపయోగించబడుతుంది. ఇందులో భాగంగా కంపెనీ తమిళనాడు, కర్ణాటక మరియు హిమాచల్ ప్రదేశ్ లలో హాస్పిటల్స్ మరియు ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు రోజుకు 20,000 కి పైగా భోజన ప్యాకెట్లను అందించింది.
MOST READ:స్పాట్ టెస్ట్లో కనిపించిన మారుతి వ్యాగన్ఆర్; పూర్తి వివరాలు