Just In
- 30 min ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 1 hr ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 3 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 4 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
Don't Miss
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
కరోనా సెకండ్ వేవ్: యమహా టూవీలర్లపై సర్వీస్ మరియు వారంటీ పొడగింపు
భారతదేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో, దేశంలోని అనేక రాష్ట్రాల్లో పాక్షిక మరియు సంపూర్ణ లాక్డౌన్లు అమలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా, తమ వాహనాల విషయంలో ఉచిత సర్వీస్ మరియు వారంటీ వ్యవధిని పొడగిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ సేవలను జూన్ 30, 2021 వరకు పొడిగిస్తున్నట్లు యమహా ఇండియా పేర్కొంది. ఇందులో భాగంగా, కంపెనీ తమ వాహనాలపై అందిస్తున్న సాధారణ వారంటీ, పొడగించిన వారంటీ మరియు వార్షిక నిర్వహణలో లభించే వారంటీల కాల వ్యవధిని కంపెనీ వచ్చే నెలాఖరు వరకు పొడిగించింది.
ఈ మేరకు యమహా తమ అన్ని డీలర్షిప్లకు సేవల పొడిగింపు మరియు వారెంటీ పొడగింపుపై సమాచారాన్ని అందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇకపై వినియోగదారులు తమ బైక్లను జూన్ 30 వరకూ ఎటువంటి సమస్యలు లేకుండా సర్వీసు పొందవచ్చు.
MOST READ:బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు
కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా, భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పాక్షిక మరియు సంపూర్ణ లాక్డౌన్లు కొనసాగుతున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ సర్వీస్ సెంటర్లను మరియు డీలర్షిప్లను పూర్తిగా మూసివేయటం లేదా కొన్ని గంటల పాటు మాత్రమే నిర్వహించడం చేస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో వాహన యజమానులు బయటకు రాలేక, సరైన సమయంలో తమ వాహనాలను సర్వీస్ చేయించుకోలేక పోతున్నారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని యమహా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
MOST READ:వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు
యమహా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, "కంపెనీ వారంటీ మరియు సర్వీస్ వ్యవధిని జూన్ 30 వరకు పొడిగిస్తోంది. లాక్డౌన్ సమయంలో వారంటీ గడువు ముగిసిన వినియోగదారులకు జూన్ 30 వరకు వారంటీ మరియు ఉచిత సేవ యొక్క ప్రయోజనం ఇవ్వబడుతుంది." అని పేర్కొంది.
యమహా తమ కస్టమర్ల సంతృప్తికే అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, ఇందులో భాగంగానే ప్రస్తుత విపత్కర పరిస్థిల్లో తమ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కంపెనీ తెలిపింది.
MOST READ:కూరగాయల అమ్మకానికి కొత్త టయోటా ఫార్చ్యూనర్.. వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజమే
ఇదిలా ఉంటే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యమహా కూడా ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే తమ ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేసింది. తమిళనాడు రాష్ట్రంలోని తమ కాంచీపురం ప్లాంట్లో మరియు ఉత్తరప్రదేశ్లోని సూరజ్పూర్ ప్లాంట్లో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించింది.
ఈ రెండు ప్లాంట్లను మే 15 నుండి మే 31, 2021 వరకు మూసివేయాలని కంపెనీ నిర్ణయించింది. యమహాతో పాటుగా హీరో మోటోకార్ప్, హోండా టూవీలర్స్ మరియు రాయల్ ఎన్ఫీల్డ్ వంటి సంస్థలు కూడా తమ తయారీ కర్మాగారాలను కొన్ని రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.
MOST READ:ఈ బైక్ ఏదో గుర్తించగలరా.. ఒక్కసారి చూసి ట్రై చేయండి
మారుతి సుజుకి సర్వీస్, వారంటీ పొడగింపు
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా కూడా ఇటీవలే తమ కొత్త వాహనాల విషయంలో సర్వీస్ మరియు వారంటీ గడువును జూన్ 30 వరకూ పొడగిస్తున్నట్లు ప్రకటించింది. - దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.