Just In
- 6 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 7 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 11 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 12 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పరుగులు తీస్తున్న యమహా సేల్స్.. 2021 జనవరి అమ్మకాలు ఇవే
యమహా బైక్, స్కూటర్ తయారీ కంపెనీ ఇటీవల 2021 జనవరి నెలలో జరిగిన అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం, యమహా కంపెనీ యొక్క అమ్మకాలు మునుపటికంటే దాదాపు 54 శాతం పెరుగుదల నమోదు చేసింది. కంపెనీ గత నెలలో మొత్తం 55,151 యూనిట్ల వాహనాలను విక్రయించినట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది.
యమహా కంపెనీ గత ఏడాది జనవరిలో మొత్తం 35,913 యూనిట్లను విక్రయించింది. గతేడాది జనవరితో పోలిస్తే యమహా ఇండియా ఈ ఏడాది 19,238 యూనిట్ల వాహనాలను విక్రయించి సానుకూల ఫలితాలను నెలకొల్పింది. దేశంలో అధికంగా విజృంభించిన కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్ డౌన్ లో అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.
అయితే కరోనా లాక్డౌన్ను తొలగించిన తర్వాత యమహా మోటార్ ఇండియా మంచి పనితీరు కనబరిచింది మరియు సంస్థ అమ్మకాలు ప్రతి నెలా క్రమంగా పెరుగుతున్నాయి. నెలవారీ అమ్మకాల విషయానికి వస్తే, 2020 డిసెంబర్లో కంపెనీ 39,224 యూనిట్లను విక్రయించింది.
MOST READ:ఆటోమొబైల్ పరిశ్రమపై కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్ ; ఎలా ఉందో తెలుసా..!
జనవరి 2021 లో, యమహా ఇండియా 2020 డిసెంబర్ కంటే 15,927 యూనిట్లను ఎక్కువగా విక్రయించింది. 2020 డిసెంబర్తో పోలిస్తే గత నెలలో కంపెనీ అమ్మకాలు 40.61 శాతం పెరిగాయి. 50,000 యూనిట్లకు పైగా నెలవారీ అమ్మకాలు జరపడం అనేది కంపెనీకి సానుకూల స్పందన అనే చెప్పాలి.
చాలా రోజుల నుంచి యమహా కంపెనీ యొక్క అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ గత నెలలో మంచి అమ్మకాలను చేపట్టింది. గత నెలలో యమహా మోటార్ 50 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసినప్పటికీ, పెద్ద బ్రాండ్ తయారీదారుల జాబితాలో కంపెనీ ఇప్పటికీ చివరి స్థానంలో ఉంది.
ఈ నెలలో అమ్మకాల పరంగా యమహా ఇండియా టాప్ 7 కంపెనీలలో చోటు దక్కించుకుంది మరియు యమహా తన పోర్ట్ఫోలియోలో చాలా గొప్ప ఉత్పత్తులను కలిగి ఉంది. యమహా యొక్క బిఎస్ 6 పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం 125 సిసి స్కూటర్ విభాగంలో ఫాసినో, రే-జెడ్ఆర్ మరియు రే-జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఉన్నాయి.
ఇవి మాత్రమే కాకుండా 150 సిసి బైక్ విభాగంలో యమహా ఆర్ 15 వి 3.0 మరియు యమహా ఎంటి-15 (155 సిసి), ఎఫ్జెడ్-ఎఫ్ఐ, ఎఫ్జెడ్ఎస్ ఎఫ్ఐ బైక్లు ఉన్నాయి. 250 సిసి మోటార్సైకిల్ విభాగంలో ఎఫ్జెడ్ 25 మరియు కొత్త ఎఫ్జెడ్ఎస్ 25 బైక్లు ఉన్నాయి. ఇటీవల యమహా మోటార్ తన కొత్త 2021 యమహా ఆర్ 15 వి 3 ను ఇండోనేషియా మార్కెట్లో విడుదల చేసింది.
MOST READ:పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలకు చెక్ పెట్టాలంటే, ఇలా చేయండి
యమహా కంపెనీ కొత్త కలర్ అప్సన్స్ తో అప్డేటెడ్ మోడల్గా యమహా ఆర్ 15 విని విడుదల చేసింది. ఇండోనేషియా-స్పెక్ బైక్ 155 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజిన్ను ఉపయోగిస్తుంది. ఈ ఇంజన్ 19.3 బిహెచ్పి శక్తిని మరియు 14.7 ఎన్ఎమ్ టార్క్ను అందిస్తుంది. ఈ ఇంజిన్లో, కంపెనీ వివిఎ టెక్నాలజీతో పాటు లిక్విడ్-కూల్డ్ టెక్నాలజీని ఉపయోగించింది. ఏది ఏమైనా యమహా యొక్క అమ్మకాలు పెరగటం చాలా సంతోషకరమైన విషయం.