Just In
- 1 hr ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 2 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 3 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 4 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆటమ్మొబైల్ నుండి వస్తున్న రెండవ ఎలక్ట్రిక్ బైక్కు గ్రీన్ సిగ్నల్.. పూర్తి చార్జ్పై 100 కిమీ పైగా రేంజ్!
హైదరాబాద్కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ కంపెనీ ఆటమ్మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Atumobile) భారత మార్కెట్లో తమ రెండవ ఎలక్ట్రిక్ టూవీలర్ విడుదల చేసేందుకు సిద్దమైంది. ఈ బ్రాండ్ రూపొందించిన ఆటమ్వాడెర్ (AtumVader) కోసం ఈ కంపెనీ ఆటోమొబైల్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ARAI) నుండి ధృవీకరణను పొందింది. ఇదొ కేఫ్ రేసర్ డిజైన్ కలిగిన బైక్, కంపెనీ దీనిని తెలంగాణలోని ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయనుంది.
ఈ మేడ్ ఇన్ ఇండియా టూవీలర్ బ్రాండ్ గడచిన సెప్టెంబర్ 2020 నెలలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ "ఆటమ్ 1.0"ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆ సమయంలో ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ పరిచయ ప్రారంభ ధర కేవలం రూ.50,000 మాత్రమే. అయితే, గడచిన రెండేళ్లలో ఈ ఎలక్ట్రిక్ బైక్ కు డిమాండ్ పెరగడంతో కంపెనీ దీని ధరను కూడా భారీగా పెంచింది. దేశీయ మార్కెట్లో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధర రూ.74,999 (ఎక్స్-షోరూమ్) గాఉంది.
ఇకపోతే, కంపెనీ కొత్తగా ధృవీకరణ పొందిన AtumVader ఇ-బైక్ విషయానికి వస్తే, ఇది 2.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేయనుంది. ఈ బైక్ ట్యూబ్లర్ ఫ్రేమ్పై నిర్మించబడింది మరియు అన్ని లైట్లు కూడా ఎల్ఈడి రూపంలో ఉంటాయి. కొత్త AtumVader దేశంలోనే మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ కేఫ్ రేసర్ బైక్ అవుతుందని, దీనిని భారతదేశంలో డిజైన్ చేసి ఇక్కడే స్థానికంగా నిర్మించనున్నామని కంపెనీ పేర్కొంది.
సమాచారం ప్రకారం, ఈ ఇ-బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లుగా ఉంటుంది మరియు ఇది పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 100 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ కెఫే రేసర్ బైక్లో హ్యాండ్ క్లచ్ మరియు లెగ్ బ్రేక్ ఉండదు. బైక్ ను ఆపడానికి హ్యాండ్ బ్రేక్ ఇవ్వబడుతుంది. ఈ బైక్లో అనేక ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. వాటిలో పూర్తి ఎల్సిడి డిజిటల్ స్క్రీన్, రెండు డిస్క్ బ్రేక్లు, యాంటీ-థెఫ్ట్ అలారం, జియో-ఫెన్సింగ్, బ్లూటూత్, రిమోట్ లాక్ వంటి మరెన్నో ఫీచర్లు ఉండనున్నాయి.
ఆటంమొబైల్ ఈ వాడెర్ ఇ-బైక్ తయారీలో స్థానికంగా లభించే విడిభాగాలలో దాదాపు 90 శాతం వాటిని ఉపయోగించడం ద్వారా దీని తయారీ ఖర్చును తక్కువగా ఉంచాలని చూస్తోంది. ఆటంవాడెర్ భారత మార్కెట్లో ఈ కంపెనీ యొక్క రెండవ ఎలక్ట్రిక్ బైక్ అవుతుంది. ఇంతకుముందు, ఈ కంపెనీ ఆటమ్ 1.0 ఇ-బైక్ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది మరియు ఈ మోడల్ అమ్మకాలు సానుకూలంగానే సాగుతున్నాయి.
ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ పాతకాలపు కేఫ్-రేసర్ మోటార్సైకిల్ మాదిరిగా డిజైన్ చేయబడి ఉంటుంది. దీని డిజైన్ చాలా సింపుల్గా మరియు మినిమలిస్టిక్గా ఉంటుంది. ఇది టీనేజర్లు, యువకులు వయోజనలు వంటి అన్ని వర్గాల కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని, అందుబాటు ధరలో ఉండేలా తయారు చేసిన ఎలక్ట్రిక్ మోటార్సైకిల్. ఈ మోటార్సైకిల్ను ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసిఎటి) తక్కువ-వేగవంతమైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా ధృవీకరించింది. కాబట్టి దీనిని నడపడానికి లైసెన్స్ కానీ లేదా రిజిస్ట్రేషన్ కానీ అవసరం ఉండదు.
ఈ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్లో 48 వోల్ట్ 250 వాట్ ఎలక్ట్రిక్ మోటార్ అమర్చబడి ఉంటుంది. ఇది పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ పూర్తి ఛార్జ్పై గరిష్టంగా 100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ యొక్క గరిష్టం వేగం గంటకు 25 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ లోని లిథియం-అయాన్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుందని, దీనిని స్టాండర్డ్ 3-పిన్ సాకెట్ ఉపయోగించి ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
ఆటమ్ 1.0 ఇ-బైక్ చూడటానికి సింపుల్గా ఉన్నప్పటికీ, ఇందులో కంపెనీ అనేక ఫీచర్లను అందిస్తోంది. వీటిలో ప్రధానంగా ఎల్ఈడి హెడ్ల్యాంప్స్, ఎల్ఈడి టెయిల్ లైట్స్, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్, స్టైలిష్ కేఫ్-రేసర్ డిజైన్, సౌకర్యవంతమైన సింగిల్ పీస్ సీట్, బిగ్ ఫ్యాట్ టైర్లు, బెస్ట్-ఇన్-క్లాస్ గ్రౌండ్ క్లియరెన్స్ (280 మి.మీ) ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కోసం డిజిటల్ డిస్ప్లే మొదలైనవి ఉన్నాయి.
ఆటొమ్మొబైల్స్ ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్లోని బ్యాటరీ పూర్తిగా చార్జ్ చేయడం కోసం కేవలం 1 యూనిట్ విద్యుత్ను మాత్రమే వినియోగిస్తుందని, అంటే సగటున ఇది 100 కిలోమీటర్లకు రోజుకు కేవలం 7 నుండి 10 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తుందని కంపెనీ తెలిపింది. సాంప్రదాయక పెట్రోల్ ఇంజన్తో పోలిస్తే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది అవుతుంది. పెట్రోల్ ఇంజన్ల విషయంలో 100 కిలోమీటర్లకు సుమారు 80 - 100 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఆసక్తిగల కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ బైక్ ను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుండి రూ.999 మొత్తంతో బుక్ చేసుకోవచ్చు.