Just In
- 5 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 7 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 7 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 9 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- News జపాన్ను వణికించిన భూకంపం
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Movies ఎన్టీఆర్ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
భారీగా పెరిగిన బజాజ్ పల్సర్ 250 ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా ఎంత పెరిగిందంటే?
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'బజాజ్ ఆటో' (Bajaj Auto) తన 'పల్సర్ 250' (Pulsar 250) బైకుల ధరలను ఇప్పుడు ఒక్కసారిగా రూ. 4,000 పెంచినట్లు ప్రకటించింది. ఇందులో కంపెనీ యొక్క పల్సర్ ఎన్250 మరియు పల్సర్ ఎఫ్250 బైకులు ఉన్నాయి. బజాజ్ కంపెనీ 2022 ఫిబ్రవరి నెలలో కూడా రూ. 1,000 పెంచింది. ఇప్పుడు మళ్ళీ భారీ మొత్తంలో పెంచడం జరిగింది. ధరల పెరుగుదల తరువాత 'బజాజ్ పల్సర్ ఎన్250' ధర రూ. 1.43 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, 'బజాజ్ పల్సర్ ఎఫ్250' ధర రూ.1.45 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.
ప్రస్తుతం కంపెనీ కేవలం ధరలను పెంచడం మాత్రమే కాకుండా, ఈ బైకులను కొత్త కలర్ ఆప్సన్స్ లో కూడా అందిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ బైకును 'కరీబియన్ బ్లూ' అనే కలర్ లో తీసుకువచ్చింది. ఈ కలర్ చేరడం వల్ల బజాజ్ పల్సర్ 250 ఇప్పుడు మూడు కలర్స్ లో అందుబాటులో వచ్చింది.
బజాజ్ కంపెనీ తన పల్సర్ 250 బైకులను దేశీయ మార్కెట్లో విడుదల చేసినప్పటినుంచి కేవలం 6 నెలల వ్యవధిలో 10,000 యూనిట్లకు పైగా విక్రయించినట్లు అధికారికంగా ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క ఈ బైకులకు (పల్సర్ ఎన్250 మరియు పల్సర్ ఎఫ్250) మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందొ మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
పల్సర్ 250 బైకులు అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఈ బైకులు ఇప్పుడు ట్యూబ్లెస్ ఫ్రేమ్ ఛాసిస్పై నిర్మించబడ్డాయి. ఇది చూడటానికి చాలా ఏరోడైనమిక్గా రూపొందించింది. ఇందులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్లైట్ మరియు ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఈ బైక్ ముందు భాగం అగ్రెసివ్ లుక్ లో ఉంటుంది.
ఇందులోని టాకోమీటర్ దాని మునుపటి మోడల్ నుంచి తీసుకోబడింది. ఐతే కాకుండా ఈ బైక్ డిజిటల్ స్క్రీన్ కూడా పొందుతుంది. ఈ స్క్రీన్ బైక్ యొక్క పరిధి, గేర్ పొజిషన్ మరియు డిస్టెన్స్ టూ ఎంప్టీ వాటి సమాచారాన్ని అందిస్తుంది. అంతే కాకుండా ఈ కొత్త అప్డేటెడ్ బైకులలో USB ఛార్జింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
బజాజ్ పల్సర్ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ ఇప్పుడు 14 లీటర్లు, మరియు సీటు ఎత్తు 795 మిమీ వరకు ఉంది. మొత్తానికి ఈ బైక్ స్టైలిష్ గా మరియు వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.
ఇంజిన్ విషయానికి వస్తే, బజాజ్ పల్సర్ 250 బైక్ 250 సిసి ఆయిల్-కూల్డ్ ఇంజిన్ను పొందుతుంది. ఈ ఇంజన్ 24.5 బిహెచ్పి పవర్ మరియు 21.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్బాక్స్కి జతచేయబడి ఉంటుంది.
పల్సర్ 250 సస్పెన్షన్ విషయానికి వస్తే, ఇందులో టెలీస్కోపిక్ ఫోర్క్స్ మరియు కొత్త మోనోషాక్ సస్పెన్షన్ అమర్చబడి ఉంటుంది, కావున ఇది సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ బైక్ అసిస్ట్ మరియు స్లీపర్ క్లచ్తో కూడా వస్తుంది, ఇది వేగవంతమైన గేర్షిఫ్ట్లలో సహాయపడుతుంది.
బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 230 మిమీ డిస్క్ బ్రేక్ ఇవ్వబడింది. అంతే కాకుండా ఇందులో సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ బైక్కు దాదాపు 165 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా లభిస్తుంది.
బజాజ్ పల్సర్ 250 బైక్ యొక్క ముందువైపు 100/80 ప్రొఫైల్ టైర్లను మరియు వెనుకవైపు 17-ఇంచెస్ వీల్స్ తో 130/70 ప్రొఫైల్ను పొందుతుంది. ఈ బైక్ ఇప్పుడు టెక్నో గ్రే మరియు రేసింగ్ రెడ్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ యొక్క పనితీరు మునుపటికంటే కూడా ఇప్పుడు మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ కారణంగానే కంపెనీ ఇవి మంచి సంయలో అమ్ముడవుతూ విపరీతమైన డిమాండ్ పొందుతున్నాయి.
భారతీయ మార్కెట్లో బజాజ్ పల్సర్ 250 బైక్ యమహా ఎఫ్జెడ్, సుజుకి జిక్సర్ 250 మరియు టివిఎస్ అపాచీ ఆర్టిఆర్ 200 4వి వంటి వాటికీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. మొత్తం మీద ఇప్పుడు కంపెనీ ఒక్కసారిగా రూ. 4,000 పెంచడం వల్ల అమ్మకాలు ఎలా ఉంటాయి అనేది త్వరలో తెలియరావాలి.