Just In
- 3 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 4 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 5 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 6 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News ఐటీ హబ్ శివార్లలో 647 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, సీఎం సంచలన నిర్ణయం?
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
త్వరలో రానున్న CYBORG Bob-e ఎలక్ట్రిక్ బైక్.. ఒక్క ఛార్జ్తో 110 కిమీ రేంజ్
భారతీయ ఆటో మొబైల్ రంగం శరవేగంగా ముందుకు దూసుకెళ్తోంది, అయితే ఇప్పుడు పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల కన్నా ఎలక్ట్రిక్ వాహన వినియోగంపై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా దాదాపు చాలా కంపెనీలు తమ వాహనాలను ఎలక్ట్రిక్ రంగంలోకి తోస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ సైబోర్గ్ (Cyborg) దేశీయ మార్కెట్లో తన రెండవ ఎలక్ట్రిక్ బైక్ బాబ్-ఇ (Bob-e) ని ఆవిష్కరించింది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
సైబోర్గ్ (Cyborg) కంపెనీ దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా భారతీయ మార్కెట్లో తయారుచేయబడింది. ఈ బైక్ ఎక్కువగా యువ కస్టమర్లను ఆకర్శించడానికి స్టైలిష్ గా తయారు చేయబడింది. ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ మంచి డిజైన్ కలిగి ఉంటుంది.
కొత్త బాబ్-ఇ ఎలక్ట్రిక్ బైక్ 2.88 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే ఇది పూర్తిగా డిటాచబుల్ బ్యాటరీ. కావున దీనిని బయటకు తీసి ఛార్జింగ్ వేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ బైక్ కి ఒక్క సారి పూర్తిగా ఛార్జింగ్ వేస్తే దాదాపుగా 110 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.
ఈ బైక్ ని గంటకు 85 కిలోమీటర్ల వేగంతో రైడ్ చేయవచ్చు. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. బాబ్-ఇ ఎలక్ట్రిక్ బైక్లో ఎకో, స్పోర్ట్స్ మరియు నార్మల్ అనే మూడు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. రైడర్ తన అవసరానికి అనుగుణంగా రైడ్ మోడ్ను ఎంచుకోవచ్చు.
బాబ్-ఇ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో జియో ఫెన్సింగ్, జియో లొకేట్, బ్యాటరీ స్టేటస్, యూఎస్బీ ఛార్జింగ్, బ్లూటూత్, కీలెస్ ఇగ్నిషన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఆధునిక ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారునికి రైడింగ్ సమయంలో చాలా సహకరిస్తాయి.
బాబ్-ఇ ఎలక్ట్రిక్ బైక్ లో ఉపయోగించిన బ్యాటరీ అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతే కాకుండా ఈ బ్యాటరీ కేవలం 4 నుంచి 5 గంటల్లో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. కంపెనీ ఈ బైక్తో పాటు 15 amp హోమ్ ఛార్జర్ను కూడా కొనుగోలుదారులకు అందిస్తుంది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ రివర్స్ మోడ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇది ముందు వైపున అప్సైడ్డౌన్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్ను రెండు కలర్ ఆప్సన్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అవి బ్లాక్ మరియు సిల్వర్ కలర్స్.
ఇదిలా ఉండగా ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ కంపెనీ భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో సైబోర్గ్ (CYBORG) పేరుతో ఒక బైక్ పరిచయం చేసింది. ఈ విభాగంలో కంపెనీ అనేక ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్లను తీసుకురాబోతోంది. ప్రస్తుతం కస్టమర్లు కోరుకునే ఫీచర్స్ మరియు పరికరాలను ఇందులో అందించడమే కాకుండా, పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా కొత్త టెక్నాలజీలను ఈ బైక్ లో తీసుకురానుంది.
కంపెనీ వెల్లడించిన ఈ బైక్ హై రేంజ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్, ఇది స్వాప్ చేయగల బ్యాటరీతో అందించబడుతుంది. కావున ఈ బైక్ లో ఉన్న బ్యాటరీని బయటకు తీసి సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ కంపెనీ గుర్గావ్ లోని మనేసర్లోని ప్లాంట్లో ఈ క్రూయిజర్ బైక్ ఉత్పత్తిని ప్రారంభించింది. 2022 మరియు 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్లాంట్లో కంపెనీ 40,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సైబోర్గ్ మిడ్ మరియు హై స్పీడ్ సెగ్మెంట్లో మూడు ఉత్పత్తులను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగానే కంపెనీ తీసుకురానున్న మొదటి మోడల్ క్రూయిజర్ బైక్ యోడా (Yoda). యోడా అనేది భారతీయ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన క్రూయిజర్ బైక్. కావున భారతదేశంలోని అన్ని రకాల భూభాగాల్లో పరీక్షిస్తోంది. కావున ఇది తప్పకుండా భారతీయ వినియోగదారులకు మన్నికైన బైక్ కానుంది. ఈ బైక్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.