Just In
- 10 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 12 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 13 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 15 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- Movies Brahmamudi April 25th episode: కావ్య విషయంలో రుద్రాణికి షాకిచ్చిన కనకం.. రెచ్చగొడుతున్న రాహుల్
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలలో పరుగులు తీస్తున్న ఏథర్ 450ఎక్స్.. ఇందులో అంత స్పెషల్ ఏంటంటే..?
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) స్టార్టప్ బ్రాండ్లలో ఏథర్ ఎనర్జీ (Ather Energy) కూడా ఒకటి. ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం భారత మార్కెట్లో ఒకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ (Ather 450X) ను మాత్రమే విక్రయిస్తోంది. అయినప్పటికీ, ఈ మోడల్ కు మాత్రం విపరీతమైన డిమాండ్ ఉంది. కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత ఫిబ్రవరి నెలలో ఈ స్కూటర్ భారీ వృద్ధిని నమోదు చేసింది. ఫిబ్రవరి 2021తో పోలిస్తే ఫిబ్రవరి 2022లో ఏథర్ 450 స్కూటర్ అమ్మకాలు 140 శాతం వృద్ధిని సాధించాయి.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాల కారణంగా మన దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం బాగా మెరుగుపడింది. ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించిన EV స్టార్ట్-అప్ బ్రాండ్లలో ఏథర్ ఎనర్జీ కూడా ఒకటి. బెంగుళూరుకు చెందిన కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో హీరో ఎలక్ట్రిక్ మరియు ఒకినావా బ్రాండ్ల తర్వాత 3వ అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుగా అవతరించింది.
ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం 450 మరియు 450X అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే విక్రయిస్తోంది. వీటిలో 450 బేస్ వేరియంట్ కాగా, 450X ప్రీమియం వేరియంట్. సెమీకండక్టర్ల కొరత కారణంగా పెట్రోల్ స్కూటర్ల అమ్మకాలు క్షీణించడంతో, ఏథర్ ఎనర్జీ ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల ద్వారా గత ఫిబ్రవరిలో దాదాపు 140 శాతం అమ్మకాలను సాధించింది. గత నెలలో ఈ బెంగుళూరు స్టార్టప్ బ్రాండ్ క్రింద మొత్తం 2,042 ఎలక్ట్రిక్ స్కూటర్లు విక్రయించబడ్డాయి.
కాగా, ఫిబ్రవరి 2021లో, ఏథర్ ఎనర్జీ కేవలం 850 ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే విక్రయించింది. ఈ సమయంలో ఏథర్ ఎనర్జీ అమ్మకాలు 140 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. కానీ నెలవారీతో పోలిస్తే ఈ విక్రయాల సంఖ్య 27 శాతం తక్కువగా ఉంది. జనవరి 2022లో ఏథర్ ఎనర్జీ మొత్తం 2,825 ఏథర్ ఇ-స్కూటర్లను విక్రయించింది. నిజానికి ఏథర్ ఎనర్జీ, ఇతర 2-వీలర్ తయారీదారుల మాదిరిగానే సెమీకండక్టర్ల కొరత కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటోంది.
తాజా నివేదికల ప్రకారం, గత ఫిబ్రవరిలో విక్రయించబడిన 2,042 ఏథర్ ఇ-స్కూటర్లు ఇప్పటికే తయారు చేయబడ్డాయి మరియు డెలివరీకి సిద్ధంగా ఉంచబడ్టట్లు సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన కర్ఫ్యూ కారణంగా ఏర్పడిన ఈ చిప్ల కొరత గత ఏడాది కాలంగా భారతదేశంతో సహా ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమకు అతిపెద్ద తలనొప్పిగా మారింది. అయితే రాబోయే 2-3 నెలల్లో ఈ పరిస్థితి స్థిరపడుతుందని మరియు విడిభాగాల పంపిణీదారులు డిమాండ్-డెలివరీ మధ్య అంతరాన్ని తగ్గిస్తారని ఏథర్ ఎనర్జీ ఆశాజనకంగా ఉంది.
ఏథర్ ఎనర్జీ తమ ఎలక్ట్రిక్ వాహనాల కోసం తయారు చేసిన ఛార్జింగ్ కాన్ఫిగరేషన్ను ఏథర్ గ్రిడ్ అని పిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఏథర్ గ్రిడ్ ఛార్జింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్న ఏథర్ ఎనర్జీ ఇందులో భాగంగా కర్ణాటకలో రాష్ట్రవ్యాప్తంగా 1000 ఏథర్ గ్రిడ్ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికార రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏథర్ ఎనర్జీ సీఈవో తరుణ్ మెహతా ఈ ప్రాజెక్టును కర్ణాటక రాష్ట్రానికి తీసుకురానున్నట్టు ఇప్పటికే తన ట్విట్టర్ పేజీలో ధృవీకరించారు.
ఎథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా ఏథర్ గ్రిడ్ ఛార్జింగ్ కేంద్రాలను నెలకొల్పుతూనే ఉంది, ఏథర్ ఎనర్జీ కూడా రివర్స్ వాహన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతం ఏథర్ ఎనర్జీ ప్లాంట్ సంవత్సరానికి గరిష్టంగా 4 లక్షల ఇ-స్కూటర్లను ఉత్పత్తి చేయగలదు. కాగా, ఈ కంపెనీ వచ్చే 2022 నాటికి ఈ సంఖ్యను 10 లక్షలకు లేదా 1 మిలియన్కు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ఇదిలా ఉంటే, ఏథర్ ఎనర్జీ తరపున భారతదేశం అంతటా 5,000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడుతున్నాయి.
ఏథర్ బ్రాండ్లో ప్రస్తుతం 2 ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే విక్రయించబడుతున్నప్పటికీ, ఈ EV స్టార్ట్-అప్ త్వరలోనే ఈ సంఖ్యను పెంచాలని చూస్తోంది. దీని ప్రకారం రిటైల్ అవుట్లెట్ల సంఖ్యను కూడా 600కు పెంచనున్నారు. ప్రస్తుతం, ఏథర్ ఎనర్జీ ఇప్పటివరకు భారతదేశంలోని 24 నగరాల్లో కేవలం 29 రిటైల్ అవుట్లెట్లను మాత్రమే కలిగి ఉంది. ఈ 29 అవుట్లెట్ల ద్వారా కంపెనీ నెలకు సగటున 2,000 ఇ-స్కూటర్లను విక్రయించగలగడం నిజంగా ఆశ్చర్యకరం.
ఈథర్ ఎనర్జీ మార్చి 2023 నాటికి మార్కెట్ను 100 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రిటైల్ కేంద్రాలు పరిమితం అయినప్పటికీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఏథర్ గ్రిడ్ కేంద్రాలు దాదాపు 300 స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం, మార్కెట్లో ఏథర్ 450 ప్లస్ ధర రూ. 1.09 లక్షలుగా ఉంటే, ఏథర్ 450ఎక్స్ ధర రూ. 1.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ మరియు 2.9 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8 బిహెచ్పి పవర్ ను మరియు 26 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 నుంచి 40 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే గరిష్టంగా 116 కి.మీ పైగా దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రైడ్ మరియు ఎకో అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. ఈ స్కూర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లుగా ఉంటుంది. రైడర్ ఎంచుకునే మోడ్ని బట్టి ఈ టాప్ స్పీడ్ మరియు రేంజ్ మారుతూ ఉంటుంది. ఎకో మోడ్లో, ఇది 85 కిమీ మరియు రైడ్ మోడ్లో 75 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ను కలిగి ఉంటుంది.