భారత్లో విడుదలైన బజాజ్ ట్రయంఫ్ బైక్స్.. ధర రూ. 2.33 లక్షలు, మొదటి పదివేల కస్టమర్లకు బంపర్ ఆఫర్..
బజాజ్ - ట్రయంఫ్ భాగస్వామ్యంతో స్పీడ్ 400 మరియు స్క్రాంబ్లర్ 400 ఎక్స్ భారత మార్కెట్లో విడుదల అయ్యాయి. ట్రయంఫ్ స్పీడ్ 400 ధర రూ. 2.33 లక్షలు కాగా స్క్రాంబ్లర్ 400 ఎక్స్ ధర త్వరలో తెలియనుంది. కాగా మొదటి 10,000 కస్టమర్లకు రూ.10,000 పరిచయ తగ్గింపు లభిస్తుంది.
ట్రయంఫ్ ప్రపంచవ్యాప్తంగా బైక్ల తయారీ మరియు విక్రయదారుల్లో అగ్రగామిగా ఉంది. బజాజ్ భాగస్వామ్యంతో భారతదేశంలో తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ట్రయంఫ్ రూపొందించిన బైకులను బజాజ్ భారతదేశంలో తయారు చేసి విక్రయించనుంది. ట్రయంఫ్ స్పీడ్ 400 జూలై ద్వితీయార్థంలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 X అక్టోబర్లో విక్రయంలోకి రానుంది.

గతంలో, హార్లీ డేవిడ్సన్ భారత్కు హార్లీ డేవిడ్సన్ బైక్లను తీసుకురావడానికి ఇదే విధమైన ఒప్పందంతో హీరో మోటార్సైకిల్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో బజాజ్ భారతదేశంలో ట్రయంఫ్ బైక్లను విక్రయిస్తోంది. ఇప్పుడు ఈ రెండు కంపెనీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ట్రయంఫ్ స్పీడ్ 400 మరియు స్క్రాంబ్లర్ 400 X జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయ్యాయి.
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 X మరియు స్పీడ్ 400 రెండూ సరికొత్త 'TR' సిరీస్ సింగిల్-సిలిండర్ ఇంజిన్తో రూపొందించబడ్డాయి. కొత్త ఫోర్-వాల్వ్, DOHC, 398.15cc సింగిల్ ఆయిల్ కూలింగ్ మరియు ఫ్యూయల్ ఇంజెక్షన్ను కలిగి ఉన్నాయి. అంతే కాకుండా 6-స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి ఉన్నాయి.

స్పీడ్ 400 మరియు స్క్రాంబ్లర్ 400 X యొక్క కొత్త ఇంజిన్ 8,000rpm, 39.5bhp మరియు 6,500rpm వద్ద 37.5Nm గరిష్ఠ టార్క్ను ఉత్పత్తి చేస్తాయి. ఇంజిన్ స్టెయిన్లెస్ స్టీల్ హెడర్ మరియు సైలెన్సర్ సెటప్ను కలిగి ఉన్నాయి. రెండు బైక్లు స్లిప్పర్ క్లచ్తో వస్తాయి.
ఈ రెండు బైక్లు ట్రయంఫ్ స్పీడ్ 900 మరియు స్క్రాంబ్లర్ 900/1200 ఆధారంగా రూపొందించబడ్డాయి. దాదాపు రెండింటినీ ఒకేలా కనిపించేలా డిజైన్ చేశారు. రెండు బైక్లలో అనేక సాధారణ ఫీచర్లు ఉన్నాయి. UST ఫోర్కులు, వెనుక మోనోషాక్ సస్పెన్షన్, 2-వీల్ డిస్క్ బ్రేక్లు మరియు డ్యూయల్-ఛానల్ ABS, LED లైటింగ్, ట్రాక్షన్ కంట్రోల్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే, అల్లాయ్ వీల్స్తో కూడిన ట్యూబ్లెస్ టైర్లు, 790mm సీట్ ఎత్తు.
రెండు బైక్లు కొన్ని విభిన్నమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. బ్రేక్ల విషయానికొస్తే, స్క్రాంబ్లర్ 400X బైక్కు 320 మిమీ డిస్క్ బ్రేక్ను కలిగి ఉంది. స్పీడ్ 400 బైక్కు 300 ఎంఎం డిస్క్ బ్రేక్తో వస్తుంది. బరువు విషయానికి వస్తే స్క్రాంబ్లర్ బైక్ బరువు 179 కిలోలు కాగా స్పీడ్ 400 బైక్ బరువు 170 కిలోలుగా ఉంది.
భారతీయ వెర్షన్ బైక్లో నంబర్ ప్లేట్, సైడ్కార్ మరియు గ్రాబ్ హ్యాండిల్స్ అందించబడ్డాయి. ఈ బైక్లకి సంబంధించిన వారంటీ విషయానికి వస్తే, ఇది 16 వేల కి.మీ సర్వీస్ ఇంటర్వెల్తో 2 సంవత్సరాల అపరిమిత వారంటీతో వస్తుంది. ఈ మధ్యలో ఏదైనా సమస్య ఎదురైనా ట్రయంఫ్ ద్వారా పరిష్కరించబడుతుంది.
ఈ రెండు బైక్లలో, స్పీడ్ 400 బైక్ ఈ నెల మధ్యలో షోరూమ్లలోకి రానుంది, స్క్రాంబ్లర్ 400 X బైక్ అక్టోబర్లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం, బజాజ్ కంపెనీ నెలకు 5 వేల బైక్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ బైక్ల బుకింగ్ ప్రారంభం కావడంతో చాలా మంది రూ.2 వేలు చెల్లించి ఈ బైక్లను బుక్ చేసుకుంటున్నారు.
స్పీడ్ 400 బైక్ డెలివరీ ఈ నెల మధ్యలో ప్రారంభమవుతుందని, అక్టోబర్లో స్క్రాంబ్లర్ 400 ఎక్స్ బైక్ డెలివరీ ఉంటుందని సమాచారం. ఈ బైక్ ధర విషయానికి వస్తే ప్రస్తుతం స్పీడ్ 400 బైక్ ధర మాత్రమే ప్రకటించారు. రూ. 2.33 లక్షల ధరతో ఈ బైక్ను విడుదల చేశారు.
ఈ బైక్ను కొనుగోలు చేసిన మొదటి 10,000 మంది వినియోగదారులకు మాత్రమే రూ.2.23 లక్షల ధరకు విక్రయానికి అందుబాటులో ఉంది. స్క్రాంబ్లర్ 400ఎక్స్ బైక్ ధరను తర్వాత వెల్లడించనున్నారు. ఈ రెండు ట్రయంఫ్ బైక్లు రాయల్ ఎన్ఫీల్డ్ మరియు ఇటీవల ప్రకటించిన హార్లీ డేవిడ్సన్ బైక్లతో మార్కెట్లో పోటీపడనున్నాయి.


Click it and Unblock the Notifications








