జూలైలో పెరిగిన ఎలక్ట్రిక్‌ టూవీలర్ సేల్స్‌.. జనాలు ఎక్కువగా కొంటున్న స్కూటర్లు ఇవే..!!

దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంచి ఆదరణ పెరుగుతోంది. 2023 జూలై నెలలో దేశంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్మకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 51,299 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విక్రయాలు జరిగినట్లు నివేదికలు తెలిపాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

2023 జూన్ తో పోలిస్తే జూలైలో సేల్స్‌ అధికం జరగడం విశేషం. జూలైలో టూవీలర్ ఎలక్ట్రిక్ రంగం ఊహించని విధంగా పుంజుకుంది. జూన్ నెలలో భారతదేశంలో కేవలం 45,984 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు జూలైలో 11.55 శాతం పెరిగాయి.

Electric-Two-Wheelers

భారతదేశ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో ఓలా ఎలక్ట్రిక్‌ కింగ్‌ మేకర్‌గా కొనసాగుతోంది. జూలైలో కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ఉత్తమ అమ్మకాల వృద్ధిని సాధించింది. ఓలా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మొత్తం 18,333 యూనిట్లను విక్రయించింది.

2023 జూన్తో పోలిస్తే ఇది 4 శాతం అధికంగా ఉంది. ఆ నెలలో కేవలం 17,622 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. మొత్తం మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో ఓలా ఎలక్ట్రిక్ వాహనాల వాటా 36 శాతానికి పైగా ఉంది. రోజు రోజుకు ఓలాకు డిమాండ్‌ పెరుగుతోంది. అదిరిపోయే ఆఫర్లతో వినియోగదారులను ఓలా ఆకర్షిస్తోంది.

Tvs-Iqube-Electric-Scooter

ఆ తదుపరి స్థానంలో టీవీఎస్ ఉంది. గతంలో ఏథర్ ఎనర్జీ రెండో స్థానంలో ఉండగా ఇప్పుడు టీవీఎస్ రెండో స్థానానికి ఎగబాకింది. మొత్తం 9,599 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించడంతో టీవీఎస్ రెండో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఏథర్ ఎనర్జీకి ఈ సంస్థ గట్టి పోటిని ఇస్తుంది.

ప్రస్తుతం టీవీఎస్ ఇండియన్ మార్కెట్లో ఐక్యూబ్ అనే ఒకే ఒక్క ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందిస్తోంది. గత కొన్ని నెలలుగా దేశంలో దీనికి ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఓలాకు ధీటుగా ఈ సంస్థ ఆఫర్లను కూడా అందిస్తోంది.

ఇటీవల 1.50 లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలు సాధించినట్లు కంపెనీ తెలిపింది. ఇది మొత్తంగా అమ్మకానికి వచ్చి 43 నెలలు మాత్రమే అయింది, మరియు టీవీఎస్ ఐక్యూబ్ ఈ భారీ అమ్మకాల సంఖ్యను చేరుకోవడం గమనార్హం. ఆ తర్వాత ఏథర్ ఎనర్జీ మూడో స్థానంలో ఉంది.

ఏథర్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు గరిష్టంగా 6,198 యూనిట్లను విక్రయించాయి. బజాజ్ నాలుగో స్థానంలో ఉంది. కంపెనీ యొక్క సింగిల్ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 3,192 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఒకినావా, ఆంపియర్, హీరోస్ విటా, హీరో ఎలక్ట్రిక్ ఉన్నాయి.

వీటిలో ఒకినావా 2,138 యూనిట్లు, యాంపియర్ 1,343 యూనిట్లను గత నెలలో విక్రయించింది. భారత ద్విచక్ర వాహన దిగ్గజం హీరో ఎలక్ట్రిక్ కంటే విటా బ్రాండ్ ఎక్కువ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. విటా బ్రాండ్ జూలైలో కేవలం 951 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. హీరో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు గత నెలలో 759 యూనిట్ల సేల్స్‌ మాత్రమే జరిగాయి.

దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న హీరో ఎలక్ట్రిక్ ఇప్పుడు అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇది చాలా షాకింగ్ కలిగించే అంశంగా మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కంపెనీలతో గట్టీ పోటి ఇచ్చి నిలవాలంటే ఖచ్చితంగా భారీ మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, August 4, 2023, 10:55 [IST]
English summary
Electric two wheeler sales in july ola electric in top position
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+