కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూ. 2,999 కే Ivoomi ఇ స్కూటర్లో మరిన్ని ఫీచర్లు పొందొచ్చు.!!
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Ivoomi Energy తన బ్రాండ్ను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు తన స్కూటర్స్ లైనప్లో మరిన్ని ఫీచర్లను తీసుకువచ్చింది. వెహికల్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ ద్వారా Ivoomi యొక్క అన్ని స్కూటర్లలో ఈ ఫీచర్లు రానున్నాయి. పూర్తి సమాచారం ఈ కథనంలో..
భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో స్టార్టప్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఓ వైపు ఐసీఈ సెగ్మెంట్లో హీరో మోటోకార్ప్, టీవీఎస్, బజాజ్లు దూసుకుపోతుంటే.. మరో వైపు ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్లో ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ, ఏథర్ వంటి సంస్థలు సత్తా చాటుతుననాయి. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ Ivoomi కూడా కస్టమర్లను పెంచుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.

Ivoomi కొత్త వెహికల్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ కింద, కంపెనీ ప్రస్తుత ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లు తమ వాహనాలపై రూ. 2,999కి కొత్త ఫీచర్లను అన్లాక్ చేయడానికి ఒక ఆప్షన్ను ప్రవేశపెట్టింది. కాగా Ivoomi యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్లోని Jeet X, S1 మరియు S1 2.0 మోడల్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ అప్గ్రేడ్ ద్వారా ప్రస్తుత కస్టమర్లు.. తాజా టెక్నాలజీని అందిపుచ్చుకోవచ్చు.
iVoomi అందిస్తున్న వెహికల్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్(Vehicle Upgrade Program) లో బ్లూటూత్ కనెక్టివిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC), టర్న్-బై-టర్న్ నావిగేషన్, కీలెస్ స్టార్ట్/అన్లాక్, మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్, స్మార్ట్ సెక్యూరిటీ ఇలా అనేక అధునాతన ఫీచర్లను తన స్కూటర్లలో అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా స్మార్ట్ ఇ-మొబిలిటీ రంగంలో కొత్త ఒరవడి సృష్టిస్తుందని కంపెనీ కో ఫౌండర్, సీఈవో అశ్విని భండారీ అన్నారు.

Ivoomi ఎలక్ట్రిక్ స్కూటర్లను కలిగి ఉన్న కస్టమర్లు ఈ కొత్త ఫీచర్లను అన్లాక్ చేయడానికి సమీప అధీకృత డీలర్షిప్ను సందర్శించాలి. కస్టమర్కి వారి వాహనాన్ని కనెక్ట్ చేయబడిన స్కూటర్కి ఎలా అప్గ్రేడ్ చేయాలో డీలర్షిప్ సిబ్బంది వివరిస్తారు. అయితే ఈ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ తాత్కాలిక కాలానికి కాదా అని కంపెనీ వెల్లడించలేదు.
కాగా Ivoomi బ్రాండ్ యొక్క కొత్త శ్రేణి ఇ-స్కూటర్లు ముందుగా ఇన్స్టాల్ చేయబడిన కనెక్ట్ చేయబడిన ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. Ivumi యొక్క Jeet X మరియు S1 మోడల్లు వేగవంతమైన ఇ-స్కూటర్లు కాగా.. ఇవి పూర్తి ఛార్జింగ్పై వరుసగా 100 కి.మీ మరియు 110 కి.మీ రేంజ్ను అందిస్తాయి.

AIS 156 సర్టిఫికేషన్తో, iVoomi Jeet X ఎలక్ట్రిక్ స్కూటర్లు సురక్షితమైన పద్ధతిలో మార్కెట్లోకి రాబోతున్నాయని కంపెనీ వెల్లడించింది. ఈ మోడల్ 100 శాతం భారత్లోనే తయారయ్యాయి. సొగసైన మినిమలిస్టిక్ డిజైన్తో వీటిని సంస్థ రూపొందించింది. ఎక్కువ బ్యాటరీ లైఫ్, పెద్ద సీట్లు మరియు 12-అంగుళాల వీల్స్తో రూ. 90 వేల ప్రారంభ ధరతో ఈ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.

మరోవైపు Ivoomi ఎనర్జీ యొక్క S1 భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా ఉంది. ఈ స్కూటర్ గరిష్ఠంగా గంటకు 57 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. పూర్తి ఛార్జింగ్పై 240 కి.మీ రేంజ్ను ఇస్తుంది. Ivoomi యొక్క S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రెండు గంటల్లో 50 శాతం వరకు ఛార్జింగ్ చేయగల ఒక స్వాపబుల్ బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








