రూ. 99,999 లకే 3 kWh బ్యాటరీ ఆప్షన్తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 170 కి.మీ రేంజ్ పక్కా!
దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటిగా IVoomi Electric Scooter కంపెనీ ఎదుగుతోంది. ఈ కంపెనీ నుంచి వచ్చే స్కూటర్లు సరసమైన ధరలో అధిక రేంజ్ అందించేలా సంస్థ రూపొందిస్తుంది. కంపెనీ నుంచి అత్యంత ప్రాచుర్యం పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో జీత్ లైనప్ ఉంది. ప్రస్తుతం ఈ లైనప్లో సరికొత్త జీత్ ఎక్స్ జడ్ఈ (JEETX ZE) స్కూటర్ని 3kWh బ్యాటరీ ఆప్షన్లో ఆవిష్కరించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగాన్ని ఏలేందుకు జీత్ఎక్స్-జెడ్ఈ 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ రూపంలో గట్టి సవాల్ విసరనుంది.
దీని ప్రారంభ ధర రూ. 99,999 ఫిక్స్ చేశారు. ఇది కేవలం ఎక్స్ షోరూమ్ ధర మాత్రమే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ చేస్తే 170 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలోనే అన్ని మిగతా రాష్ట్రాల్లోకి దీనిని విడుదల చేయనున్నారు.

ఈ ఐవూమీ ఎలక్ట్రిక్ స్కూటర్లు తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, రాజస్థాన్ లలో అందుబాటులో ఉంటుంది. ఇది పురాతన మరియు ఆధునిక రూపకల్పనతో అద్భుతంగా తీర్చిదిద్దింది. జీత్ ఎక్స్ జెడ్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్కు భారతదేశంలో మంచి స్పందన లభిస్తోంది. విజయవంతమైన రిసెప్షన్ని కొనసాగించడానికి, 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ లో కొత్త ఎంపికను ప్రవేశపెట్టారు.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మెరుగైన మన్నిక మరియు స్థిరత్వాన్ని అందించడానికి 42 మిమీ ERW1 స్టీల్ ట్యూబ్తో తయారు చేసిన అండర్ ఫ్రేమ్ని ఉపయోగించారు. ఇక ఈ స్కూటర్ని మొబైల్ యాప్ కనెక్టివిటీతో స్మార్ట్ స్పీడోమీటర్, టర్న్ బై టర్న్ రూట్ సమాచారాన్ని అందించే నావిగేషన్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీతో నావిగేట్ చేయవచ్చు.

వీటితో పాటు స్కూటర్ స్క్రీన్లో కాల్స్, టెక్స్ట్ మెసేజ్లను పొందవచ్చు, ట్రావెల్ డేటా, SOC అలర్ట్స్ వంటి ఫీచర్లు కూడా ఈ స్కూటర్లో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 63 కిలోమీటర్లుగా ఉంది. ఇది చాలా మంచి బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది. అందువల్ల, ఇది సుదూర మరియు సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారిస్తుంది.
ఇది స్మూత్ మరియు సౌకర్యవంతమైన రైడ్ కోసం 75 MM టెలిస్కోపిక్ సస్పెన్షన్ని కూడా పొందుతుంది. దీనితో పాటు, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మూడు రైడింగ్ మోడ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇందులో ఇగో, రైడర్, స్పీడ్ మోడ్స్ని అందించారు. ఎకో మోడ్లో 170 కిలోమీటర్లు, రైడర్ మోడ్లో 140 కిలోమీటర్లు, స్పీడ్ మోడ్లో 130 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది.

కొత్తగా లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో ఓలా స్కూటర్ కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. ఈ కంపెనీ స్కూటర్లు ఓలా ఎలక్ట్రిక్కి ప్రధాన పోటీదారుగా ఉండనుంది. దీని రాకతో మరెన్నో ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లకు సవాళ్లను విసురనుంది. ప్రస్తుతం దేశంలో ఈ నెలాఖరులో లేదా ఆగస్టు నెలాఖరులో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
అధునాతన ఫీచర్లు, మంచి ధర మరియు అధిక రేంజ్ అందించే సామర్థ్యంతో జీత్ లైన్ప్లోని స్కూటర్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి డిజైన్ని కలిగి ఉన్నాయి. పూర్తిగా వెస్పా మోడళ్ల మాదిరిగా ఈ స్కూటర్లు ఉండనున్నాయి. అందువల్ల కస్టమర్ల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.
డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








