కేటీఎం ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఈ బైక్లపై 5 సంవత్సరాల ఉచిత వారంటీ
ప్రముఖ ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ తయారీదారు KTM సంస్థ.. కస్టమర్లను పెంచుకునేందుకు బంపర్ ఆఫర్ను తీసుకువచ్చింది. ఏప్రిల్ 1, 2024 నుంచి కొనుగోలు చేసిన అన్ని KTM మరియు Husqvarna బైక్లపై కస్టమర్లకు అదిరిపోయే అవకాశాన్ని అందిస్తోంది. ఆఫర్ల వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
గ్లోబల్ మార్కెట్ దిగ్గజం KTM యువత కోసం డ్రీమ్ బైక్లను తయారు చేస్తోంది. భారత మార్కెట్లో ఇప్పటికీ డ్యూక్ మరియు ఆర్సీలు మార్కెట్లో హాట్కేక్లుగా అమ్ముడవుతుంటాయి. స్పోర్టీ స్టైలింగ్ మరియు శక్తివంతమైన పనితీరుతో, బ్రాండ్ ఇప్పుడు కస్టమర్లను మరింతగా పెంచుకునేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరంలో సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది.

ఇక నుంచి కేటీఎం మరియు హస్క్వర్నా బైక్లు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు.. 5 సంవత్సరాల ఉచిత వారంటీని పొందవచ్చు. ఇందులో 2 సంవత్సరాల ప్రామాణిక వారంటీ (30,000 కి.మీ) మరియు 3 సంవత్సరాల పొడిగించిన వారంటీ (45,000 కి.మీ) ఉన్నాయి. ఈ వారెంటీ ద్వారా బైక్ యజమానులకు ఖరీదైన నిర్వహణ మరియు మరమ్మతుల ఆర్థిక భారాన్ని తగ్గించడంలో దోహదపడుతుందని సంస్థ చెబుతోంది.
కాగా కేటీఎం సంస్థ తన బైక్ సంబంధిత సమస్యలను కవర్ చేస్తుందని పేర్కొంది. మరమ్మతులకు సంబంధించిన లేబర్ ఖర్చు కూడా కొత్త వారంటీ పథకం కింద కవర్ చేయబడుతుందని తెలిపింది. వారంటీ స్కీమ్లో మెయింటెనెన్స్, రిపేర్లు ఉంటున్నాయి కాబట్టి.. కస్టమర్లకు ఆర్థికంగా చాలా లాభాలుంటాయని సంస్థ చెబుతోంది.

కేటీఎం అందించే కొత్త వారంటీ ప్యాకేజీలో ఇది కస్టమర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా లేబర్ ఛార్జీలు వాహన తయారీదారులు అందించే వారంటీ పథకాల కింద కవర్ చేయబడవు. KTM మరియు Husqvarna వంటి అధిక-పనితీరు గల బైక్ల కోసం, ఇటువంటి ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఇక్కడే టీమ్ ఆరెంజ్ తన ప్రత్యేకంగా చాటుకుంటుంది. కస్టమర్ల కోసం కంపెనీ తీసుకున్న నిర్ణయం పట్ల కేటీఎం, హస్క్వర్నా బైక్లను కొనుగోలు చేయాలనుకునేవారికి సగం ఆందోళన తగ్గుతుంది. వారంటీ పథకం కాకుండా, KTM, Husqvarna బైక్ల కొనుగోలుదారులు 1-సంవత్సరం ఉచిత రోడ్సైడ్ అసిస్టెన్స్ ప్యాకేజీని కూడా పొందుతారు.

ఈ ప్యాకేజీలో 24/7 రోడ్సైడ్ అసిస్టెన్స్, సేఫ్ టోయింగ్, ఆన్-సైట్ రిపేర్లు మరియు ఫ్లాట్ టైర్ అసిస్టెన్స్ వంటి సేవలు ఉన్నాయి. ఇది KTM యొక్క ముఖ్యమైన చర్య అని చెప్పవచ్చు. లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు సడెన్గా బైక్ చెడిపోవడం లేదా టైర్ పంక్చర్ అవడం వల్ల రైడర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీపంలో సర్వీస్ సెంటర్లు కూడా లేకపోవడంతో ఈ సమస్య ఇంకా తీవ్రమవుతోంది.
దీన్ని అర్థం చేసుకున్న కేటీఎం కంపెనీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్యాకేజీని కూడా తీసుకొచ్చింది. 1 సంవత్సరం ఉచిత రోడ్సైడ్ అసిస్టెన్స్తో అత్యంత అనుకూలమైన పరిష్కారాన్ని తీసుకువచ్చింది. తద్వారా కేటీఎం డ్యూక్ మరియు RC మోడల్ల నాణ్యతను మెరుగుపరచడంలో ఈ స్పెషల్ ప్యాకేజీలు ఉపయోగకరంగా ఉంటాయి.

ప్రస్తుతం, ఆస్ట్రియన్ స్పోర్ట్ బైక్ తయారీదారు కేటీఎం భారత మార్కెట్లో.. డ్యూక్ 125, 200, 250, 390, RC 200, RC 390, 390 అడ్వెంచర్ మరియు 390 అడ్వెంచర్ ఎక్స్లను విక్రయిస్తోంది. మంచి డిమాండ్తో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించడంతో KTM ఇప్పుడు తన ఇండియన్ మోటార్సైకిల్ లైనప్ను విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
కొత్త ప్లాన్లలో భాగంగా KTM 390 ఎండ్యూరో, కొత్త 390 అడ్వెంచర్ వంటి మోడళ్లను త్వరలో పరిచయం చేయనుంది. ప్రస్తుతం టెస్టింగ్లో ఉన్నందున వీటిలో ఏది ముందుగా మార్కెట్లోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు. KTM 390 ఎండ్యూరో బైక్ రాబోయే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 అడ్వెంచర్ టూరర్తో పోటీగా ఉండనుంది.


Click it and Unblock the Notifications








