రూ. 69,999 కే Odysse ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్.. 105 కి.మీ రేంజ్
భారత మార్కెట్లో మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలయ్యాయి. ప్రముఖ ఈవీ కంపెనీ ఒడిస్సే(Odysse).. స్నాప్ మరియు E2 అనే పేర్లతో రెండు ఇ స్కూటర్లను లాంచ్ చేసింది. ఒకటి హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాగా.. మరొకటి లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఈ కథనంలో..
దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇ స్కూటర్ విభాగంలో పోటీ వివరీతంగా ఉంది. స్టార్టప్లతో పాటు ప్రముఖ కంపెనీలు కూడా ఈ రంగంలో సత్తా చాటేందుకు కృషి చేస్తున్నాయి. తక్కువ ధరలో, అధునాతన ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకునేలా స్కూటర్లను డిజైన్ చేస్తున్నాయి.

ఈవీ విభాగంలో ఓలా, ఏథర్ ఎనర్జీ, టీవీఎస్ లాంటి ప్రముఖ సంస్థలు గణనీయమైన సేల్స్తో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన ప్రముఖ ఈవీ కంపెనీ Odysse నుంచి ఇప్పటికే పలు స్కూటర్లు మార్కెట్లో అందుబాటులో ఉండగా.. తాజాగా మరో రెండు ఇ స్కూటర్లను లాంచ్ చేసింది.
Odysse నుంచి Snap అనే హై- స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ను సంస్థ రూ. 79,999 కే విడుదలైంది. కాగా మరో స్కూటర్ లో- స్పీడ్ వేరియంట్లో E2 ను రూ. 69,999 ధరతో లాంచ్ అయింది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. లోనావాలాలో జరిగిన వార్షిక డీలర్ల సమావేశంలో రెండు బ్యాటరీ ఆప్షన్లతో ఈ స్కూటర్లను లాంచ్ చేశారు.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల లాంచ్పై.. ఒడిస్సే ఎలక్ట్రిక్ CEO నెమిన్ వోరా మాట్లాడారు. SNAP హై-స్పీడ్ స్కూటర్ మరియు E2 లో-స్పీడ్ స్కూటర్ పరిచయంతో.. స్టెబిలిటీ, పర్ఫామెన్స్ ఇంకా కస్టమర్ సాటిశ్ఫాక్షన్ పరంగా వీటిని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. తక్కువ ధరలో ఈ అధునాతన స్కూటర్లను ప్రవేశపెట్టడం ద్వారా.. భారత మార్కెట్తో పాటు ఇతర మార్కెట్లలో కూడా కొత్త ప్రమాణాలను సెట్ చేస్తుందని చెప్పారు.
కాగా Odysse స్నాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ను శక్తివంతం చేయడం కోసం 2kW ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించారు. ఈ మోటార్ ద్వారా రైడర్ గరిష్ఠంగా గంటకు 60 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. ఇందులో AIS156 సర్టిఫైడ్ స్మార్ట్ బ్యాటరీ (LFP) ప్యాక్ను ఉపయోగించారు. ఈ బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు 4 గంటల కంటే తక్కవ సమయం పడుతుందని కంపెనీ వెల్లడించింది.
Odysse Snap ఇ స్కూటర్ పూర్తి ఛార్జ్పై 105 కి.మీ రేంజ్ను అందిస్తుంది. ఫీచర్ల పరంగా, SNAP ఖచ్చితమైన బ్యాటరీ లెవెల్స్, రేంజ్, ఇంకా రైడర్కు అవసరమైన సమాచారాన్ని పొందుపరిచేందుకు CAN- ఎనేబుల్డ్ డిస్ప్లేను తీసుకువచ్చింది. అంతేకాకుండా ఈ స్కూటర్లో క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది.
ఇక E2 ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికొస్తే ఇందులో చాలా సింపుల్ స్పెసిఫికేషన్లను చూడవచ్చు. ఇది 250W ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో బ్యాటరీ సమాచారాన్ని సంస్థ వెల్లడించలేదు కానీ.. ఈ స్కూటర్ గరిష్ఠంగా గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని సంస్థ వెల్లడించింది.
పూర్తి ఛార్జ్పై Odysse E2 ఇ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ 70 కి.మీ గరిష్ట రేంజ్ను అందించడంతో పాటు కేవలం 4 గంటల్లో బ్యాటరీని పూర్తి ఛార్జ్ చేయవచ్చు. ఇక ఇప్పటికే ఒడిస్సే భారత మార్కెట్లో.. హాక్ లైట్, E2GO, రేసర్ లైట్, వాడర్ మరియు ఎవోకిస్ వంటి అనేక రకాల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications








