తక్కువ ధరకే జావా-యెజ్డి బైక్లు.. పండుగ టైంలో కొత్త మాస్ బైకును ఇంటికి తెచ్చుకోండి!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీపై చేసిన కీలక సంస్కరణల వల్ల బైకు ప్రియులకు శుభవార్త అందింది. వాహనాలపై పన్ను తగ్గింపుతో జావా, YZD బ్రాండ్ బైక్లు మరింత సరసమైన ధరల్లో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు ధరల కారణంగా కొంచెం వెనుకంజ వేసిన కస్టమర్లకు ఇది ఒక మంచి అవకాశం. కంపెనీ ఇప్పటికే తమ మోడళ్ల ధరలను తగ్గిస్తూ కొత్త లిస్టును ప్రకటించింది. ఇప్పుడు చాలా వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 2 లక్షల లోపలికే వచ్చాయి. GST 2.0 కింద తీసుకున్న నిర్ణయం ప్రకారం, 350cc కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్సైకిళ్లపై పన్ను 28% నుండి 18%కి తగ్గించబడింది. ఈ మార్పు వల్ల 293cc, 334cc లిక్విడ్-కూల్డ్ ఆల్ఫా2 ఇంజిన్లతో వస్తున్న జావా, YZD మోడళ్లకు నేరుగా ప్రయోజనం చేకూరింది.
ముఖ్యంగా 334cc ఇంజిన్తో వచ్చే మోడల్ తన క్లాస్లోనే అత్యంత శక్తివంతమైనదిగా నిలుస్తుంది. ఇది 29PS శక్తిని, 30Nm టార్క్ను ఉత్పత్తి చేస్తూ యువతలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. జావా, YZD బ్రాండ్లు ఎప్పటినుంచో తమ ప్రత్యేకమైన డిజైన్, శక్తివంతమైన పనితీరుతో అభిమానులను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ధరల తగ్గింపుతో ఇవి మరింత చేరువకానున్నాయి. YZD అడ్వెంచర్, రోడ్స్టర్, స్క్రాంబ్లర్, జావా 42 బాబర్ వంటి మోడళ్ల ధరలు తగ్గుతాయి.

ధర తగ్గింపు వల్ల, క్లాసిక్ లుక్స్తో పాటు పెర్ఫార్మెన్స్ అందించే బైకులను కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ధరలు తగ్గడంతో, ఒకప్పుడు కలలా అనిపించిన ఈ మోటార్సైకిళ్లు ఇప్పుడు మధ్యతరగతి యువత చేతికి అందే దూరంలోకి వచ్చాయి. పెర్ఫార్మెన్స్ బైక్ కొనే కల కలగానే మిగలకుండా నిజమవుతుందనే నమ్మకాన్ని ఈ మార్పులు కలిగిస్తున్నాయి.
జావా-YZD అభిమానులకు ఇది ధరల తగ్గింపు మాత్రమే కాదు, వారి కలల బైకును సొంతం చేసుకునే ఛాన్స్. జావా మోటార్సైకిళ్ల కొత్త ధరలను చూసినట్లయితే, ఇప్పటివరకు రూ.1,98,950 ధరకు అమ్ముడవుతున్న జావా 350 ఇప్పుడు రూ.15,543 తగ్గింపుతో కేవలం రూ.1,83,407కు లభిస్తోంది. ఇదే తరహాలో జావా 42 బాబర్ ధర తగ్గింపును చూసింది. గతంలో రూ.2,09,500గా ఉన్న ఈ మోడల్ ఇప్పుడు రూ.16,367 తగ్గి కొత్త ధర రూ.1,93,133గా నిర్ణయించబడింది.

| మోడల్ | పాత ధర | కొత్త ధర | తగ్గింపు |
| జావా 42 బాబర్ | రూ.2,09,500 | రూ.1,93,133 | రూ.16,367 |
| జావా 42 | రూ.2,10,142 | రూ.1,93,725 | రూ.16,417 |
| జావా 350 | రూ.1,98,950 | రూ.1,83,407 | రూ.15,543 |
| జావా పెరాక్ | రూ.2,16,707 | రూ.1,99,775 | రూ.16,930 |
అంతేకాకుండా, జావా 42 కూడా ప్రత్యేకంగా ఆదా కలిగిస్తోంది. ముందుగా రూ.2,10,142కు విక్రయించబడిన ఈ బైక్ ఇప్పుడు రూ.16,417 తగ్గింపుతో రూ.1,93,725కు లభిస్తోంది. ఈ జాబితాలో అత్యధిక తగ్గింపు పొందిన మోడల్ జావా పెరాక్. గతంలో రూ.2,16,707 ధరకు అమ్ముడైన ఈ బైక్, రూ.16,930 తగ్గింపుతో ఇప్పుడు కేవలం రూ.1,99,775కే అందుబాటులోకి వచ్చింది. జావా మోడళ్లతో పాటు యెజ్డి మోటార్సైకిళ్ల ధరలు కూడా జీఎస్టీ తగ్గింపుతో గణనీయంగా తగ్గాయి.
గతంలో రూ.2,09,969 ధరకు లభించిన యెజ్డి రోడ్స్టర్ను ఇప్పుడు కేవలం రూ.1,93,565కే కొనుగోలు చేయవచ్చు. అంటే, కస్టమర్లకు రూ.16,404 వరకు నేరుగా లాభం దక్కుతోంది. ఇదే తరహాలో, యెజ్డి అడ్వెంచర్ కూడా ధరలో గణనీయమైన తగ్గింపును చూసింది. ముందుగా రూ.2,14,900 ధర ఉన్న ఈ బైక్ ఇప్పుడు రూ.16,789 తగ్గింపుతో రూ.1,98,111కే లభిస్తోంది. టూర్స్, ట్రావెలింగ్ కోసం ఇష్టపడే బైక్ లవర్స్కు ఇది మంచి అవకాశం అని చెప్పాలి.

| మోడల్ | పాత ధర | కొత్త ధర | తగ్గింపు |
| రోడ్స్టర్ | రూ.2,09,969 | రూ.1,93,565 | రూ.16,404 |
| యెజ్డి అడ్వెంచర్ | రూ.2,14,900 | రూ.1,98,111 | రూ.16,789 |
| స్క్రాంబ్లర్ | రూ.2,11,900 | రూ.1,95,345 | రూ.16,555 |
అలాగే, యెజ్డి స్క్రాంబ్లర్ గతంలో రూ.2,11,900 ధరకు విక్రయించబడిన ఈ బైక్ ఇప్పుడు రూ.16,555 తగ్గింపుతో కేవలం రూ.1,95,345కే అందుబాటులోకి వచ్చింది. ధరల తగ్గింపు అనేది కంపెనీ అమ్మకాలు పెంచుతుందని భావిస్తున్నారు. భారీ ధరల తగ్గింపు ఫలితంగా, యువత ఇప్పుడు వారి కలల బైక్ను మరింత సరసమైన ధరకు పొందవచ్చు. ఈ పండుగ సీజన్లో జావా YZD మోటార్సైకిళ్లు రాయల్ ఎన్ఫీల్డ్కు బలమైన సవాలుగా మారవచ్చు.


Click it and Unblock the Notifications








