ఎలక్ట్రిక్ బైక్పై రూ.20 వేల తగ్గింపు + రూ.10 వేల క్యాష్బ్యాక్ + బంగారు నాణెం.. ఐఫోన్ గెలుచుకునే ఛాన్స్
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా టూవీలర్ విభాగంలో కొత్త మోడళ్లతో పాటు వినూత్నమైన ఆఫర్లను తీసుకొస్తూ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ తయారీదారు ఒబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric) తన కొత్త పథకాన్ని ప్రకటించింది. మెగా ఫెస్టివ్ ఉత్సవ్ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఆఫర్ స్కీమ్, పట్టణ ప్రయాణికులకు హై-ఎండ్ ఎలక్ట్రిక్ బైక్లను మరింత సులభంగా అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద వినియోగదారులు గరిష్టంగా రూ.35,000 వరకు ప్రయోజనాలు పొందే అవకాశం కలదు. ముఖ్యంగా, ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఒబెన్ ఎలక్ట్రిక్ డీలర్షిప్ షోరూమ్లలో అందుబాటులో ఉండటం మరింత ప్రత్యేకం.
ఈ ప్రత్యేక పథకం కింద రోర్ EZ లేదా రోర్ EZ సిగ్మా ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ను కొనుగోలు చేసే వినియోగదారులకు నేరుగా రూ.20,000 ధర తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు, కస్టమర్లు రూ.10,000 వరకు అదనపు క్యాష్బ్యాక్ పొందే అవకాశం ఉంది. అంటే మొత్తం లాభం మరింత పెరుగుతుంది. ఇక ఆఫర్ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కంపెనీ వినూత్నమైన బహుమతులను కూడా ప్రకటించింది.

రోర్ EZ లేదా EZ సిగ్మా బైక్ కొనుగోలు చేసే ప్రతి కస్టమర్కు ఒక బంగారు నాణెం హామీగా ఇవ్వబడుతుంది. అదనంగా, ఒక అదృష్టవంతమైన కస్టమర్కు ప్రత్యేక బహుమతిగా ఐఫోన్ గెలుచుకునే అవకాశం కూడా కలదు. ఒబెన్ ఎలక్ట్రిక్ తీసుకొచ్చిన మెగా ఫెస్టివ్ ఉత్సవ్ ఆఫర్ కేవలం ధర తగ్గింపుతోనే కాదు, బంగారు నాణెం, ఐఫోన్ బహుమతులను అందించడం విశేషం. పండుగ సీజన్లో ఆఫర్ కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో సహాయపడుతుంది.
ఒబెన్ ఎలక్ట్రిక్ ప్రకటించిన మెగా ఫెస్టివ్ ఉత్సవ్ ఆఫర్పై సంస్థ వ్యవస్థాపకురాలు, CEO మధుమిత అగర్వాల్ స్పందిస్తూ, ఈ ఆఫర్ వెనుక ఉన్న లక్ష్యాన్ని స్పష్టంగా వివరించారు. ఆమె మాట్లాడుతూ, ఈ మెగా ఫెస్టివ్ ఆఫర్ మా ఎలక్ట్రిక్ మోటార్సైకిళ్లను ఆస్వాదించడానికి కస్టమర్లకు గొప్ప విలువతో పాటు సౌకర్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా రోర్ EZ మోడళ్లు పట్టణ ప్రయాణాలకు అత్యంత అనువైనవిగా ఉంటాయని అన్నారు.

ఇవి కేవలం శక్తివంతమైన పనితీరును మాత్రమే కాకుండా, విశ్వసనీయతతో పాటు ఆధునిక సాంకేతికతను కూడా అందిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాలను మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను విస్తరించాలనే మా దార్శనికతను ఈ ప్రాజెక్ట్ మరింత బలపరుస్తుందని అని ఆమె వివరించారు. పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకుని తెచ్చిన ఈ పథకం కంపెనీకి కస్టమర్లలో మరింత నమ్మకాన్ని, ఉత్సాహాన్ని పెంచే అవకాశముంది.
ఒబెన్ ఎలక్ట్రిక్ ఇటీవలే విడుదల చేసిన రోర్ EZ సిగ్మా ఎలక్ట్రిక్ బైక్, మెరుగైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంది. ధర పరంగా చూసుకుంటే, రోర్ EZ సిరీస్ ఎలక్ట్రిక్ బైక్లు రూ.99,999 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఈ ధర పాయింట్ వల్లే పట్టణ ప్రయాణికులకు ఇది మరింత అందుబాటులోకి వస్తోంది. బ్యాటరీ పనితీరు పరంగా, ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 175 కి.మీ వరకు ప్రయాణం చేయగలదు.

ఇది పట్టణ, పల్లెటూరి ప్రయాణాలకు సరిపోయే రేంజ్గా భావించవచ్చు. పనితీరు విషయానికి వస్తే, ఈ బైక్ గరిష్టంగా గంటకు 95 కి.మీ వేగం అందిస్తుంది. అలాగే కేవలం 3.3 సెకన్లలో 0-40 కి.మీ వేగాన్ని చేరుకోవడం దీని వేగ సామర్థ్యాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుంది. ఈ మోడల్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 3 రైడింగ్ మోడ్లు (ఎకో, సిటీ, హవోక్) అందిస్తోంది.


Click it and Unblock the Notifications








