యమహా బైకులంటే జనాలకు మోజు తీరిందా ? ఈ రెండు మోడల్స్ కలిపి కేవలం 8 మంది మాత్రమే కొన్నారు
ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ యమహా మోటార్స్ తన R3, MT-03 బైకుల అమ్మకాల్లో భారీ క్షీణతను చూసింది. ఈ రెండు బైక్లను కలిపి గత జూలై నెలలో కేవలం 8 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఒక నెల మొత్తం శ్రమించినా ఎందుకు 8 బైక్లు మాత్రమే అమ్ముడయ్యాయి? అసలు ఈ బైక్లలో ఏం లోపాలున్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
యమహా భారతదేశంలో ఎంట్రీ-లెవల్ ప్రీమియం బైకులను విక్రయిస్తోంది. ఈ విభాగంలో R3 మరియు MT-03 బైకులను మార్కెట్లో ప్రవేశపెట్టింది. గత జూలైలో ఈ రెండు బైకుల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. గత సంవత్సరం ఇదే జూలైలో కేవలం 6 బైక్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది 33.33 శాతం అమ్మకాలు పెరిగినా, సంఖ్యలో చూస్తే కేవలం 2 బైకులు మాత్రమే ఎక్కువ అమ్ముడయ్యాయి.

జూన్ నెలతో పోలిస్తే, జూన్లో 5 బైకులు అమ్ముడయ్యాయి, ఇప్పుడు 60 శాతం పెరిగి 8 బైకులు అమ్ముడయ్యాయి. కానీ సంఖ్యలో చూస్తే ఇది కేవలం 3 బైకులు మాత్రమే. ఇతర బైకులతో పోలిస్తే ఈ బైకుల అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
ఈ బైకుల అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం వాటి అధిక ధర. యమహా తన R3, MT-03 బైకులను ప్రీమియం సెగ్మెంట్లో ఉంచడం వల్ల వాటి ధర ఎక్కువగా ఉంది. దీంతో కొనుగోలుదారుల సంఖ్య తగ్గింది. అంతేకాకుండా, ఇది ఒక ప్రీమియం బైక్ కావడంతో కొన్ని నగరాల్లో, కొన్ని డీలర్షిప్లలో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. సాధారణంగా షోరూమ్కు వచ్చే కస్టమర్లు బైక్ను నేరుగా చూసినప్పుడు దానిని కొనే నిర్ణయం తీసుకుంటారు. ఈ బైకులు అన్ని డీలర్షిప్లలో ప్రదర్శనకు లేకపోవడం కూడా అమ్మకాలు తగ్గడానికి ఒక ప్రధాన కారణం.

యమహా బైకులకు పోటీగా ఇతర కంపెనీలు విడుదల చేసిన బైకులు ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఉదాహరణకు, కేటీఎం RC 390, డ్యూక్ 390, కవాసకి 400 వంటి బైకులు ఈ సెగ్మెంట్లో బాగా అమ్ముడవుతున్నాయి. ఈ పోటీని తట్టుకుని కస్టమర్లను ఆకట్టుకోవడానికి యమహా కంపెనీ ఇంకా కష్టపడుతోంది.
భారతదేశంలో ప్రీమియం బైకులకు మంచి డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, ఈ ప్రత్యేక మోడళ్లు పెద్దగా ఆదరణ పొందడం లేదు. ఈ బైకుల గురించి ప్రజల్లో అవగాహన తక్కువగా ఉంది. యమహా సంస్థ ఈ బైకులు మార్కెట్లో ఉన్నాయని తెలియజేయడానికి, యువతను ఆకట్టుకోవడానికి ఆకర్షణీయమైన మార్కెటింగ్ వ్యూహాలను అనుసరిస్తే, అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది.

డ్రైవ్స్పార్క్ అభిప్రాయం: పండుగల సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ బైకుల అమ్మకాలు పెరుగుతాయని ఆటోమొబైల్ కంపెనీలు ఆశిస్తున్నాయి. కానీ ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పండుగలకు బహుమతిగా జీఎస్టీ రేట్లు తగ్గుతాయని చెప్పడంతో, అమ్మకాలు జీఎస్టీ తగ్గే వరకు నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది.
డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








