కేవలం 8 నెలల్లోనే 2 లక్షల స్కూటర్ల సేల్స్.. మొత్తం 7 లక్షలు.. దీని టెక్నాలజీకి పడిపోతున్న జనాలు

బెంగళూరు కేంద్రంగా పనిచేసే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశీయ టూవీలర్ మార్కెట్లో రికార్డు స్థాయిలో మొత్తం 7 లక్షల రిటైల్ విక్రయాల మైలురాయిని విజయవంతంగా దాటేసింది. ఈ అద్భుతమైన ఘనతతో భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటోల తర్వాత అత్యధికంగా ఈ-స్కూటర్లను విక్రయించిన నాల్గవ అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్‌గా ఏథర్ నిలిచింది. ప్రభుత్వ అధికారిక వాహన్ (Vahan) డేటా ప్రకారం, ఏథర్ కంపెనీ 2018లో తన విక్రయాలను ప్రారంభించినప్పటి నుంచి జూన్ 25, 2026 నాటికి కస్టమర్లకు మొత్తం 7,04,447 ఈ-స్కూటర్లను డెలివరీ చేసింది.

గత ఎనిమిది నెలల్లో ఊహించని గ్రోత్
కంపెనీ వ్యాపార వృద్ధిని గమనిస్తే.. ఇటీవలి కాలంలో ఏథర్ అనూహ్యమైన వేగంతో దూసుకుపోతోంది. ఈ బ్రాండ్ తన చివరి 2 లక్షల యూనిట్ల విక్రయాలను కేవలం 8 నెలల స్వల్ప వ్యవధిలోనే సాధించడం విశేషం. అయితే ఏథర్ ప్రయాణం మొదటి నుంచి ఒకేలా లేదు. 2018 నుంచి 2021 మధ్య కాలంలో కోవిడ్ మహమ్మారి కారణంగా అమ్మకాలు చాలా నెమ్మదిగా సాగాయి.

Ather Energy Crosses 7 Lakh EV Sales in India Rizta Drives Record Growth

కానీ 2022లో మొదటిసారిగా ఏథర్ ఏడాదికి 50,000 మార్కును (54,769 యూనిట్లు) దాటింది. ఆ తర్వాత 2023లో ఆ సంఖ్యను రెట్టింపు చేస్తూ 1,11,812 యూనిట్లను విక్రయించింది. ఇక 2024లో 1,36,513 యూనిట్లు, 2025లో ఏకంగా 57% వృద్ధితో 2,14,985 యూనిట్లను విక్రయించి దేశీయ ఈవీ మార్కెట్లో 16% వాటాను కైవసం చేసుకుంది.

2026 లోనూ కొనసాగుతున్న విక్రయాల జోరు
గత ఏడాది సాధించిన రికార్డుల వేగాన్ని ఏథర్ ఎనర్జీ 2026లోనూ విజయవంతంగా కొనసాగిస్తోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 25 మధ్య కాలంలోనే ఏథర్ ఏకంగా 1,63,788 స్కూటర్లను డెలివరీ చేసింది. ఇది కేవలం ఆరు నెలల లోపే గత ఏడాది (2025) మొత్తం అమ్మకాలలో 76 శాతానికి సమానం కావడం గమనార్హం.

Ather Energy Crosses 7 Lakh EV Sales in India Rizta Drives Record Growth

ప్రస్తుత 2026 సంవత్సరంలో భారతదేశంలో అమ్ముడైన మొత్తం 9,34,141 ఎలక్ట్రిక్ టూవీలర్లలో ఏథర్ కంపెనీ వాటా 17.53 శాతానికి పెరిగింది. ముఖ్యంగా మార్చి 2026 నెల కంపెనీ చరిత్రలోనే బెస్ట్ మంత్ గా నిలిచింది. ఆ ఒక్క నెలలోనే ఏథర్ 36,362 స్కూటర్లను విక్రయించింది. ఇదే వేగం కొనసాగితే ఈ క్యాలెండర్ ఇయర్ లో కంపెనీ 3,25,000 యూనిట్ల సేల్స్ టార్గెట్ ను ఈజీగా రీచ్ కానుంది.

గేమ్ ఛేంజర్ గా మారిన ఏథర్ రిజ్తా
ఏథర్ ఎనర్జీ ఇటీవల సాధిస్తున్న భారీ విజయాల వెనుక ఆ కంపెనీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఫ్యామిలీ ఈ-స్కూటర్ ఏథర్ రిజ్తా (Ather Rizta) ప్రధాన పాత్ర పోషించింది. ఏప్రిల్ 2024 లో లాంచ్ అయిన ఈ మోడల్, ప్రస్తుతం ఏథర్ మొత్తం నెలవారీ అమ్మకాలలో దాదాపు 75 శాతం వాటాను కలిగి ఉంది.

Ather Energy Crosses 7 Lakh EV Sales in India Rizta Drives Record Growth

ఈ స్కూటర్ మార్కెట్లోకి వచ్చిన కేవలం 25 నెలల్లోనే దీని మొత్తం అమ్మకాలు 3 లక్షల యూనిట్ల మార్కును దాటేయడం విశేషం. మార్కెట్లో ఇతర బ్రాండ్లతో పోలిస్తే ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ, దీని కంఫర్ట్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ డిజైన్ కారణంగా కస్టమర్లు రిజ్తా కొనుగోలుకు క్యూ కడుతున్నారు.

భవిష్యత్తుపై భారీ ప్రణాళికలు
రాబోయే రోజుల్లో తన మార్కెట్ ను మరింత విస్తరించుకోవడానికి ఏథర్ ఎనర్జీ రెండు పెద్ద వ్యూహాత్మక ప్లాన్లతో ముందుకు వెళ్తోంది. ఇందులో మొదటిది, కంపెనీ కొత్తగా డిజైన్ చేసిన 'EL ప్లాట్‌ఫారమ్' (EL Platform). దీని ఆధారంగా రాబోయే రోజుల్లో సరికొత్త రేంజ్ కలిగిన విభిన్న ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తేనున్నారు.

రెండవది, కంపెనీ మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోతున్న తన మూడవ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఈ ఫ్యాక్టరీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 10 లక్షల యూనిట్లుగా ఉండబోతోంది. మార్చి 2027 నాటికి ఈ ప్లాంట్ మొదటి దశ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి, దీని ద్వారా నెలకు 42,000 స్కూటర్లను ఉత్పత్తి చేయవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది.

Article Published On: Saturday, June 27, 2026, 7:32 [IST]
English summary
Ather energy crosses 7 lakh ev sales in india rizta drives record growth
Read more on: #ather energy #ather 450x
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+