స్మార్ట్‌ఫోన్ ధరకే మంచి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 159 కి.మీలు.. 3 లక్షల ఇళ్లకు చేరింది

భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఒకప్పుడు స్పోర్టీ డిజైన్, యువతకు నచ్చే పెర్ఫార్మెన్స్ మోడళ్లతో గుర్తింపు తెచ్చుకున్న ఏథర్ ఎనర్జీ (Ather Energy), ఇప్పుడు కుటుంబాల కోసం రూపొందించిన 'రిజ్టా (Rizta)' స్కూటర్‌తో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. రోజువారీ ప్రయాణాలకు అనువైన, తక్కువ నిర్వహణ ఖర్చులతో కూడిన, సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలను ఏథర్ రిజ్టా భారీగా ఆకర్షించింది. ఇప్పుడు ఈ స్కూటర్ మరో అరుదైన మైలురాయిని దాటింది. కంపెనీ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం, ఏథర్ ఇప్పటివరకు 3 లక్షల రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ గణాంకం కేవలం అమ్మకాల సంఖ్య మాత్రమే కాదు.. భారత మార్కెట్లో రిజ్టా సాధించిన విశ్వాసానికి నిదర్శనం కూడా.

ఎందుకంటే, ఇప్పటి వరకు ఏథర్ బ్రాండ్‌ను ఎక్కువగా యువతకు సంబంధించిన ప్రీమియం ఈవీ కంపెనీగా చూసేవారు. కానీ రిజ్టా రాకతో ఆ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. పెద్ద సీటు, కుటుంబాలకు సరిపోయే కంఫర్ట్, ఎక్కువ స్టోరేజ్ స్పేస్, సులభమైన రైడింగ్ అనుభూతి వంటి అంశాలు ఈ స్కూటర్‌ను సామాన్య కుటుంబాలకు మరింత దగ్గర చేశాయి. రిజ్టా విజయంతో ఏథర్ ఎనర్జీ వృద్ధి కూడా వేగంగా పెరుగుతోంది.

Ather Rizta Sales Boom Crosses 3 Lakh Units In Just Two Years Details

ముఖ్యంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో ప్రస్తుతం భారీ పోటీ నెలకొన్న సమయంలో, ఈ స్కూటర్ కంపెనీకి ప్రధాన బలంగా మారింది. టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో వంటి దిగ్గజ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్లో బలంగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఏథర్ రిజ్టా మాత్రం అమ్మకాల పరంగా వారికి గట్టి సవాల్ విసురుతోంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా రిజ్టా ఎదుగుతుంది.

2024 ఏప్రిల్ 6న ఏథర్ 'రిజ్టా' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ స్కూటర్, అతి తక్కువ సమయంలోనే వినియోగదారుల మనసులు గెలుచుకుంది.ప్రారంభించిన రెండేళ్లలోనే రిజ్టా 3 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకోవడం ఏథర్‌కు ఒక పెద్ద విజయంగా మారింది. ఈ విజయానికి కారణం కేవలం బ్రాండ్ ఇమేజ్ మాత్రమే కాదు.. రిజ్టా అందించిన ప్రాక్టికాలిటీ కూడా.

Ather Rizta Sales Boom Crosses 3 Lakh Units In Just Two Years Details

రిజ్టా మార్కెట్లోకి వచ్చిన తర్వాత అమ్మకాల వేగం ఎలా పెరిగిందంటే, మొదటి 1 లక్ష స్కూటర్లు కేవలం తొలి 10 నెలల్లోనే అమ్ముడవడం అప్పటికే దీనికి ఎంత డిమాండ్ ఉందో చూపించింది. ఆ తర్వాత కూడా అమ్మకాల వేగం తగ్గలేదు. 2025 అక్టోబర్ నాటికి ఏథర్ 2 లక్షల రిజ్టా స్కూటర్ల అమ్మకాల మైలురాయిని దాటింది. ఆ తర్వాతి 1 లక్ష స్కూటర్లు కేవలం మరో 6 నెలల్లోనే అమ్ముడయ్యాయి.

ప్రస్తుతం భారత మార్కెట్లో రిజ్టా ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 1.10 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, టాప్ వేరియంట్ ధర రూ. 1.28 లక్షల వరకు వెళ్తోంది. ఈ ధరలకే ఏథర్ వినియోగదారులకు బ్యాటరీపై 8 సంవత్సరాల వారంటీ అందించడం పెద్ద హైలైట్‌గా మారింది. BaaS విధానం వల్ల ఏథర్ రిజ్టాను కేవలం రూ. 76,000 ప్రారంభ ధరతోనే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. ఇది కొన్ని స్మార్ట్ ఫోన్లతో సమాన ధర.

Ather Rizta Sales Boom Crosses 3 Lakh Units In Just Two Years Details

ఎందుకంటే ఇంత తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్ దొరకడం ప్రస్తుతం అరుదుగా మారింది. ధర మాత్రమే కాదు, రేంజ్ పరంగా కూడా ఆకట్టుకుంటోంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 159 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంటోంది. అంటే రోజూ ఆఫీస్, స్కూల్, షాపింగ్, నగర ప్రయాణాల కోసం ఉపయోగించే వారికి రెండు మూడు రోజుల పాటు మళ్లీ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు.

Article Published On: Saturday, May 9, 2026, 12:59 [IST]
English summary
Ather rizta sales boom crosses 3 lakh units in just two years details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+