ఈ స్కూటర్ కొంటే పదేళ్ల పాటు ఢోకా లేదు! లీటర్కు 55 కి.మీ మైలేజ్! ఇది నచ్చని వారు ఎవరూ ఉండరు
భారత టూవీలర్ మార్కెట్లో గత కొన్ని నెలలుగా ఒక స్పష్టమైన ట్రెండ్ కనిపిస్తోంది, స్కూటర్లకు మళ్లీ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు బైక్లే ప్రధానంగా అమ్ముడయ్యే ఈ మార్కెట్లో, ఇప్పుడు నగర జీవనశైలి మార్పులు, ట్రాఫిక్ పరిస్థితులు, అలాగే సౌకర్యవంతమైన రైడింగ్ అవసరం వంటి కారణాలతో స్కూటర్లు మళ్లీ వినియోగదారుల మొదటి ఎంపికగా మారుతున్నాయి. ముఖ్యంగా యువత, మహిళలు, అలాగే రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు స్కూటర్ల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ సెగ్మెంట్లో ఎప్పటిలాగే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది హోండా యాక్టివా (Honda Activa). సంవత్సరాలుగా నమ్మకానికి ప్రతీకగా నిలిచిన యాక్టివా, తన సరళమైన డిజైన్, మెరుగైన మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులతో భారత వినియోగదారుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
కొత్తగా మార్కెట్లోకి వచ్చే మోడళ్ల పోటీ ఉన్నప్పటికీ, యాక్టివా మాత్రం తన స్థిరమైన పనితీరుతో ఎప్పుడూ టాప్లోనే నిలుస్తోంది. మరో విషయం ఏమిటంటే, మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాల పరంగా యాక్టివా భారీ స్థాయిలో ముందంజలో ఉంది. సాధారణంగా బైక్లే ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తుంటే, స్కూటర్గా యాక్టివా మాత్రం ఆ ట్రెండ్ను చెరిపేసింది. ప్రస్తుతం మొత్తం టూవీలర్ అమ్మకాలలో హీరో స్ప్లెండర్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది.

తాజా అమ్మకాల గణాంకాలు మార్కెట్లో జరుగుతున్న మార్పులను స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా మరోసారి తన బలమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. 2026 మార్చిలో మాత్రమే యాక్టివా మొత్తం 2,59,670 యూనిట్ల అమ్మకాలు నమోదు చేయడం చిన్న విషయం కాదు. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 1,89,735 యూనిట్లుగా ఉండగా, ఈసారి దాదాపు 69,935 యూనిట్ల పెరుగుదల నమోదు కావడం గమనార్హం.
అంటే సంవత్సర ప్రాతిపదికన చూస్తే సుమారు 36.86 శాతం వృద్ధి సాధించడం, యాక్టివా మార్కెట్లో ఎంత బలంగా నిలిచిందో చెబుతోంది. ఇది కేవలం ఒక మంచి నెల ఫలితం మాత్రమే కాదు, వినియోగదారుల అభిరుచులు స్కూటర్ల వైపు మళ్లుతున్నాయని సూచించే సంకేతం కూడా. రోజువారీ ప్రయాణాలకు సౌకర్యవంతమైన రైడింగ్, తక్కువ నిర్వహణ ఖర్చులు, అలాగే ఫ్యామిలీ యూజ్కు అనుకూలత వంటి అంశాలు యాక్టివా వంటి మోడళ్లకు మరింత డిమాండ్ తీసుకువస్తున్నాయి.

అయితే, మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలలో మొదటి స్థానాన్ని మాత్రం ఎప్పటిలాగే స్ప్లెండర్ తనదిగా ఉంచుకుంది. మార్చి 2026లో స్ప్లెండర్ 3,32,227 యూనిట్ల అమ్మకాలతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనంగా నిలిచింది. దీని తర్వాత రెండో స్థానంలో 2,59,670 యూనిట్లతో యాక్టివా నిలవడం, స్కూటర్ అయినప్పటికీ బైక్లకు గట్టి పోటీ ఇస్తోందని స్పష్టంగా తెలియజేస్తోంది. మొత్తంగా చూస్తే, ఒకవైపు స్ప్లెండర్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా, మరోవైపు యాక్టివా వేగంగా దూసుకుపోతుంది.
ప్రస్తుతం భారత మార్కెట్లో హోండా యాక్టివా 110,125 మోడళ్లలో అందుబాటులో ఉంది. ముందుగా యాక్టివా 110 గురించి మాట్లాడితే, సాదాసీదా డిజైన్, సులభమైన రైడింగ్ అనుభవం, తక్కువ మెయింటెనెన్స్తో ఆకట్టుకుంటుంది . రూ. 75,433 నుంచి రూ. 89,806 (ఎక్స్-షోరూమ్) మధ్య ధర ఉంటుంది. 109.51 సిసి పెట్రోల్ ఇంజిన్తో సుమారు 50 కి.మీ వరకు మైలేజీ ఇవ్వగలగడం వల్ల ఖర్చు పరంగా కూడా చాలా ఆర్థికంగా ఉంటుంది.

ఇక యాక్టివా 125 విషయానికి వస్తే, రూ. 88,339 నుంచి రూ. 94,096 (ఎక్స్-షోరూమ్) మధ్య ధరలో లభిస్తూ, 123.92 సిసి ఇంజిన్తో వస్తుంది. ఈ ఇంజిన్ నగర ప్రయాణాల్లో స్మూత్గా పని చేయడమే కాకుండా, సుమారు 47 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, యాక్టివా 125లో TFT కన్సోల్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.


Click it and Unblock the Notifications








