క్రూయిజ్ ఇండియా టూర్ బైక్ షో షురూ..!
బైకింగ్ గ్రూప్స్కు ఓ గుడ్ న్యూస్. 'క్రూయిజ్ ఇండియా టూర్ బైక్ షో' తమ మొట్టమొదటి ఎడిషన్ను ముంబైలో ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాన్ని బ్రాండ్ కన్సల్టింగ్ సంస్థ అజూర్ మార్కామ్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 17, 2014వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 23, 2014వ తేదీ వరకు జరుగుతుంది.
ముంబైలోని లోవర్ పరేల్ వద్ద ఉన్న హై స్ట్రీట్ ఫోనిక్స్ మాల్ వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది. బైకింగ్ గ్రూప్స్ అన్ని ఒకే ప్రాంతం వద్ద సమావేశమయ్యేందుకు మరియు తమ నెట్వర్క్ పరిచయాలను మరింత పెంపొందించుకునేందుకు ఏడు రోజుల పాటు జరిగే ఈ క్రూయిజ్ ఇండియా టూర్ బైక్ షో చక్కని వేదికగా నిలుస్తుంది.

ఈ క్రూయిజ్ ఇండియా టూర్ బైక్ షో కార్యక్రమంలో వింటేజ్ బైక్ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో సూపర్బైక్స్, లగ్జరీ క్రూజర్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే, కస్టమ్ బైక్స్కు సంబంధించి ఓ ప్రత్యేక విభాగం కూడా ఉంటుంది. అంతేకాకుండా.. రాక్ షోస్, టాటూ వర్క్షాప్స్, స్టంట్ షో, ఎమ్ఎమ్ఏ ఫైట్స్ వంటి పలు కార్యక్రమాలు కూడా ఉంటాయి.
బైకర్ల ద్వారా తీసిన ఫొటోగ్రాఫ్లతో ఓ ప్రదర్శన కూడా నిర్వహించడం జరుగుతుంది. లీడింగ్ ఉమెన్స్ బైక్ రైడ్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో రేడియో సిటీ ఆర్జే అర్చన కూడా పాల్గొంటుంది. మహిళా సాధికారతను ప్రచారం చేసేందుకు ఈ రైడ్ను నిర్వహిస్తారు. వేలాది మంది బైకర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు ఆశిస్తున్నారు.

తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ క్రూయిజ్ ఇండియా టూర్ బైక్ షోకు సుమారు 6 లక్షల మంది వీక్షకలు రావచ్చని అంచనా. కాగా.. ఇందులో క్రూయిజ్ ఇండియా టూర్ ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమవుతుంది. ఇందులో మోటార్సైక్లిస్టులు తమ ద్విచక్ర వాహనాలపై దేశవ్యాప్తంగా 8,000 కిలోమీటర్ల దూరాన్ని చుట్టిరానున్నారు.


Click it and Unblock the Notifications








