ఆటో ఎక్స్పో 2014లో హ్యోసంగ్ జివి250 విడుదల
ఎట్టకేలకు భారత్లో హ్యోసంగ్ జివి250 మోటార్సైకిల్ విడుదలకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హ్యోసంగ్, భారత మార్కెట్లో ఓ కొత్త 250సీసీ క్రూజర్ స్టైల్ బైక్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. గతంలో కంపెనీ విడుదల చేసిన జివి650 బైక్కు దిగువన అదే సిరీస్లో తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన ఓ లీజర్ బైక్ను వచ్చే నెలలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో కంపెనీ విడుదల చేయనునుంది.
వాస్తవానికి ఈ బైక్ చాలా రోజుల క్రితమే భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉన్నప్పటికీ, కానీ కొన్ని అంతర్గత కారణాల వలన దీని విడుదల జాప్యం జరుగుతూ వస్తోంది. హ్యోసంగ్ తొలుత భారత్లో పూనేకు చెందిన గార్వారే మోటార్స్తో ఒప్పందం కుదుర్చుకొని కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి తెలిసినదే. అయితే, ఆ తర్వాత ఇరు సంస్థల మధ్య తలెత్తిన సమస్యల కారణంగా ఈ వెంచర్ను పూనేకు చెందిన మరొక సంస్థ డిఎస్కే మోటోవీల్స్ను హ్యోసంగ్ ఆశ్రయించింది.

డిఎస్కే మోటోవీల్స్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న తర్వాత హ్యోసంగ్కు దేశీయ మార్కెట్లో బాగా కలిసొచ్చింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్న ఈ హ్యోసంగ్ జివి250 మోటార్సైకిల్ 800సీసీ ఇంజన్ సామర్థ్యం కన్నా తక్కువ ఉండి, అధనపు ఎక్సైజ్ సుంకాల పరిధిలోకి రాదు కాబట్టి, భారత మార్కెట్లో ఇది సరసమైన ధరకే లభించే అవకాశం ఉంది.
హ్యోసంగ్ జివి250లో ఉపయోగించిన 250సీసీ, ఆయిల్-కూల్డ్, వి-ట్విన్ ఇంజన్ గరిష్టంగా 28 హార్స్ పవర్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్తో జచేయబడి ఉంటుంది. హ్యోసంగ్ తమ జివి250 బైక్ను స్థానికంగానే అసెంబ్లిగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఫలితంగా ఇది రూ.2.5 లక్షల ధరకే అందుబాటులోకి రావచ్చని అంచనా. హ్యోసంగ్ జివి250కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు డ్రైవ్స్పార్క్ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








