బైక్స్ ధరలను పెంచిన కెటిఎమ్; ధరల పెంపు వివరాలు
ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ ఉత్పత్తుల ధరలను పెంచింది. గడచిన డిసెంబర్ వరకూ పొడగించిన ఎక్సైజ్ రాయితీలను ప్రభుత్వం ఉపసంహరించడంతో, దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచేస్తున్నాయి. ఈ దిశలోనే కెటిఎమ్ ఇండియా కూడా తమ మోటార్సైకిళ్ల ధరలను పెంచనుంది.

ఈ ఏడాది భారత్లో ప్రీమియం మోటార్సైకిళ్ల ధరలను పెంచిన అతికొద్ది కంపెనీలలో కెటిఎమ్ కూడా ఒకటి. కెటిఎమ్ ఇండియా, దేశీయ విపణిలో మొత్తం నాలుగు మోడళ్లను (డ్యూక్ 200, డ్యూక్ 390, ఆర్సి 200, ఆర్సి 390) విక్రయిస్తోంది. తాజా పెంపుతో ఈ మోటార్సైకిళ్ల ధరలు మోడల్ను బట్టి రూ.1,500 నుంచి రూ.13,000 వరకూ పెరిగాయి.
ధరల పెంపు తర్వాత ఈ కెటిఎమ్ బైక్స్ కొత్త ధరలను క్రింది ఫొటో ఫీచర్లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్లలో కెటిఎమ్ మోటార్సైకిళ్ల ప్రస్తుత ధరలను (జనవరి 2015 నాటికి) తెలుసుకోండి.

కెటిమ్ డ్యూక్200
* రూ.1.41 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)
* రూ.1.58 లక్షలు (ఆన్-రోడ్, ముంబై)

కెటిమ్ డ్యూక్390
* రూ.1.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)
* రూ.2.17 లక్షలు (ఆన్-రోడ్, ముంబై)

కెటిమ్ ఆర్సి200
* రూ.1.70 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)
* రూ.1.82 లక్షలు (ఆన్-రోడ్, ముంబై)

కెటిమ్ ఆర్సి390
* రూ.2.19 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)
* రూ.2.43 లక్షలు (ఆన్-రోడ్, ముంబై)


Click it and Unblock the Notifications








