ఇండియా బైక్ వీక్ 2015: యువరాజ్ సింగ్ కస్టమైజ్డ్ బైక్
గోవాలో జరిగిన మూడవ ఎడిషన్ ఇండియా బైక్ వీక్లో భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తమ కస్టమైజ్డ్ కెటిఎమ్ డ్యూక్ 390 మోటార్సైకిల్ను ప్రదర్శనకు ఉంచారు. కెటిఎమ్ డ్యూక్ 390 బైక్ను ఆధారంగా చేసుకొని ఈ బైక్ను కస్టమైజ్ చేశారు.
ముకుల్ నందన్కు చెందిన ఆటోలాగ్ కంపెనీ ఈ బైక్ను కస్టమైజ్ చేసింది. కెటిఎమ్ డ్యూక్ల కోసం యువీకెన్ కెటిఎమ్ ఎక్స్12తో పాటుగా ఎక్స్26 బాడీ కిట్లను కూడా ఈ కంపెనీ ఇండియా బైక్ వీక్ 2016లో ప్రదర్శనకు ఉంచింది.
ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ కెఫే రేసర్ కిట్, హీరో ఇంపల్స్ ఆఫ్-రోడ్ కిట్, రెక్ అనే కస్టమ్ బైక్ మరియు కస్టమైజ్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ కెఫే రేస్ మోటార్సైకిళ్లను కూడా ఈ కంపెనీ ప్రదర్శనకు ఉంచింది.

తర్వాతి స్లైడ్లలో యువరాజ్ సింగ్ కస్టమైజ్డ్ కెటిఎమ్ బైక్కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోండి.

యువరాజ్ సింగ్ కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన ఈ బ్లూ కలర్ మోడిఫైడ్ కెటిఎమ్ డ్యూక్ 390 బైక్కి 'యువీకెన్ ఎక్స్12' (YOUWECAN X12) అనే పేరు పెట్టారు.

యువీకెన్ ఎక్స్12 బైక్ను ప్రముఖ ఆటోమొబైల్స్ కస్టమైజేషన్, రీస్టోరేషన్ స్పెషలిస్ట్ ఆటోలాగ్ డిజైన్ సంస్థ కస్టమైజ్ చేసింది.

కెటిఎమ్ మోటార్సైకిల్ను ఆధారంగా చేసుకొని యువరాజ్ సింగ్ కోసం ఈ బైక్ను స్పెషల్గా కస్టమైజ్ చేశారు. ఈ కస్టమైజ్డ్ బైక్లో కాస్మోటిక్ మార్పులు తప్ప పెర్ఫార్మెన్స్ అప్గ్రేడ్స్ లేవని సమాచారం.

మూడవ ఎడిషన్ ఇండియా బైక్ వీక్ ఫెస్టివల్ను గోవాలోని వగతోర్ ప్రాంతం వద్ద ఫిబ్రవరి 20, 2015 మరియు ఫిబ్రవరి 21, 2015 తేదీలలో నిర్వహించారు.

భారత్లోని సెవంటీ ఈవెంట్ మీడియా గ్రూప్, ఫాక్స్ లైఫ్ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇందులో దేశ విదేశాలకు చెందిన బైకర్లు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications








