ఢిల్లీ ఆటో ఎక్స్పోలో మారుతి సుజుకి ఎర్టిగా విడుదల
ఏడుగురు ప్రయాణికులు హాయిగా కూర్చుని ప్రయాణించగలిగే మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్పివి పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యం కానుంది. పెట్రోల్ వేరియంట్ ఎర్టిగా లీటరు పెట్రోల్కు 16.02 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్ ఎర్టిగా లీటరు డీజిల్కు 20.77 కి.మీ. మైలేజీనిస్తుంది. మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్పివి 4265 మి.మీ. పొడవును, 1695 మి.మీ. వెడల్పును, 1685 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది.
భారతీయ రోడ్లకు అనువుగా ఉండేలా దీని వీల్బేస్ 2740 మి.మీ ఉంటుంది. ఇది 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్తో లభ్యమవుతుంది. 3-స్పోక్ టిల్ట్ అడ్జస్టబిల్ ఎలక్ట్రిక్ స్టీరింగ్, ట్విన్ ఏసి, ఆడియో సిస్టమ్ (యూఎస్బి కాంపాటిబల్, 4+2 స్పీకర్స్), స్టీరింగ్పై ఉండే (స్టీరింగ్ మౌంటెడ్) ఆడియో కంట్రోల్స్, సెంట్రల్ డోర్ లాకింగ్ అండ్ కీలెస్ ఎంట్రీ, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, పవర్ విండోస్, ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్ వంటి అత్యాధునిక ఫీచర్లు మారుతి ఎర్టిగా సొంతం.
మరిన్ని ఫోటోలు, సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








