అమితాబ్ చేతుల మీదుగా... ఫోర్స్ వన్ ఎస్యూవీ విడుదల

2148 సీసీ ఇన్లైన్-ఫోర్ డీజిల్ ఇంజన్ కలిగిన ఫోర్స్ వన్ ఎస్యూవీ 138 బిహెచ్పిల గరిష్ట శక్తిని మరియు 32 కెజిఎమ్ల గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఉపయోగించిన 2.2 ఎఫ్ఎమ్టెక్ ఇంజన్ మెర్సిడెస్ బెంజ్ నుంచి పొందినది. ఇది ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ సిస్టమ్తో లభిస్తుంది. ఏడుగురు ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించే వీలున్న ఈ ఎస్యూవీలో అధిక స్థలం ఉండి దూర ప్రయాణాల్లో కూడా ఎంతో సౌకర్యాన్ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ ఎస్యూవీలో అమర్చబడిన ఎల్ఈడి హెడ్లైట్లు మరో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. ప్రస్తుతం ఇది టూ-వీల్ (4x2) డ్రైవ్ ఆప్షన్లో మాత్రమే లభిస్తోంది. వచ్చే ఏడాదిలో ఇందులో ఫోర్-వీల్ (4x4) డ్రైవ్ ఆప్షన్ కలిగిన వేరియంట్ను కూడా ఫోర్స్ మోటార్స్ విడుదల చేయనుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఫోర్స్ వన్ ఎస్యూవీ లీటరుకు 11.6 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.
భారత మార్కెట్లో ఫోర్స్ వన్ ఎస్యూవీ ధరలను రూ. 10.65 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ), రూ. 11.1 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై)గా ఫోర్స్ మోటార్స్ నిర్ణయించింది. ఫోర్స్ వన్ ఎస్యూవీలో ఉండే మరిన్ని అదనపు ఫీచర్ల గురించి తెలుసుకోవడానికి నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








