బాండ్లపై సంతకం చేయమన్నందుకు సమ్మెకు దిగిన కార్మికులు

ప్లాంటులో కొందరు కార్మికులు కావాలనే ఉత్పత్తుల నాణ్యతను దెబ్బతీస్తూ కంపెనీ ఆస్తులకు, పేరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారంటూ గుడ్ కండక్ట్ బాండ్ను కంపెనీ తెర మీదకు తీసుకువచ్చింది. అంతేకాకుండా.. ఇందుకు పాల్పడిన 10 మంది కార్మికులపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుని వారిని కంపెనీ సస్పెండ్ చేసింది. మరో ఐదుగురిని డిస్మిస్ చేసింది. ఆరుగురు తాత్కాలిక కార్మికులను సర్వీసుల నుంచి తొలగించింది.
కాగా.. సస్పెండ్ మరియు డిస్మిస్ అయి వారందరూ మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్ (ఎమ్ఎస్ఈయూ)కు చెందిన వారు కావడం గమనార్హం. దీంతో కార్మికులంతా ఏకమై ఉత్పత్తిని నిలిపివేశారు. ఫలితంగా సుమారు 1,200 యూనిట్ల ఉత్పత్తి నిలిచిపోయిందని, దీని వల్ల దాదాపు రూ.60 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. గడచిన జూన్లో కూడా కొత్త యూనియన్ విషయంలో ఈ ప్లాంటు కార్మికులు ఏకంగా 13 రోజులు నిరవధిక సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే.
మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








