అగ్రస్థానాన్ని దక్కించుకుంటాం: బెంజ్; అగ్రస్థానాన్ని వదలం: బిఎమ్డబ్ల్యూ

అయితే, మిత్రా తెలిపిన దాని ప్రకారం ప్రస్తుతం, మెర్సిడెస్ బెంజ్ 'లాభదాయక వృద్ధి'ని మాత్రమే లక్ష్యంగా చేసుకుందని, బిఎమ్డబ్ల్యూ విషయానికి వచ్చేసరికి తన ఎంట్రీ లెవల్ ఎస్యూవీ ఎక్స్1 కారణంగా మాత్రమే అమ్మకాల సంఖ్య పెరిగిందని, ఇతర లగ్జరీ కార్ల సెగ్మెంట్ల వల్ల కాదని అన్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకూ మెర్సిడెస్ బెంజ్ 3,991 యూనిట్లను విక్రయించిందని మిత్రా చెప్పారు. అయితే, ఇదే సమయంలో బిఎమ్డబ్ల్యూ 5,364 యూనిట్లను విక్రయించదని, వాటిలో 1,620 యూనిట్లు బిఎమ్డబ్ల్యూ కాంపాక్ట్ ఎస్యూవీ అయిన ఎక్స్1 మోడళ్లే ఉన్నాయని ఆయన అన్నారు.
అయితే, బిఎమ్డబ్ల్యూ మాత్రం తామేమీ ఉత్పత్తుల ఆధారంగా భారత్లో విజయం సాధించలేదని, తమ బ్రాండ్ పొజిషనింగ్ ద్వారానే ఈ స్థానాన్ని దక్కించుకున్నామని అంటోంది. "అన్ని తరాల ప్రజలను ఆకట్టుకునే బిఎమ్డబ్ల్యూ కార్లు రూపొందిచబడ్డాయి. మామలు, తండ్రులు, తల్లులు మరియు యువకులకు కార్లను విక్రయించడంలో మాకు ఎలాంటి సమస్యలేదు, బహుశా అదే మా విజయానికి కారణమేమోన"ని బిఎమ్డబ్ల్యూ అధ్యక్షుడు ఆండ్రియాస్ స్కాఫ్ అన్నారు.


Click it and Unblock the Notifications








