డ్రైవింగ్లో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తే రూ.5,000 జరిమానా!
ఈ బిల్లును ఆమోదిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ తాజా బిల్లు ప్రకారం జరిమానాలు భారీగా అంటే, ఐదు రెట్ల మేర పెరగనున్నాయి. ప్రమాద బాధితులకు చెల్లిస్తున్న పరిహారం పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కూడా భారీ జరిమానాలు విధించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మార్చి 12 నుండి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఓ సవరణ (అమెండ్మెంట్) ద్వారా మోటార్ వాహన చట్టంలో మార్పులు చేయనున్నారు. ప్రతిపాదిత సవరణల ప్రకారం, డ్రైవ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు లేదా ఐప్యాడ్లను ఉపయోగించినట్లయితే, మొదటి తప్పుకు జరిమానాగా రూ.500 లను వసూలు చేస్తారు. అదే తప్పును మళ్లీ (రెండవసారి) చేసినట్లయితే రూ.2,000 నుండి రూ.5,000 ల జరిమానాను విధించనున్నారు.
డ్రైవింగ్ చేస్తున్న కేవలం ఫోన్ చేయటమే కాదండోయ్.. మెసేజ్లు పంపించటం, మొబైల్ ఫోన్ల కోసం హ్యాండ్స్ ఫ్రీ పరికరాలు (బ్లూటూత్) ఉపయోగించటం వంటివి కూడా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన క్రిందకు రానున్నాయి.


Click it and Unblock the Notifications









