Just In
- 11 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 13 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 14 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 16 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- Movies Brahmamudi April 25th episode: కావ్య విషయంలో రుద్రాణికి షాకిచ్చిన కనకం.. రెచ్చగొడుతున్న రాహుల్
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఏరోప్లేయిన్ రెస్టారెంట్.. ఒక్క సారైన చూతము రారండి
భారతదేశం అభివృద్ధి చెందుతున్న సమయంలో రోజురోజుకి కొత్త కొత్త పరిణామాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అవి వాహనాల విషయంలో కావచ్చు, జీవన శైలిలో కావచ్చు. మనిషి తనకు నచ్చిన ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే రెస్టారెంట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. మనం ఇప్పటి వరకు సముద్రం ఒడ్డున ఉన్న రెస్టారెంట్, కొండలలో ఉన్న రెస్టారెంట్స్ వంటి వాటిని గురించి తెలుసుకుని ఉంటాము. అయితే ఇప్పుడు ఒక విమానం రెస్టారెంట్ గా మారింది. వినడానికి కొంత కొత్తగా ఉన్నప్పటికీ ఇది నిజమే.. ఈ ఏరోప్లేయిన్ రెస్టారెంట్ గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.
సాధారణంగా చాలామంది ప్రజలు జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని కళలు కంటూ ఉంటారు. కొంతమంది కళలు నిజమవుతాయి, మరికొంతమంది కళలు, కలలుగానే మిగిలిపోతాయి. అయితే ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలోని వడోదర ప్రాతంలో ఒక విమానాన్ని రెస్టారెంట్ గా మార్చారు. ఇది నిజంగా చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది.
గుజరాత్లో విమానం తరహా రెస్టారెంట్ను ప్రారంభించడం ఇదే తొలిసారి. ఈ రకమైన ఎయిర్ప్లేన్ రెస్టారెంట్ అక్టోబర్ 25న ప్రారంభించబడింది. వడోదరలోని దర్సాలి బైపాస్ ప్రాంతంలో ఎయిర్ప్లేన్ రెస్టారెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది. భారతదేశంతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అనేక విమాన రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి, అయితే భారతదేశంలో గుజరాత్లో ప్రారంభించబడిన ఈ రెస్టారెంట్ ప్రపంచంలోనే 9వ ఎయిర్ప్లేన్ రెస్టారెంట్.
ఇది భారతదేశంలోని 4వ ఎయిర్ప్లేన్ రెస్టారెంట్. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్ప్లేన్ రెస్టారెంట్లలో ఒకటిగా భారతదేశపు కీర్తిని నలుదిశల్లో వ్యాపింపజేస్తుంది. కుటుంబం మరియు స్నేహితులతో కలిసి భోజనం చేయాలనుకునే వారికి ఈ రెస్టారెంట్ విమానంలో ప్రయాణించిన ఒక భిన్నమైన అనుభూతిని అందిస్తుంది.
నివేదికల ప్రకారం ఎయిర్బస్ 320 బెంగుళూరుకు చెందిన కంపెనీ నుండి ఈ రెస్టారెంట్ను స్థాపించడానికి కొనుగోలు చేయబడింది. ఈ విమానాన్ని రూ. 1.40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. విమానంలోని ప్రతి భాగాన్ని వడోదరకు తీసుకొచ్చి రెస్టారెంట్ ఏర్పాటు చేస్తారు. ఈ ఎయిర్ప్లేన్ రెస్టారెంట్ ఖరీదు ఇప్పుడు దాదాపు రూ. 2 కోట్లు. ఈ ఎయిర్ప్లేన్ రెస్టారెంట్లో మొత్తం 102 మంది కూర్చుని భోజనం చేయవచ్చు.
ఇక్కడికి వచ్చిన వారికి నిజమైన విమానం ఎక్కిన అనుభవం కలుగుతుంది. ఈ రెస్టారెంట్ యొక్క సర్వర్లు మరియు సిబ్బంది విమాన సహాయకులు వలె దుస్తులు కూడా ధరిస్తారు. కావున మీరు ఈ రెస్టారెంట్లో విమాన ప్రయాణ అనుభవాన్ని తప్పకుండా పొందవచ్చు.
ఈ ఎయిర్ప్లేన్ రెస్టారెంట్ లో వివిధ రకాల వంటకాలను అందుబాటులో ఉంటాయి, ఇందులో పంజాబీ, చైనీస్, ఇటాలియన్, మెక్సికన్ మరియు థాయ్ వంటకాలు ఉన్నాయి. ఈ ఎయిర్ప్లేన్ రెస్టారెంట్ లో గొప్ప అనుభూతిని పొందటం కోసం చాలామంది ప్రజలు వస్తున్నారు.
వడోదర ప్రాంతం ప్రజలు మాత్రమే కాకుండా, గుజరాత్ చుట్టుపక్కల వివిధ ప్రాంతాల ప్రజలు కూడా ఈ ఎయిర్ప్లేన్ రెస్టారెంట్లో భోజనం చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ ఏరోప్లేన్ రెస్టారెంట్ నిజంగా చాలామంది కళను నెరవేరుస్తుంది.
బోయింగ్ మరియు ఎయిర్బస్ ప్రపంచంలోని ప్రముఖ విమానయాన సంస్థలలో ఒకటి. ఎయిర్బస్ తన ప్రసిద్ధ విమానాలలో ఒకదానిని రెస్టారెంట్గా మార్చింది, దీనికి కస్టమర్ల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ ఎయిర్ప్లేన్ రెస్టారెంట్కి ఒక్కసారైనా వెళ్లాలని సోషల్ మీడియాలో చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
భారతదేశంలో కరోనా మహమ్మారి సమయంలో అనేక రంగాలతో పాటు హోటల్ రంగం కూడా తీవ్ర క్షీణణను చవిచూసింది. చాలా మంది హోటళ్లను మూసివేసి ఇతర ఉద్యోగాల కోసం వెతికే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో, ఈ ఎయిర్ప్లేన్ రెస్టారెంట్ యజమానులు వేరే వ్యూహాన్ని ఆశ్రయించారు. ఈ వ్యూహం వినియోగదారులను ఎంతగానో ఆకర్శించడంలో విజయం పొందుతోంది.
ఏరోప్లేన్ హోటల్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఇందులో నిజమైన విమానం ప్రయాణ అనుభవాన్ని పొందవచ్చు. ఇలాంటి విమాన హోటల్ లో మీరు కూడా భోజనం చేయాలనీ అనుకుంటే తప్పకుండా వడోదర ప్రాంతాన్ని సందర్శించి ఈ అద్భుతమైన అనుభవాన్ని పొందండి.
సాధారణంగా విమానాల్లో ప్రయాణించే వారు, విమానంలోని డోర్స్ చుట్టూ మరియు ఎమర్జెన్సీ ఎగ్జిట్ చుట్టూ ఒక మందపాటి లైన్ గమనించవచ్చు. అయితే చాలామంది ప్రయాణికులకు ఈ మందపాటి లైన్ ఎందుకు ఇవ్వబడుతుందనే అనుమానాలు వస్తుంటాయి.
విమానాల్లో కనిపించే ఈ మందపాటి లైన్స్ విమానం యొక్క ఆకర్షణను పెంచడానికి రూపొందించబడ్డాయి అని కొందరు అనుకోవచ్చు. కానీ ఇది కొంతమేరకు నిజమే అయినా, నిజానికి దీనిని విమానాలలో ప్రయాణించే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేయడం జరిగింది. విమానం డోర్స్ మరియు ఎమర్జెన్సీ ఎగ్జిట్ చుట్టూ భద్రత కోసం బోల్డ్ లైన్లు ఉపయోగించబడ్డాయి.దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.