Just In
- 1 hr ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 1 hr ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 2 hrs ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 4 hrs ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
Don't Miss
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Movies Prince yawar: ప్రిన్స్ యావర్కు హ్యాండిచ్చిన నయని పావని.. స్టేజీమీదే కన్నీరు పెట్టుకున్న కుర్రాడు!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నడి రోడ్డుపై మద్యం మత్తులో మహిళా మోడల్ వీరంగం.. దెబ్బ తిన్న ఇండియన్ ఆర్మీ Maruti Gypsy
దేశంలో చాలామంది వ్యక్తులు బాగా మద్యం సేవించి రోడ్డుపై రచ్చ రచ్చ చేయడం మీరు చూసే ఉంటారు. ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. మద్యం సేవించి రోడ్డుపై భీభత్సం సృష్టించిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇదే నేపథ్యంలో ఇలాంటి సంఘటన మళ్ళీ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం ఒక మోడల్ బాగా మద్యం తాగి రోడ్డుపై వచ్చి పోయే వాహనాలను ఆపుతూ హల్ చల్ చేసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నగరంలో సెప్టెంబర్ 8 న జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మీరు ఈ వీడియోలో గమనించినట్లతే ఇక్కడ కనిపిస్తున్న మోడల్, ఇండియన్ ఆర్మీ యొక్క Maruti Suzuki Gypsy (మారుతి సుజుకి జిప్సీ) ని కాళ్లతో తన్నడం కూడా చూడవచ్చు. ఈ మొత్తం సంఘటన తరువాత పోలీసులు ఆ ప్రదేశాన్ని సందర్శించి ఆమెను అరెస్టు చేశారు.
సెప్టెంబర్ 8 న గ్వాలియర్లోని పాండవ్ పోలీస్ స్టేషన్ ముందు రాత్రి 9 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు కారకురాలైన మోడల్ పేరు Kohima Mehra (కోహిమా మెహ్రా). ఈమె బాగా తాగి రోడ్డుపై అనేక వాహనాలను అడ్డగించి వాహనదారులపై దురుసుగా ప్రవర్తించింది ఆ వాహనాలలో Indian Army (ఇండియన్ ఆర్మీ) కి చెందిన Maruti Suzuki Gypsy కూడా ఉంది.
Maruti Suzuki Gypsy ని ఆమె తన్నుతూ, వాహనం యొక్క హెడ్లైట్ని కూడా పగలగొట్టింది. ఆ సమయంలో Maruti Suzuki Gypsy డ్రైవర్ దిగి ఆమెను నిలువరించడానికి ప్రయత్నించారు. కానీ ఆమె అతనిపై కూడా విరుచుకుపడింది. అక్కడ జరిగిన మొత్తం సంఘటన అక్కడున్న వారు మొబైల్ లో రికార్డ్ చేసారు. తాగిన స్థితిలో ఉన్న మోడల్, అక్కడ ఉన్న వ్యక్తులను కూడా అవమానించింది. అప్పుడే ఒక మహిళా కానిస్టేబుల్ వచ్చి ఆమెను పట్టుకున్నాడు.
మహిళా కానిస్టేబుల్ని వదిలించుకోవడానికి ఆమె ప్రయత్నిస్తోంది. కొంత సమయం తర్వాత ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను వైద్య పరీక్షలకు గురి చేశారు. వైద్యపరీక్షలో ఆమె అతిగా మద్యం సేవించినట్లు తేలింది. ఎక్సైజ్ చట్టం 34 ప్రభావంతో ప్రజలకు ఇబ్బంది కలిగించిన నేపథ్యంలో మోడల్కు జరిమానా విధించారు. మోడల్ యొక్క బెయిల్ కోసం ఇద్దరు స్నేహితులు పోలీస్ స్టేషన్కు వచ్చారు.
అయితే పోలీసులకు అందిన సమాచారం ప్రకారం, ఢిల్లీకి చెందిన ఈ మోడల్, సమీపంలోని హోటల్లో జరిగిన పార్టీలో అతీగా మద్యం సేవించినట్లు తెలిసింది. మద్యం మత్తు కారణంగా ఆమె రోడ్డుపై బీభత్సం సృష్టించింది. ఈ కారణంగా ఆమెపై పోలీసులు చర్య తీసుకున్నారు.
అయితే పోలీసులకు అందిన సమాచారం ప్రకారం, ఢిల్లీకి చెందిన ఈ మోడల్, సమీపంలోని హోటల్లో జరిగిన పార్టీలో అతీగా మద్యం సేవించినట్లు తెలిసింది. మద్యం మత్తు కారణంగా ఆమె రోడ్డుపై బీభత్సం సృష్టించింది. ఈ కారణంగా ఆమెపై పోలీసులు చర్య తీసుకున్నారు.
మోడల్ ఈ రకమైన సంఘటనకు కారణం అవ్వడం వల్ల, చాలా మంది సిటిజన్లు ఆమెపై కోపంగా ఉన్నారు. ఇండియన్ ఆర్మీ వాహనాన్ని దెబ్బతీయమ్ కూడా చాలా నేరం, అది మాత్రమే కాకుండా, ప్రజా రహదారిపై ఇలాంటి అకృత్యానికి పాల్పడిన నేరానికి తగిన శిక్ష విధించాలని అభిప్రాయపడుతున్నారు.
దేశంలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి, దీనికి కారణం మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేయడం, మితిమీరిన వేగం, సీట్ బెల్ట్ ధరించక పోవడం మరియు బైక్ రైడర్స్ హెల్మెట్ ధరించక పోవడం వంటివి ఈ ప్రమాదానికి కారణం అవుతున్నాయి. ఇవి మాత్రమే కాకుండా మనం పైన సెప్పుకున్న సంఘటనలు కూడా ప్రమాదాలకు కారణం అవుతాయి. అంతే కాకుండా రోడ్డుపై ఎక్కువ ట్రాఫిక్ ఏర్పడటానికి కూడా కారణం అవుతుంది.
ఇలాంటి సంఘటనలు వేలుగ్గులోకి రావడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక మహిళ మద్యం తాగి పబ్లిక్ రోడ్డుపై అటు ఇటు దొర్లుతూ హల్ చల్ చేసింది. నివేదికల ప్రకారం ఈ సంఘటన పూణేలో జరిగింది. ఈ ఘటనలో, తాగుడుకు బానిసైన ఒక మహిళ పూణేలోని తిలక్ రోడ్డులో ఎక్కువ న్యూసెన్స్ క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన మొత్తం సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.