Just In
- 17 min ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 1 hr ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- 2 hrs ago దిశా పటానీ కార్ల ప్రపంచం చూసారా.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
- 16 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
Don't Miss
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Movies ఆరియానా గ్లోరీ ఆత్మహత్యాయత్నం.. ఆ ప్రాబ్లమ్స్ వల్లే అంటూ రాసి మరీ!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే 'విస్టాడోమ్' కోచ్ ట్రయల్ రన్ సక్సెస్
ఇటీవలి కాలంలో భారతీయ రైల్వేస్ సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందింది. న్యూఢిల్లీలో ఇప్పటికే డ్రైవర్లెస్ మెట్రో రైళ్లు అందుబాటులోకి రాగా, తాజాగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే విస్టాడోమ్ టూరిస్ట్ కోచ్లను ప్రయాణీకుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇండియన్ రైల్వేస్ సన్నాహాలు చేస్తోంది.
ఈమేరకు విస్టాడోమ్ టూరిస్ట్ కోచ్ల ట్రయల్ రన్ను భారతీయ రైల్వేస్ విజయవంతంగా పూర్తి చేసిందని రైల్వే మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఈ కోచ్లు ప్రయాణికుల రైలు ప్రయాణాన్ని చిరస్మరణీయంగా మార్చబోతున్నాయని మరియు పర్యాటక రంగాన్ని కూడా ప్రోత్సహిస్తాయని ఆయన చెప్పారు.
ఈ విస్టాడోమ్ టూరిస్ట్ కోచ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారుచేస్తోంది. ఈ విలాసవంతమైన కోచ్లకు సంబంధించిన పలు చిత్రాలను పియూష్ గోయల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలతో పంచుకున్నారు
MOST READ:వెహికల్ ఛార్జింగ్ కోసం మొబైల్ ఛార్జింగ్ రోబోట్స్ ; పూర్తి వివరాలు
పియూష్ గోయల్ తన ట్విట్టర్ ఖాతాలో.. "ఈ సంవత్సరాన్ని చాలా గొప్పగా ముగిస్తున్నందు సంతోషంగా ఉంది. ఇండియన్ రైల్వేస్ కొత్తగా డిజైన్ చేసిన విస్టాడోమ్ టూరిస్ట్ కోచ్ యొక్క 180 కిలోమీటర్ల వేగ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ కోచ్లు ప్రయాణికుల రైలు ప్రయాణాలను చిరస్మరణీయంగా మారుస్తాయి మరియు పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహాన్నిస్తాయి " అని ట్వీట్ చేశారు.
ఇండియన్ రైల్వేస్ ఈ విస్టాడోమ్ కోచ్లను ప్రత్యేకించి టూరిజం ప్రయోజనాల కోసం డిజైన్ చేసింది. ఇందులో విలాసవంతమైన ఇంటీరియర్స్ మరియు సౌకర్యవంతమైన సీట్స్ ఉంటాయి. ఇవి విశాలమైన పారదర్శక కిటికీలు మరియు గ్లాస్ రూఫ్లను కలిగి ఉండి, ట్రైన్ లోపలి నుండి ప్రకృతి అందాలను పూర్తిగా వీక్షించేలా ఉంటాయి.
MOST READ:జనవరి 2021లోనైనా కొత్త ఫోర్స్ గుర్ఖా వచ్చేనా? థార్కి పోటీ ఇచ్చేనా?
భారత రైల్వేలో 13 విస్టాడోమ్ కోచ్లు ఉన్నాయి, అవి ప్రస్తుతం భారతదేశంలో ఎంపిక చేసిన మార్గాల్లో నడుస్తున్నాయి. దాదర్ మరియు మద్గావ్, అరకు వ్యాలీ, కాశ్మీర్ వ్యాలీ, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, కల్కా సిమ్లా రైల్వే, కాంగ్రా వ్యాలీ రైల్వే, మాథరన్ హిల్ రైల్వే మరియు నీలగిరి మౌంటైన్ రైల్వే మార్గాల్లో విస్టాడోమ్ కోచ్లు ఉన్నాయి.
అబ్జర్వేషన్ విండోస్, గ్లాస్ రూఫ్ లుకౌట్, రొటేటబుల్ సీట్లు, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్, మినీ ప్యాంట్రీ, వికలాంగుల కోసం విశాలమైన తలుపులు వంటి ఫీచర్లు ఈ కోచ్లోల ఉంటాయి. ఒక విస్టాడోమ్ కోచ్ తయారీకి సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
MOST READ:ఈ రోడ్డుపై ప్రయాణించడానికి ధైర్యం కావాలి.. ఈ వీడియో చూడటానికి గుండె ధైర్యం కావాలి
ఈ విస్టాడోమ్ కోచ్లలో ప్రయాణీకుల భద్రతకు భరోసా ఇచ్చేందుకు గాను ఇందులో అన్ని ప్రామాణిక భద్రతా ఫీచర్లు ఉంటాయి. అంతేకాకుండా, ఈ విస్టాడోమ్ కోచ్ల తయారీలో షాటర్స్-రెసిస్టెంట్ గాజులు మరియు ప్రయాణీకుల భద్రత కోసం ఫిల్మ్ కోటింగ్ను కూడా ఉపయోగించారు.
పశ్చిమ బెంగాల్లోని బంగవాన్ మరియు పెట్రాపోల్ మధ్య కొత్తగా విద్యుదీకరించిన రైలు మార్గంలో తమిళనాడులో నీలగిరి మౌంటైన్ రైల్వే సేవలను తిరిగి ప్రారంభించామని మరియు ఈ మార్గంలోని ఎలక్ట్రిక్ లోకోమోటివ్ విజయవంతంగా ట్రయల్ రన్ను పూర్తి చేసుకుందని గోయల్ ప్రకటించారు.
MOST READ:అటల్ టన్నెల్లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి
న్యూఢిల్లీలో డ్రైవర్లెస్ మెట్రో రైళ్లు
గత సోమవారం నాడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశపు మొట్టమొదటి డ్రైవర్రహిత మెట్రో రైలును దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సిఎంసి) సేవలను కూడా ఆయన ప్రారంభించారు. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.