ఇకపై ఈ రైళ్లకు డ్రైవర్ అవసరం లేదు.. ఇదెక్కడో కాదు మనదేశంలోనే..

భారత రైల్వేస్‌లో ఈరోజు మరో గుర్తుంచుకోదగిన అరుదైన సంఘటన జరిగింది. నేడు (సోమవారం) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశపు మొట్టమొదటి డ్రైవర్‌రహిత రైలును (డ్రైవర్‌లెస్ ట్రైన్ లేదా అటానస్ ట్రైన్)ను దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభించారు.

ఇకపై ఈ రైళ్లకు డ్రైవర్ అవసరం లేదు.. ఇదెక్కడో కాదు మనదేశంలోనే..

ఈ సందర్భంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్‌సిఎంసి) సేవలను కూడా ఆయన ప్రారంభించారు. మెజెంటా లైన్‌గా పిలిచే విమానాశ్రయం ఎక్స్‌ప్రెస్ లైన్‌లో న్యూఢిల్లీలోని జనక్‌పురి వెస్ట్, బొటానికల్ గార్డెన్‌ను కలుపుతూ డ్రైవర్‌లెస్ రైలు కార్యకలాపాలు కొనసాగుతాయి.

ఇకపై ఈ రైళ్లకు డ్రైవర్ అవసరం లేదు.. ఇదెక్కడో కాదు మనదేశంలోనే..

ఈ రైలు సేవలను పూర్తిగా యాంత్రికంగా నిర్వహిస్తారు, ఇందులో డ్రైవర్ అవసరం ఉండదు. ప్రస్తుతానికి ఈ సేవలు కేవలం మెజంటా లైన్‌కు మాత్రమే వర్తిస్తాయి. అయితే, ఈ ఏడాది మధ్య భాగం నాటికి డ్రైవర్ రహిత రైలు సేవలను పింక్ లైన్‌కు కూడా వర్తింప జేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

MOST READ:రెండు గంటల్లోనే రూ.29.5 లక్షల జరిమానాలు, పోలీసుల రికార్డ్

ఇకపై ఈ రైళ్లకు డ్రైవర్ అవసరం లేదు.. ఇదెక్కడో కాదు మనదేశంలోనే..

ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం ప్రయాణ సౌకర్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని ప్రధాని కార్యాలయం పేర్కొంది. మెజెంటా లైన్ ఢిల్లీలోని జనక్‌పురి వెస్ట్‌ను మరియు నోయిడాలోని బొటానికల్ గార్డెన్ లైన్‌తో కలుపుతుంది. ఈ అటానమస్ ట్రైన్ యొక్క ట్రయల్ రన్‌ను డిసెంబర్ 2017లో పింక్ లైన్‌లోని 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్వహించారు.

ఇకపై ఈ రైళ్లకు డ్రైవర్ అవసరం లేదు.. ఇదెక్కడో కాదు మనదేశంలోనే..

వచ్చే 2022 నాటికి ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్ మొత్తాన్ని డ్రైవర్ రహిత మెట్రోగా మార్చేందుకు భారత రైల్వేస్ మరియు ప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ డ్రైవర్ రహిత మెట్రో రైలుని ఢిల్లీ మెట్రోలోని మూడు కమాండ్ సెంటర్ల ద్వారా ఆపరేట్ చేస్తారు, ఈ కమాండ్ సెంటర్లలో సిబ్బంది మినహా రైలులో ఎలాంటి డ్రైవర్ ఉండరు.

MOST READ:మోడీ ప్రారంభించిన అటల్ టన్నెల్‌లో 7 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా ?

ఇకపై ఈ రైళ్లకు డ్రైవర్ అవసరం లేదు.. ఇదెక్కడో కాదు మనదేశంలోనే..

ఈ రైలులో కమ్యూనికేషన్ ఆధారిత రైలు నియంత్రణ సిగ్నలింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఇది రైలు ఆపరేషన్ సమయంలో ఎదురయ్యే ఏ సమస్యను అయినా పరిష్కరించగలదు. ఇందులో హార్డ్వేర్ పునఃస్థాపన సమయంలో మాత్రమే మానవ సాయం అవసరం అవుతుంది, మిగిలిన సందర్భాల్లో దీనిని నడిపేందురు డ్రైవర్ అవసరం ఉండదు.

ఇకపై ఈ రైళ్లకు డ్రైవర్ అవసరం లేదు.. ఇదెక్కడో కాదు మనదేశంలోనే..

కమాండ్ సెంటర్ నుండే ప్రయాణీకుల సమాచార వ్యవస్థను ఇన్ఫర్మేషన్ కంట్రోలర్ ద్వారా నియంత్రించడం జరుగుతుంది. అంటే, ప్రయాణీకులకు కావల్సిన సహాయం కూడా ఈ కమాండ్ సెంటర్ నుండే అందించబడుతుంది. సిసిటివిల సాయంతో క్రౌడ్‌ను పర్యవేక్షించడం మరియు రియల్ టైమ్ రైలు పరికరాలను పర్యవేక్షించడం జరుగుతుంది.

MOST READ:నిర్మానుష్య రోడ్డుపై వెళ్తున్నారా.. అయితే టేక్ కేర్.. ఎందుకో వీడియో చూడండి

ఇకపై ఈ రైళ్లకు డ్రైవర్ అవసరం లేదు.. ఇదెక్కడో కాదు మనదేశంలోనే..

ఈ ఆటోమేటిక్ రైలును ప్రస్తుతం లైన్ 7 మరియు లైన్ 8 లకు మాత్రమే పరిమితం చేశారు. రానున్న రోజుల్లో ఈ సేవలను మొత్తం ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్‌కు అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇక నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ విషయానికి వస్తే, ఈ కార్డు సాయంతో నగరంలోని వివిధ రకాల రవాణా సాధానాలను యాక్సెస్ చేసుకోవచ్చు. గతేడాది మార్చ్ నెలలో ఈ కార్డు రూపకల్పను శ్రీకారం చుట్టారు. ప్రజలు ఈ కార్డుతో మెట్రో, టోల్ టాక్స్, రైలు టికెట్, పార్కింగ్ ఛార్జ్ మరియు బస్సు ఛార్జీలను చెల్లించవచ్చు.

ఇకపై ఈ రైళ్లకు డ్రైవర్ అవసరం లేదు.. ఇదెక్కడో కాదు మనదేశంలోనే..

రూపే పథకం కింద నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు జారీ చేయబడింది. రూపే అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన జాతీయ కార్డు పథకం. ఇది వీసా లేదా మాస్టర్ కార్డ్ వంటి విదేశీ కార్డుల మాదిరిగానే పనిచేస్తుంది. అయితే, రూపే కార్డును ప్రత్యేకించి భారతదేశం కోసం తయారు చేయబడినది మరియు లావాదేవీల ఖర్చులను తగ్గించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టబడినది.

MOST READ:అద్భుతంగా ఉన్న మలయాళీ స్టార్ మమ్ముట్టి లగ్జరీ కారవాన్.. చూసారా !

ఇకపై ఈ రైళ్లకు డ్రైవర్ అవసరం లేదు.. ఇదెక్కడో కాదు మనదేశంలోనే..

రూపే కార్డులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల రూపంలో లభిస్తాయి. వీసా మరియు మాస్టర్ కంపెనీలతో పోల్చుకుంటే దీని లావాదేవీ ఖర్చులు తక్కువగా ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా 25 బ్యాంకులు ఈ రూపే కార్డులను జారీ చేస్తాయి. ఏటిఎమ్ నుండి నగదు విత్‌డ్రా చేయటానికి, షాపింగ్ చేయడానికి ఈ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డును కూడా ఉపయోగించవచ్చు.

Most Read Articles

English summary
India's first-ever driverless train inaugurated by PM Modi. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X