Ola Gigafactory దేశంలో విస్తరిస్తున్న ఓలా ఈవీ.. సెల్ ప్రొడక్షన్ కోసం తమిళనాడులో గిగా ఫ్యాక్టరీ నిర్మాణం
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఓలా కంపెనీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. టూవీలర్ విభాగంలో ఊహించని రీతిలో ఈ సంస్థ దూసుకుపోతోంది. తమ ఉత్పత్తులతో నాణ్యమైన స్కూటర్లను అందిస్తూ.. కస్టమర్లను ఓలా విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో దేశంలోనే టూవీలర్ సెక్టార్లో ఇతర కంపెనీలకు సవాల్ విసురుతోంది.
తాజాగా ఓలా గిగా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. తమిళనాడులోని కృష్ణగిరిలో పనులను ప్రారంభించింది. Ola Gigafactoryని అత్యంత వేగంగా పూర్తి చేయనుంది. తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులు మరియు భారతదేశంలో EV విప్లవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ఈ ఫ్యాక్టరీ దోహదపడుతుందని సంస్థ భావిస్తోంది.

సుమారు 115 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓలా గిగాఫ్యాక్టరీ వచ్చే ఏడాది ప్రారంభంలో 5 GWh ప్రారంభ సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇది దశల వారీగా 100 GWhకి విస్తరించబడుతుంది. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఓలా గిగాఫ్యాక్టరీ భారతదేశంలోనే అతిపెద్దగా అవతరించనుంది. పూర్తి సామర్ధ్యానికి విస్తరించినప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద సెల్ తయారీ సంస్థలలో ఒకటిగా నిలువనుంది.
గిగాఫ్యాక్టరీ మొదటి పిల్లర్ను ఇన్స్టాల్ చేయడం తమకు గర్వకారణంగా ఉందని ఓలా వ్యవస్థాపకుడు మరియు CEO భవిష్ అగర్వాల్ తెలిపారు. భారతదేశంలో ఈ ఎలక్ట్రిక్ ప్రయాణంలో గిగాఫ్యాక్టరీ ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నోవేషన్, టెక్నాలజీ, భారీ మ్యానుఫ్యాక్చరింగ్పై దృష్టి సారించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తుకి మరియు #EndICEAge నినాదానికి కట్టుబడి ఉన్నామని భవిష్ స్పష్టం చేశారు.

దేశంలో ఎలక్ట్రిక్ రంగ అభివృద్ధికి ఓలా ఎలక్ట్రిక్ ఓలా గిగా ఫ్యాక్టరీ దోహదపడుతుందని భవిష్ అగర్వాల్ చెప్పారు. దేశంలో ఇది కేవలం సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం మాత్రమే కాదని.. గ్లోబల్ EV హబ్గా మారే సామర్థ్యానికి తొలి అడుగు అని ఆయన పేర్కొన్నారు. ఈవీ రంగంలో దేశాన్ని శక్తివంతం చేయడం మరియు ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధిని పెంచడమే ఓలా లక్ష్యమని ఆయన వివరించారు.
ఓలా సెల్ & బ్యాటరీ రీసెర్చ్ అండ్ డెవలెప్మెంట్పై భారీగా పెట్టుబడిపెట్టింది. బెంగుళూరులో ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత అధునాతన సెల్ R&D సౌకర్యాలలో ఒకదాన్ని సంస్థ ఏర్పాటు చేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఓలా యొక్క బ్యాటరీ ఇన్నోవేషన్సెంటర్స్తో పాటు డెవలప్మెంట్ మరియు బ్యాటరీ ఆవిష్కరణలకు మూల స్తంభంగా వ్యవహరిస్తోంది.

కంపెనీ తన తయారీ సామర్థ్యాలను 2Ws, 4Ws మరియు సెల్లలో విస్తరించడానికి తమిళనాడు ప్రభుత్వంతో ఇటీవల ఒక MOU సంతకం చేసింది. ఎమ్ఒయులో భాగంగా, ఓలా ఒక EV హబ్ను ఏర్పాటుచేయనుంది. ఇది అధునాతన సెల్ మరియుఎలక్ట్రిక్ వాహనాల తయారీ సౌకర్యాలు, విక్రేత మరియు సరఫరాదారుల పార్కులు మరియు EVల కోసం అతిపెద్ద సహాయక పర్యావరణ వ్యవస్థను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంది.
అంతే కాకుండా ఓలా త్వరలో భారత్లో కంపెనీ తరపు నుంచి కొత్త ప్రొడక్ట్ను ప్రారంభించబోతోంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఓలా తాజాగా టీజర్ను సైతం విడుదల చేసింది. ఆ టీజర్ ద్వారా కంపెనీ జూలైలో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ని లాంచ్ చేస్తుందని అర్థమవుతోంది. భారత్లో ICE ద్విచక్ర వాహన విభాగానికి ఇదే అతిపెద్ద పోటీ అని కంపెనీ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇప్పటికే ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం జూలైలో రెండు కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించి కంపెనీ నుంచి అధికారికంగా టీజర్ను విడుదల అయింది. నియాన్ గ్రీన్ మరియు బ్లూ కలర్ స్కీమ్ కలర్స్ ఉండవచ్చని అంచనా. ఓలా S1 ఎయిర్ 4 కలర్స్లో, S1 స్కూటర్ 11 రంగులు, S1 ప్రో 12 రంగుల్లో మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం FAME II సబ్సిడీని తగ్గించడంతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర పెరిగింది. దీని కారణంగా, ఎస్1 ఎయిర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.10 లక్షలు, ఎస్1 రూ.1.30 లక్షలు మరియు ఎస్1 ప్రో రూ.1.40 లక్షలకు చేరింది. గత మేలో కంపెనీ 30,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి అమ్మకాల్లో దూసుకుపోతోంది.


Click it and Unblock the Notifications








