ఈ మహీంద్రా సెంచురో టెలివిజన్ ప్రకటనను చూశారా?
మహీంద్రా టూవీలర్స్ ఇటీవల విడుదల చేసిన తమ అధునాతన 110సీసీ మోటార్సైకిల్ 'మహీంద్రా సెంచురో' కంపెనీ ఓ వినూత్న టెలివిజన్ కమర్షియల్ను రూపొందించింది. మహీంద్రా సెంచురో బైక్ యొక్క విశిష్టమైన ఫీచర్లను హైలైట్ చేసేలా ఈ ప్రకటన సాగుతుంది. ఈ ప్రకటనను పోలండ్ దేశమలో క్రాకౌ ప్రాంతంలో చిత్రీకరించారు. దీని గురించి నేను ఎక్కువ చెప్పను కానీ, మీరే ఈ క్రింది వీడియోని తిలకించండి.
మహీంద్రా సెంచురో విషయానికి వస్తే, దేశీయ విపణిలో ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లు, సరసమైన ధరకే ఇది లభిస్తోంది. భారత మార్కెట్లో దీని ధర రూ.45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ప్రారంభ ఆఫర్లో భాగంగా మొదటి 10,000 యూనిట్ల సెంచురో బైక్లను కేవలం రూ.44,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లకే అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఈ బైక్పై కంపెనీ ఐదేళ్ల వారంటీని ఆఫర్ చేస్తుంది.
మహీంద్రా సెంచురో బైక్లో కంపెనీ దేశీయంగా అభివృద్ధి చేసిన 106.7 సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 8.5 పిఎస్ల శక్తిని, 8.5 ఎన్ఎమ్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 85.4 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ బైక్కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి.

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్



Click it and Unblock the Notifications








