ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే భారతదేశపు అతి పెద్ద వాహన ప్రదర్శన ఆటో ఎక్స్పో 2018 గ్రేటర్ నోయిడాలో ఫిబ్రవరి 7 2018 నుండి ప్రారంభం కానుంది. 37 వాహన తయారీ కంపెనీలు మరియు ఇతర సంస్థలు అధునాతన కార్లు, బైకులు, బస్సులు, ట్రక్కులు, ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ వాహనాలు మరియు అత్యాధునిక ఆటోమొబైల్ టెక్నాలజీని ఆటో ఎక్స్పో 2018లో ఆవిష్కరించనున్నాయి. 14 వ భారతదేశపు ఆటో షో ఫిబ్రవరి 14, 2018 న ముగియనుంది.
SHOW FULL CONTENT 2018 ఇండియన్ ఆటో ఎక్స్పో వేదిక మీద భవిష్యత్ ప్రజా రవాణాలో కీలకపాత్ర పోషించే ఎలక్ట్రిక్ వెహికల్స్ను దిగ్గజ తయారీ సంస్థలు మరియు టెక్నాలజీ దిగ్గజాలు కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించనున్నాయి.
ఏదేమైనప్పటికీ, ఇండియన్స్కు ఆటో ఎక్స్పో 2018లో వచ్చే కొత్త బైకులు మరియు కార్ల మీదే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అందులో మారుతి సుజుకి మరియు టాటా మోటార్స్ ఆవిష్కరిస్తున్న మోడళ్ల మీద భారీ అంచనాలు ఉన్నాయి.
ఆటో ఎక్స్పో 2018లో డ్రైవ్స్పార్క్ తెలుగు టీమ్ కవరేజ్ ఇలా ఉండనుంది:
- కార్లు: ఆటో ఎక్స్పో 2018 ఎన్నో కొత్త కార్ల ఆవిష్కరణకు వేదిక కాబోతోంది. అందులో, సరికొత్త మారుతి స్విఫ్ట్, టయోటా వియోస్, మహీంద్రా టివోలి మరియు టాటా నుండి రెండు కొత్త కార్లు. దేశీయ విపణిలోకి కొత్తగా పరిచయం అవుతున్న కియా మోటార్స్ మరియు ఎమ్జి మోటార్స్ తమ నూతన మోడళ్లను ఈ ఆటో ఎక్స్పోలో రివీల్ చేస్తున్నాయి.
- బైకులు మరియు స్కూటర్లు: పలు దేశీయ మరియు విదేశీ టూ వీలర్ల తయారీ సంస్థలు అధునాతన కమ్యూటర్ మరియు పర్ఫామెన్స్ మోటార్ సైకిళ్లతో పాటు స్కూటర్లను ఆటో ఎక్స్పో వేదిక ఆవిష్కరించడానికి సిద్దమయ్యాయి. అందులో హీరో ఎక్స్పల్స్, బిఎమ్డబ్ల్యూ జి310ఆర్ మరియు జి310 ఎస్, సుజుకి 125సీసీ మ్యాక్సి స్కూటర్ బర్గ్మ్యాన్ 125 అదే విధంగా హోండా, టీవీఎస్, యుఎమ్ మోటార్ సైకిల్స్ మరియు ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీ సంస్థలు హీరో ఎలక్ట్రిక్, ఒకినవ స్కూటర్స్ తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.
-
కాన్సెప్ట్ మోడళ్లు: పలు వాహన కంపెనీలు అభివృద్ది దశలో ఉన్న ఎలక్ట్రిక్, ఎలక్ట్రిక్ ఆధారిత కార్లు మరియు బైకులను కాన్సెప్ట్ రూపంలో ఆవిష్కరిస్తున్నాయి. ఈ ఆటో షోలో రెనో నుండి బాంకర్స్ ట్రెజోర్, సుజుకి ఇ-సర్వైవర్ మరియు హ్యుందాయ్ నుండి కోనా ఎలక్ట్రిక్ వెహికల్స్ 2018 ఆటో ఎక్స్పో వేదికగా వస్తున్నాయి.
SHOW LESS