Just In
- 12 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 12 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 13 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 15 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Movies Guppedantha Manasu March 29th: మను ఇక్కడే ఉంటాడంటున్న వసు.. వద్దంటూ గొడవ చేస్తున్న అనుపమ!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కరోనా ఎఫెక్ట్ : ఇండియాలో హీరో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లాంచ్ ఇక ఎప్పుడో తెలుసా..?
ఇండియన్ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీదారులలో హీరో మోటార్స్ ఒకటి. హీరో కంపెనీ ఇప్పటికే చాలా మోటార్ సైకిల్స్ ని మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు సంస్థ కొత్త ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ ఎఇ-47 బైక్ లాంచ్ చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. కానీ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనా మహమ్మారి వల్ల ఈ లాంచ్ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
హీరో ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ ఎఇ-47 ను భారత మార్కెట్లో విడుదల చేయడాన్ని హీరో కంపెనీ వాయిదా వేసింది. ఫాస్ట్ బైక్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో ఎలక్ట్రిక్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ ముంజాల్ ఈ వార్తను ధృవీకరించారు.
భారతదేశంలో 2020 సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్పోలో హీరో ఎలక్ట్రిక్ ఎఇ -47 మోటార్సైకిల్ను మొదటిసారి ప్రదర్శించారు. ఆరు నెలల్లో ఎఇ-47 ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ ప్రయోగం సాధ్యమని ఇంటర్వ్యూలో నవీన్ ముంజాల్ పేర్కొన్నారు. కానీ కోవిడ్ 19 వల్ల ఈ ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ ప్రవేశాన్ని కనీసం ఒక సంవత్సరం ఆలస్యం చేయాలని ఇప్పుడు నిర్ణయించారు.
MOST READ: పాదచారుల ఓవర్పాస్పై కార్ డ్రైవ్ చేయడం ఎప్పుడైనా చూసారా..!
ప్రస్తుతం దేశీయ మార్కెట్ లో అమ్మకాలు కొంత తక్కువగా ఉన్నందున ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ ఆలస్యం అవుతోంది. అంతే కాకుండా కరోనా వల్ల ఆటో పరిశ్రమలు ఇప్పటికే మూసివేయబడ్డాయి. కాబట్టి ఈ వాహనాల ఉత్పత్తికి మరియు విక్రయించడానికి సాధ్యం కాదు.
భారతదేశంలో ఒకసారి లాంచ్ అయిన హీరో ఎలక్ట్రిక్ ఎఇ 47 ప్రీమియం ధర రూ. 2 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఇది దాని మెజారిటీ కస్టమర్లకు అందుబాటులో ఉండదు. వినియోగదారులు అధిక పనితీరును కోరుకుంటున్నారు. కానీ ఇది బ్యాటరీతో పని చేయడం వల్ల సాధారణ బైక్ లాగ్ ఉండదని పోతాయని ముంజల్ పేర్కొన్నారు.
MOST READ: కరోనా ఎఫెక్ట్ : వాయిదా పడిన స్కోడా ఆక్టావియా లాంచ్
హీరో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లో ఉన్న ఈ సమస్యను అధిగమించడానికి, ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ తయారీదారులు అధిక సామర్థ్యం గల బ్యాటరీలలో పెట్టుబడులు పెట్టాలి లేదా దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి. ఈ రెండూ ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ కి ఎక్కువ మొత్తం ఖర్చు పెరుగుతుంది.
హీరో ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ గురించి మాట్లాడుతుంటే ఎఇ 47 3.5 కెడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్తో జతచేయబడిన 4 కెడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ రెండు రైడింగ్ మోడ్లను కలిగి ఉంటుంది. అవి ఒకటి ఎకో మరియు రెండు స్పోర్ట్ మోడ్స్. ఈ బైక్ ఒకే ఛార్జ్తో 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల (ఎకో మోడ్లో) సామర్త్యాన్ని కలిగి ఉంటుంది.