ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి జాక్ పాట్..

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం ఇందుకోసం లక్ష ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయబోతోంది. ఇలా కొనుగోలు చేసిన వాహనాలను ప్రభుత్వం తమ ఉద్యోగులకు అందించనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి జాక్ పాట్..

ఈ ప్రణాళిక కోసం దేశీయ మరియు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల సహాయంతో ఇఎమ్ఐ ప్రాతిపదికన తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందించే ప్రణాళికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి జాక్ పాట్..

ఈ పథకం కేవలం రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఉద్యోగులు మాత్రమే కాకుండా, సహకార సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు పెన్షనర్లను కూడా కవర్ చేస్తుంది. వివిధ సంస్థల నుండి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకే తమ ఉద్యోగులకు అందుబాటులో ఉంచనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి జాక్ పాట్..

సాధారణంగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఒకే ఛార్జీపై 40-100 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తాయి. అదనంగా, ఈ ఎలక్ట్రిక్ వాహనాలపై మూడేళ్ల పాటు ఎలాంటి మెయింటినెన్స్ చార్జీలను వసూలు చేయరు. అంతేకాకుండా, సాధారణ పెట్రోల్ టూవీలర్లతో పోల్చుకుంట, ఈ ఎలక్ట్రిక్ టూవీలర్లు సున్నా ఉద్ఘారాలను విడుదల చేస్తాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి జాక్ పాట్..

ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగులకు పర్యావరణ సాన్నిహిత్యమైన రవాణా సదుపాయాలను అందించాలనే లక్ష్యంతో ఈ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయటానికి వీలుగా సున్నా వడ్డీ రేట్లను మరియు 24 నుండి 60 నెలల వరకు అందుబాటులో ఉన్న ఈఎమ్ఐ స్కీమ్‌లను ప్రభుత్వం అందించనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి జాక్ పాట్..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్ఎల్) ఈ ప్రాజెక్టులో గణనీయమైన సహకారాన్ని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తన ఈవీ విధానాన్ని కూడా విడుదల చేసింది. సప్లయ్ మరియు డిమాండ్ వైపుల నుండి ఇ-మొబిలిటీ పర్యావరణ వ్యవస్థ యొక్క వాటాదారులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి జాక్ పాట్..

రాష్ట్రంలో ఈవీ పార్కులను అభివృద్ధి చేయడానికి 500 నుండి 1,000 ఎకరాల భూమిని కేటాయించాలనే ప్రతిపాదనను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో అంతర్గత మౌలిక సదుపాయాలు, సాధారణ సౌకర్యాలు మరియు బాహ్య మౌలిక సదుపాయాలు కూడా ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి జాక్ పాట్..

ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకమైన ఆటో క్లస్టర్లు మరియు ఆటోమోటివ్ సప్లయర్స్ తయారీ కేంద్రాల డెవలపర్‌లకు రాష్ట్ర ప్రభుత్వం స్థిర మూలధన పెట్టుబడిపై 50 శాతం ఆర్థిక సహాయం అందిస్తుంది. అలా కాకుండా, ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్లు మరియు హైడ్రోజన్ ఉత్పత్తి మరియు ఫ్యూయెల్ ఫిల్లింగ్ మౌలిక సదుపాయాలకు కూడా ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి జాక్ పాట్..

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త మరియు పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థలపై పనిచేస్తోంది. అదే ఏజెన్సీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన సప్లయర్స్ నుండి టెండర్లను కూడా కోరిందని కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రామన్ రెడ్డి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి జాక్ పాట్..

ఇటీవల, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంబులెన్సులు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వాహనాలు మరియు చెత్త పికప్ ట్రక్కుల వంటి నాలుగు చక్రాలు మరియు ట్రక్కులను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసిన విషయం తెలిసినదే. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగులు గ్రామ సచివాలయంలో వాలంటీర్లుగా పనిచేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, April 19, 2021, 12:50 [IST]
English summary
Andhra Pradesh To Offer Electric Two-wheelers To Its Government Employees, Details. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+