ఊపందుకున్న హీరో మోటోకార్ప్ సేల్స్.. భారీగా పెరిగిన డిసెంబర్ అమ్మకాలు
భారతదేశంలో అతిపెద్ద బైక్ తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ యొక్క 2020 డిసెంబర్ నెల అమ్మకాల నివేదిక 2021 జనవరి 1 విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన నివేదిక ప్రకారం హీరో మోటోకార్ప్ 2020 డిసెంబర్ నెలలో 4,47,335 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది.

హీరో మోటోకార్ప్ కంపెనీ 2019 డిసెంబర్ నెలలో 4,24,845 యూనిట్లను విక్రయించింది. 2019 డిసెంబర్తో పోలిస్తే 2020 డిసెంబర్లో అమ్మకాల శాతం దాదాపు 5.02% పెరిగినట్లు స్పష్టమవుతుంది. 2020 డిసెంబర్ నెలలో కంపెనీ 4,15,099 యూనిట్లను విక్రయించింది.

2019 సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది బైక్ అమ్మకాలు 2.84% పెరిగాయి. 2020 డిసెంబర్లో 32,236 యూనిట్ల స్కూటర్లు అమ్ముడయ్యాయి. 2019 ఇదే నెల డిసెంబర్లో 21,220 యూనిట్ల స్కూటర్లు అమ్ముడయ్యాయి.

2020 మరియు 2021 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో అంటే అక్టోబర్-డిసెంబర్ లో 18.45 లక్షల వాహనాలను విక్రయించినట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. హీరో మోటోకార్ప్ దేశీయ అమ్మకాలు 2020 డిసెంబర్లో 3.16% పెరిగి 4,25,033 యూనిట్లకు చేరుకున్నాయి.

హీరో మోటోకార్ప్ 2019-2020 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 15.41 లక్షల వాహనాలను విక్రయించింది. గణాంకాల ప్రకారం, గత త్రైమాసికంలో అమ్మకాలు భారీగా 19.7% పెరిగినట్లు తెలిసింది. నవంబర్ 2020 తో పోలిస్తే డిసెంబర్లో అమ్మకాలు పెరిగాయన్నారు చెప్పాలి. 2020 నవంబర్లో కంపెనీ 5,41,437 యూనిట్లను విక్రయించింది.

హీరో మోటోకార్ప్ కంపెనీ యొక్క సమాచారం ప్రకారం ఈ కొత్త సంవత్సరం నాటికి అన్ని ద్విచక్ర వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీ యొక్క వివిధ మోడల్స్ కి అనుకూలంగా ధరలు పెరగనున్నాయి. కానీ ఏ వేరియంట్ మీద ఎంత ధర పెరుగుతుందనే విషయాన్ని స్ఫష్టం చేయలేదు. అయితే ధరల పెరుగుదల జనవరి 1 నుండి అమలులోకి వస్తుంది.

కంపెనీ యొక్క ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల బైక్, స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్ ధరలు పెరిగాయని హీరో మోటోకార్ప్ నివేదించింది. ధరల పెరుగుదల గురించి డీలర్లకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. ద్విచక్ర వాహనాల ధరను దాదాపు రూ. 1500 పెంచనున్నారు.

కంపెనీ యొక్క ప్రస్తుత అమ్మకాలు కరోనా మహమ్మరోకి ముందువున్న స్థాయికి చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. కరోనా లాక్ డౌన్ పూర్తిగా నివారించబడిన తర్వాత అమ్మకాలు యథాస్థానానికి చేరుకున్నాయి. ఇది మాత్రమే కాకుండా పండుగ సందర్భంగా కంపెనీ అమ్మకాలు కూడా పెరిగాయి.

కంపెనీ రోడ్సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రాంను 350 రూపాయల వార్షిక చందాతో ప్రారంభించింది. కంపెనీ ప్రారంభించిన ఈ రోడ్సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రాంను సద్వినియోగం చేసుకోవాలి. కంపెనీ ఈ సర్వీస్ ని 24x7 అందిస్తుంది. రోడ్సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రాం ద్వారా మీ బైక్ ఎక్కడైనా ఎక్కడైనా దెబ్బతిన్నట్లయితే, ఈ సర్వీస్తో పరిష్కరించవచ్చు.


Click it and Unblock the Notifications








